అన్వేషించండి

Telangana News: KCR వస్తున్నారు.. అధికార పార్టీని గట్టిదెబ్బ కొడతారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న BRS బాస్

ఈనెల 12వ తేది నుండి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు గులాబీ బాస్ కేసిఆర్ హాజరుకానున్నారు. ఏడాది కాలంగా అసెంబ్లీకి దూరంగా ఉన్న కేసిఆర్ , ఇక అధికారపార్టీని గట్టిదెబ్బ కొట్టేందుకు సై అంటున్నారు.

BRS Chief KCR | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఏడాది గ్యాప్ తరువాత అసెంబ్లీకి వచ్చేందుకు సిద్దమైయ్యారనే వార్త బిఆర్ ఎస్ క్యాడర్ లో మాంచి జోష్ నింపింది. అవును మీరు వింటున్నది నిజమే , ఈ నెల 12వ తేది నుండి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరైయ్యేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారట. సరిగ్గా ఏడాది క్రితం బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీకి వచ్చినా , అది ఒక్కరోజే , అలా బడ్జెట్ అవ్వగానే, ఇలా మీడియా పాయింట్ లో మాట్లడి వెళ్లిపోయారు. అది మొదలు ఆ తరువాత అసెంబ్లీ వైపే కన్నెత్తి చూడలేదు గులాబి బాస్ . కానీ సారి అలా కాదట, అది కొత్త ప్రభుత్వం కాబట్టి వదిలేశాం , ఇప్పుడు అలా కాదు..గులాబి గట్టిదెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారట కేసిఆర్. 

ఈ 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు

తాజాగా క్యాబినేట్ నిర్ణయంతో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారైయ్యాయి. ఈనెల 12వ తేది నుండి 27వ తేది వరకూ  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈనేపధ్యంలో సమావేశాల మొదటి రోజునుండే ఈసారి కేసీఆర్ హాజరు కాబోతున్నారని సన్నిహితుల చెప్పేశారట. గత ఏడాది బడ్జెట్ అవ్వగానే రావడం కాకుండా ఈసారి బడ్జెట్ లో లోపాలు, కేటాయింపులను ఎత్తిచూపడంతోపాటు ,పెండింగ్ ప్రాజెక్టుల మొదలు ఆరు గ్యారంటీల వరకూ అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కులు చూపించాలని ఫిక్స్ అయ్యారట కేసిఆర్. ఇప్పటి నుండి క్యాడర్ కు సంకేతాలు ఇవ్వడంతోపాటు అధికార పార్టీని ఇరుకున పెట్టే వ్యూహాలకు పదునుపెట్టార పెద్దాయన.

తెలంగాణ భవన్ లో అప్పుడప్పుడూ సమావేశాలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఎక్కువశాతం ఫామ్ హౌస్ నుండే పార్టీని నడిపిస్తున్న కేసిఆర్. గత ఏడాది మూడు సార్లు మాత్రమే తెలంగాణ భవన్ లో పార్టీనేతలు, కార్యకర్తలతో విస్తృతస్దాయి సమావేశాలు నిర్వహించారు. రెండు వారాల క్రితం జరిగిన పార్టీ సమావేశంలో ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.అంతేకాదు అన్ని గమనిస్తున్నాని , నేను కొడితే దెబ్బ ఎలా ఉంటదో చూపిస్తానంటూ హాట్ కామెంట్స్ తో బిఆర్ ఎస్ క్యాడర్ లో కొత్త జోష్ నింపారు. అలా దాదాపు తక్కువ సందార్భాల్లో మాత్రమే బయటకు వస్తూ, అరుదుగా మాత్రమే మాట్లడుతున్న కేసీఆర్ పై గత కొంత కాలంగా అధికార కాంగ్రెస్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లడాలి  కేసిఆర్ అంటూ ఆ పార్టీ మంత్రులు బహిరంగ సవాలు విసురుతున్నారు. ఎవరు ఇంతలా టార్గెట్ చేసినా , వ్యూహాత్మక మౌనం వహించిన కేసిఆర్ ఇప్పుడు అసెంబ్లీకి వెళ్లాల్సిన  టైమొచ్చిందని ఫిక్సైయ్యాట.

గ్యారంటీలపై గ్యారంటీగా నిలదీస్తారా?

ఆరు గ్యారెంటీల అమలులోనూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పథకాలు అమలు ప్రారంభించినా, లబ్ధిదారుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.  నిరుద్యోగుల ఆందోళనలు,రైతుల సాగునీటి కష్టాలు, ఆర్దిక భారంతో రైతు ఆత్మహత్యలు, ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టులు ఇలా వీటికితోడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన 420హామీలు ఇలా ఇవన్నీ నిలదీయాల్సిన సమయం ఇదేనని భావించిన గులాబి బాస్ రాబోయే అసెంబ్లీ సమావేశలు వేదికగా దూసుకుపోనున్నారట.

ఇదిలా ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదంటూ హైకోర్టులో ఇప్పటికే పిటీషన్ దాఖలైయ్యింది. అనర్హత వేటు కూాడా వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో ఇక డుమ్మా కొట్టడం అన్ని విధాలా అనుకూలం కాదనే రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. అయితే బిఆర్ స్ కేడర్ నుండి విభిన్న వాదనలు విపిస్తున్నాయి. కేసిఆర్ వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో దిగజారి మాట్లడతారు, దూరంగా ఉంటే మంచదని కొందరంటుంటే, కాదు కేసిఆర్ రావాలి, రేవంత్ ప్రభుత్వాన్ని అసెంబ్లీనే నిలదీయాలని మరో వర్గం నేతలు భావిస్తున్నారట. మొత్తానికి ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కేసిఆర్ మాత్రం అసెంబ్లీకి ఈసారి కచ్చితంగా వస్తున్నారని ఆయన సన్నిహితులు తేల్చేశారు.

Also Read: LRS In Telangana: ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లిస్తున్నారా, వారికి మాత్రమే 25 శాతం రాయితీ- ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి

టాప్ హెడ్ లైన్స్

Railway Board Rejects Free MMTS: ఉచిత ఎంఎంటీఎస్‌కు రైల్వేబోర్డు నో - తెలంగాణ ప్రభుత్వానికి షాక్
ఉచిత ఎంఎంటీఎస్‌కు రైల్వేబోర్డు నో - తెలంగాణ ప్రభుత్వానికి షాక్
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Embed widget