Breaking News: మరోసారి ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీ - మద్దతు ప్రకటించిన చంద్రబాబు, నితీష్
Latest Telugu Breaking News: ఏపీ అసెంబ్లీ, దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఓటర్లు అనూహ్య తీర్పు ఇచ్చారు. ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
LIVE

Background
మరోసారి ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీ - మద్దతు ప్రకటించిన చంద్రబాబు, నితీష్
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే (NDA) కూటమి కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చింది. అయితే ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీని కూటమి నేతలు ఎన్నుకున్నారు. ఎన్డీయే పక్షనేతగా నరేంద్ర మోదీకి కూటమి నేతలు మద్దతు తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్ మద్దతు లేఖలను అందజేశారు.
ప్రధాని రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ప్రధాని రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు.
నంబర్ గేమ్ మొదలైంది, అంతా సిద్ధంగా ఉండండి - మంత్రులతో మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా సమర్పించే ముందు కేంద్ర మంత్రులతో కేబినెట్ సమావేశం నిర్వహించారు. జూన్ 8వ తేదీన మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రులతో సమావేశమైన ఆయన తదుపరి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. గెలవడం, ఓడిపోవడం రాజకీయాల్లో అత్యంత సహజమని కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ హితబోధ చేశారు.
చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తా: రేవంత్ రెడ్డి
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు (Chandrababu) ఆహ్వానిస్తే తాను తప్పకుండా వెళ్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానని అన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది చట్టబద్ధతతో కూడుకున్న హామీ అన్న రేవంత్.. రాహుల్ గాంధీ విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. ఈ విషయంపై తమ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతానని అన్నారు.
Breaking News: ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు. పవన్ కల్యాణ్ కూడా కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయన కూడా సమావేశానికి హాజరుకానున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

