ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని లింగాల గ్రామంలో బుధవారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పోడు భూముల పోరు యాత్రను చేపట్టారు.
పోడు భూముల సమస్య పరిష్కారం కోరుతూ ములుగు జిల్లాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు పోడు భూముల సమస్యలను షర్మిల దృష్టికి తీసుకెళ్లారు.
‘సీఎం కేసీఆర్ దొర.. గిరిజనులు నీకు బానిసలా’ అని షర్మిల ప్రశ్నించారు.
జల్, జంగిల్, జమీన్ కోసం ఆనాడు కొమురం భీం పోరాటం చేస్తే నేడు అడవి బిడ్డలు పోడు భూములను కాపాడుకోవడమే ధ్యేయంగా పోరాటం చేస్తున్నారని షర్మిల అన్నారు.
కేసీఆర్ గిరిజనుల భూములను లాక్కొని వారిపై కేసులు మోపుతూ జైళ్లలో పెడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
హుజూరాబాద్లో ఎన్నికలు వచ్చేసరికి కేసీఆర్ దళితులకు బంధువయ్యాడని, గిరిజనులకు బంధువు కాడా? అని షర్మిల ప్రశ్నించారు.
పోరు భూముల పోరుకు ఆదివాసులు, గిరిజనులు హాజరయ్యారు.
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్య్ర దినోత్సవం
Republic Day Celebrations 2023: రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - జెండా ఎగుర వేసిన గవర్నర్
KCR Chadar To Ajmer Dargah: అజ్మీర్ దర్గాకు చాదర్ సమర్పించిన సీఎం కేసీఆర్
కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకొని పాదయాత్రకు బయల్దేరిన నారా లోకేష్
Pawan Kalyan : కొండగట్టు అంజన్న సన్నిధిలో అంజనీ పుత్రుడు, వారాహికి ప్రత్యేక పూజలు
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
APPSC Group1 Prelims Results: గ్రూప్-1 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే! మెయిన్స్కు 6,455 మంది ఎంపిక!
Perni Nani : అన్నీ మంచి చేస్తే రోడ్డెందుకు ఎక్కాల్సి వచ్చింది ? లోకేష్కు పేర్ని నాని కౌంటర్ !
Pawan Kalyan: ఈ పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా - వివాదాస్పద టాపిక్ టచ్ చేసిన బాలయ్య - పవర్ ప్రోమో చూశారా?