అన్వేషించండి

SSMB29: రాజమౌళి సినిమాలో 'రుద్ర'గా మహేష్ బాబు - ఆ వార్తల్లో నిజమెంతో తెలుసా?

Mahesh Babu: రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో లేటెస్ట్ మూవీ 'SSMB29'. సినిమాలో మహేష్ క్యారెక్టర్ పేరుపై ఓ క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో అది నిజమేనా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Mahesh Babu As Rudra In Rajamouli SSMB29 Project: ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ 'SSMB29'. దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో 'SSMB29' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మహేష్ 'రుద్ర'గా (Rudra) కనిపించనున్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు ఏ క్యారెక్టర్ చేసినా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అప్పటి 'పోకిరి' నుంచి మొన్నటి 'గుంటూరు కారం' వరకూ ఆయన క్యారెక్టర్ పేర్లలో ఓ యునిక్ నెస్ ఉంటుంది. అతడులో 'పార్థు', ఖలేజాలో 'సీతారామరాజు', పోకిరీలో 'పండు', గుంటూరు కారంలో 'రమణ'గా అలరించారు. ఇక.. జక్కన్న, మహేష్ బాబు మూవీ గురించి ఎలాంటి చిన్న అప్ డేట్ ఇప్పటివరకూ రాలేదు. ఈ క్రమంలో సినిమా గురించి ఓ చిన్న గాసిప్ వచ్చిన సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇటీవల హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో 12 రోజుల పాటు షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా పాల్గొన్నట్లు సమాచారం.

ఒడిశాకు మహేష్ బాబు

ఇటీవల మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాలో ఎంపికైనట్లు తెలుస్తోంది. తాజాగా.. ఎయిర్ పోర్టులో మహేష్ బాబు (Mahesh Babu), పృథ్వీరాజ్ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇందులో ఇరువురు స్టార్లు పోలీస్ అధికారులకు కరచాలనం చేస్తూ కనిపించారు. వీరిద్దరూ ఒడిశాలో 'SSMB29' మూవీ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా.. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్టు గురించి ఎలాంటి న్యూస్ కూడా బయటకు రాలేదు. చివరకు ప్రియాంక చోప్రా సైతం ఇందులో నటిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె మదర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దానికి మరింత బలాన్నిచ్చాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి టీం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఒడిశాలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాగా.. అక్కడ మరో 15 రోజులు షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ 'తండేల్' - ఒకే రోజు స్ట్రీమింగ్ అవుతోన్న 20 సినిమాలు.. చూసి ఎంజాయ్ చెయ్యండి!

ఈ సినిమా గురించి ఏ చిన్న హింట్ బయటకు వచ్చినా అది క్షణాల్లోనే ట్రెండింగ్ అవుతోంది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా.. ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహస ప్రయాణంగా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ కథలో కొంతభాగం కాశీలో జరుగుందని సమాచారం. దీంతో ఏకంగా కాశీ సెట్‌నే హైదరాబాద్‌లో షూటింగ్ కోసం వేశారట. ముఖ్యంగా వారణాసిలోని మణికర్ణిక ఘాట్ సెట్స్ వేశారనే టాక్ వినిపిస్తోంది. ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా, యూరోప్ దేశాల్లో షూటింగ్ చేయనున్నట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. 

Also Read: ఓటీటీలోకి మిస్టరీ థ్రిల్లర్ 'ది సీక్రెట్ ఆఫ్ వుమెన్' - ఇద్దరు మహిళల జీవితాల్లో జరిగిన అనూహ్య పరిణామాలేంటో తెలియాలంటే..?

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget