అన్వేషించండి

Jagityala Crime: జగిత్యాలలో దారుణం... మంత్రాల నెపంతో ముగ్గురి దారుణ హత్య..!

జగిత్యాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం తారకరామ నగర్ లో ముగ్గురిని వెంటబడి దారుణంగా హత్య చేశారు. మంత్రాల నెపంతో హత్య చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

తెలంగాణలోని జగిత్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల తారకరామనగర్‌లో ముగ్గురిని హత్య చేశారు. తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్‌లను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కుల సంఘం సమావేశం జరుగుతుండగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రాల నెపంతో ముగ్గురిని హత్య చేసినట్లు స్థానికులు అంటున్నారు. ఈ హత్యల సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ రూపేష్‌కుమార్‌, డీఎస్పీ ప్రకాశ్‌, సీఐ కృష్ణకుమార్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసేందుకు కారణాలపై విచారణ చేపట్టారు. 

Also Read: తెలంగాణలో మరో కుంభకోణం? గిడ్డంగుల సంస్థలో రూ.కోట్లు కాజేసేందుకు కుట్ర!

చిత్తూరు జిల్లాలో దారుణం

 తాళి కట్టిన భర్తను భార్యే విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నరసారావు పేటకు చేందిన రవిచందర్‌కు గిద్దలూరుకి చేందిన వసుంధరకు 25 ఏళ్ళ క్రితం వివాహం అయ్యింది. అప్పటి నుండి రేణిగుంటలో‌ని బుగ్గ వీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ‌ కుమారుడు కూడా ఉన్నాడు. రవిచందర్ చిన్న పరిశ్రమను నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో తాను నడిపే పరిశ్రమ వద్ద ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా కొద్ది నెలల పాటు అక్రమ సంబంధం బయటకు రాకుండా రవిచందర్ రహస్యంగా కొనసాగించేవాడు. 

Also Read: హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వాడాల్సిన మందుల లిస్టు ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

అయితే తన భర్తకు మరొక మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న వసుంధర తరచూ రవిచందర్‌తో గొడవ పడేది. భర్తను మందలించే ప్రయత్నం చేసింది. కానీ, భర్తలో ఎటువంటి మార్పు రాకపోవడంతో రవిచందర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను నిలదీసింది. అయినా పలితం లేకపోవడంతో రోజూ ఇంట్లో భర్తతో గొడవకు దిగేది. ఈ వివాదం కాస్త రోజు రోజుకి అధికం అయ్యేది. ఇంట్లో కుమారుడికి మతిస్తిమితం లేని కుమారుడిని చూసుకోవాల్సింది పోయి మరొక మహిళతో అక్రమ సంబంధం ఎందుకని వసుంధర గట్టిగా భర్తను నిలదీసేది. ఇలా మాట మాట పెరిగి.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.  ఆ కోపంతో ఉన్న వసుంధర ఒక్కసారిగా భర్త రవిచందర్ పై ఓ కత్తితో దాడి చేసింది. రవిచందర్ ను అత్యంత క్రూరంగా హత్య చేయడమే కాకుండా అతని తలను, మొండేన్ని వేరు చేసి ఆ తలను ఓ కవర్‌లో వేసుకుని పోలీసులకు లొంగి పోయేందుకు ఆటోలో బయలు దేరింది. ఇంతలో ఆమె ఒంటిపై రక్తం మరకలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు వసుంధరను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తన భర్తతో విభేదాల కారణంగానే హత్య చేసినట్లు పోలీసులకు వసుంధర తెలిపినట్లు సమాచారం.

Also Read: కన్నా లక్ష్మీ నారాయణకి కోర్టులో చుక్కెదురు, కోడలు వేసిన పిటిషన్ వల్లే.. ఆమెకు కోటి చెల్లించాల్సిందేనని తీర్పు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Goldman Suryabhai Arrest: ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!
Ketan Agarwal Murder Case: 'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా
'కేతన్ పెట్టుకునే విగ్గు, నత్తి మాటలు నచ్చలేదు- బాధపెట్టడం కంటే చంపడం ఈజీ' పోలీసులకే షాక్‌లు ఇస్తున్న సియా

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget