అన్వేషించండి

Anvesh Reddy: పసుపు రైతులకు మద్దతు ధర రావటం లేదు.. పసుపు బోర్డు తెస్తానని చెప్పి ఎన్నికల్లో అరవింద్ గెలిచాడు

పసుపు రైతులకు మద్దతు ధర రావటం లేదని.. రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. అకాల వర్షాల వల్ల పసుపు దిగుబడి తగ్గిందని చెప్పారు.

అకాల వర్షాలతో పంటలు నష్టపోయి పసుపు రైతులకు 25 శాతం మాత్రమే దిగుబడి వచ్చిందని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.... అకాల వర్షాల వల్ల వచ్చిన పంటను అమ్ముకోవడానికి మద్దతు ధర లేక పసుపు రైతులు పూర్తిగా నష్టపోతున్నారని అన్నారు. ప్రతి ఏటా ప్రారంభంలో ఉన్న ధర పంట పూర్తిగా చేతికొచ్చే వరకు ఉండడం లేదని, చివరలో ధర తగ్గి వ్యాపారులు లాభపడే విధంగా ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత రైతులు అనేక పోరాటాలు చేస్తే.. 2019 లో జరిగిన పోరాటాన్నిఆసరాగా తీసుకొని తాను గెలిస్తే పసుపు బోర్డు తీసుకువస్తానని ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసి ఇచ్చి.... ఇప్పుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు అన్వేష్ రెడ్డి.

పసుపు బోర్డు కంటే మెరుగైన ప్రాంతీయ కార్యాలయాన్ని తీసుకువచ్చానని అరవింద్ గొప్పలు చెప్పుకుంటున్నారని దానికి రూ. 2.73 కోట్ల నిధులు తీసుకువచ్చామని చెప్తున్నారని అన్వేష్ రెడ్డి అన్నారు. నిజానికి పసుపు బోర్డు, స్పైసిస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం పనితీరు వేరని చెప్పారు. ఎంపీ అరవింద్ రాజకీయాల్లోకి రాకముందే డిప్యూటీ డైరెక్టర్ తో ప్రాంతీయ కార్యాలయం ఉందని అరవింద్ వచ్చాక డైరెక్టర్ ను నియమించడం జరిగిందని అన్వేష్ రెడ్డి అన్నారు.

స్పైసిస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం మద్దతు ధర నిర్ణయించకుండా పసుపును ఉడికించే బాయిలర్ మిషన్లు, ఫాలిష్ చేసే మిషన్లకు సబ్సిడీ ఇవ్వడానికే ప్రాంతీయ కార్యాలయం పని చేయడం జరుగుతుందని అన్వేష్ రెడ్డి చెప్పుకొచ్చారు.  ప్రాంతీయ కార్యాలయంతో రైతులు లాభాపడటం లేదని, రైతులు కోరుకునేది మద్దతు ధర పసుపు బోర్డు అని అన్వేష్ రెడ్డి అన్నారు. దేశంలో మనుషుల ప్రాణాలకు హాని చేసే పొగాకు బోర్డు ఉంది కానీ ఆరోగ్యానికి మేలు చేసే పసుపు బోర్డు మాత్రం లేదని అన్నారు. రైతులు పోరాటం చేస్తే దానిని ఆసరాగా తీసుకొని అరవింద్ గెలిచి ఇప్పుడు మాట మారుస్తున్నాడని  అన్వేష్ రెడ్డి విమర్శించారు. పసుపు బొర్డు ఏర్పాటు, పసుపునకు మద్దతు ధర అనేది కేంద్రం చేతిలోనే ఉందని.., అయినా మద్దతు ధర ఇవ్వకుండా ప్రాంతీయ కార్యాలయం తీసుకొచ్చానని కల్లబొల్లి మాటలు చెబుతున్నాడని అరవింద్ పై అన్వేష్ రెడ్డి ఫైర్ అయ్యారు.

కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పసుపు రైతులను ఏకతాటిపైకి తెచ్చి పసుపు బోర్డు, పసుపునకు మద్దతు ధర ఉద్యమం చేస్తామని అన్వేష్ రెడ్డి అన్నారు. అరవింద్ కు మరొక అవకాశం ఇస్తున్నాం ఇప్పటికైనా పసుపు రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుంటే రైతులే తగిన బుద్ధి చెబుతారని అన్నారు అన్వేష్ రెడ్డి.

Also Read: Dasari Arun Kumar: దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు... మద్యం మత్తులో కారుతో బీభత్సం

Also Read: Jagityala Crime: జగిత్యాలలో దారుణం... మంత్రాల నెపంతో ముగ్గురి దారుణ హత్య..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Crime News: ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP DesamCSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Crime News: ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
CM Chandrababu: పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
Embed widget