అన్వేషించండి

Tollywood Drugs : టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు క్లోజ్ .. ఈడీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది !?

టాలీవుడ్ ప్రముఖులందరూ డ్రగ్స్ కేసులో క్లీన్‌గా బయటకు వచ్చారు. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు క్లీన్ చిట్ ఇవ్వగా.. ఇప్పుడు ఈడీ కూడా మరకలేం లేవని తేల్చేసింది.


టాలీవుడ్‌కు డ్రగ్స్ మరక పూర్తిగా తొలగిపోయినట్లయింది. ఇప్పటి వరకూ ఆయా తారలపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఓ వైపు తెలంగాణ పోలీసులు ఆధారాల్లేవని కోర్టుకు తేల్చి చెబితే.. అనూహ్యంగా మధ్యలో విచారణ ప్రారంభించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌ కూడా ఎలాంటి ఆధారాలు లేవని.. తమ కేసును కూడా క్లోజ్ చేస్తోంది. దీంతో నాలుగేళ్లకుపైగా మానసికంగా ఇబ్బంది పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తారలకు రిలీఫ్ లభించినట్లయింది. 

Also Read : 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్‌లో రాజమౌళి చూపించబోయేది ఇదే... మళ్లీ సేమ్ స్ట్రాటజీ!

2017 నుంచి టాలీవుడ్‌ను వెంటాడుతున్న డ్రగ్స్ కేసు ! 

2017లో  ఓ హీరో సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. దాన్ని విశ్లేషించిన తర్వాత  డ్రగ్స్ కేసులను బయటకు తీశారు. రవితేజ తగ్గర్నుంచి పూరి జగన్నాథ్ వరకు చార్మీ దగ్గర్నుంచి ముమైత్ ఖాన్ వరకూ... అరవై మందికిపైగా టాలీవుడ్ ప్రముఖులను పోలీసులు విచారించారు. దాదాపుగా అందరి దగ్గర్నుంచి గోళ్లు, వెంట్రుకలు తీసుకున్నారు. వాళ్లు డ్రగ్స్ వాడారో లేదో తేల‌్చేస్తామని సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సభర్వాల్ నేతృత్వంలోని విచారణ బృందం ప్రకటించింది.  దాదాపుగా అందర్నీ విచారించిన తర్వాత వారి శాంపిల్స్ పంపాల్సిన చోటికి పంపిన తర్వాత కేసు సైలెంటయిపోయింది. 

Also Read: రాజమౌళి మూడు గంటల సినిమా తీశారా? 'ఆర్ఆర్ఆర్' రన్ టైమ్ ఎంత?

నిన్నామొన్నటిదాకా చార్జిషీట్లే దాఖలు చేయలేదు..! 

ఆ తర్వాత 2018 జూలైలో నలుగురు సినీ సెలబ్రిటీలపై ఆధారాలు దొరికాయని వారి గోళ్లు, వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికాయని మీడియాకు లీక్ ఇచ్చారు. కానీ తర్వాత  మళ్లీ సైలెంటయ్యారు.  ఆ కేసులన్నీ ఏమైపోయాయనే అంశంపై ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ సమాచార రక్కు చట్టం కింద  ఎక్సైజ్‌శాఖకి దరఖాస్తు చేసి వివరాలు సేకరించింది. 2020 సెప్టెంబర్‌ వరకూ చార్జిషీట్లు దాఖలు చేయలేదు. వివిధ డ్రగ్స్ కేసులలో పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నట్లుగా చెప్పారు కానీ సినీ ప్రముఖుల పేర్లు బయట పెట్టలేదు. దీంతో వారందరికీ అప్పట్లో క్లీన్ చిట్ ఇచ్చనట్లుగా స్పష్టమయింది. 

Also Read: 'జనని...' పాటకు జీవం పోసిన పాత్రలు ఇవే!

అనూహ్యంగా ఈడీ ఎంట్రీ ..! 

టాలీవుడ్  డ్రగ్స్ కేసులో అనూహ్యంగా ఈడీ ఎంట్రీ కావడం సంచలనం సృష్టించింది. గత ఆగస్టులో గతంలో విచారణకు హాజరైన వారిలో పూరి జగన్నాథ్, తరుణ్ , చార్మీ, నందు, రానా, రవితేజ సహా 11 మంది ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. నాలుగేళ్ల క్రితం నాటి కేసు.. అదీ కూడా తెలంగాణ పోలీసులు దాదాపుగా క్లీన్ చిట్ ఇచ్చిన కేసులో  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నుంచి సినీ ప్రముఖులకు నోటీసులు అందడం సంచలనాత్మకం అయింది. డ్రగ్స్ కొనుగోలు , అమ్మకాల వ్యవహారాల్లో జరిగే నగదు లావాదేవీలు అక్రమం. ఆ కోణంలోనే దర్యాప్తు ప్రారంభించిందని అనుకున్నారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసిందని అనుకున్నారు. 

Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన

ఈడీ విచారణ చేస్తూండగానే అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసిన తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు ! 

ఓ వైపు ఈడీ టాలీవుడ్ సెలబ్రిటీల్ని విచారిస్తూండాగానే ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. డ్రగ్స్‌ కేసులో కెల్విన్ ఇచ్చిన స్టేట్‌మెంట్లలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టించడానికే అలా చెప్పారని తెలంగాణ ఎక్సైజ్ శాఖ కోర్టుకు చెప్పింది.  సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించినట్లు ఆధారాలు కూడా లేవన్నారు.  నిందితుడు కెల్విన్ చెప్పిన విషయాలను ఆధారాలుగా భావించలేమని ఛార్జిషీటులో పోలీసులు స్పష్టం చేశారు. వారి నుంచి సేకరించిన శాంపిల్స్‌లో డ్రగ్స్ ఆనవాళ్లు కూడా లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు. కెల్విన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే ప్రస్తుతం ఈడీ కేసును దర్యాప్తు చేసింది.   తెలంగాణ పోలీసులే తేల్చేయడంతో ఈడీ కూడా ఏమీ చేయలేకపోయినట్లుగా తెలుస్తోంది. 

Also Read: డెసిషన్ మారలేదు... పుకార్లకు మరోసారి చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్

తాజాగా ఈడీకీ దొరకని ప్రాథమిక ఆధారాలు.. కేసు క్లోజ్ ! 
 
సినీ తారలపై డ్రగ్స్ కేసుల్లో ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్న కారణంతో  ఆ కేసుల్ని ముగించేయాలని ఈడీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కెల్విన్ సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేశాడని చెబుతున్నాడు కానీ దానికి ఆధారాలు లేవని తేల్చేశారు. దీంతో ఈడీకి కూడా ఏం చేయాలన్నదానిపై క్లూ లేకుండా పోయింది. ఎక్సైజ్ శాఖ డ్రగ్స్ వాడలేదని కోర్టుకు చెప్పినప్పుడు డ్రగ్స్ కొన్నారని దాని కోసమే డబ్బు చెల్లించారని ఈడీ నిరూపించడం కష్టం సాధ్యంగా మారింది. ఎందుకంటే అసలు ఈడీ నమోదు చేసిన కేసే తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఆధారంగా చేసింది.  ఈడీ కూడా చివరికి ఏమీ లేదని తేల్చారు. దీంతో టాలీవుడ్‌కు నాలుగైదేళ్లుగా పట్టుకున్న డ్రగ్స్ టెన్షన్ తీరిపోయిటన్లయింది. 

Also Read: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

JD Chakravarthy : కమల్ హాసన్ కాలిగోటికి సరిపోను - కానీ ఈ రోల్ నా అదృష్టం... గాయపడ్డ సింహంపై జేడీ చక్రవర్తి రియాక్షన్
కమల్ హాసన్ కాలిగోటికి సరిపోను - కానీ ఈ రోల్ నా అదృష్టం... గాయపడ్డ సింహంపై జేడీ చక్రవర్తి రియాక్షన్
Biker Collection : బాక్సాఫీస్ సూపర్ రేసర్ బైకర్ - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
బాక్సాఫీస్ సూపర్ రేసర్ బైకర్ - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Rakasa Collection : రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
రాకాస సూపర్ కలెక్షన్స్ - ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిందిగా...
Zayn Marie Khan : డెకాయిట్ బ్యూటీ ఫోటోస్ వైరల్ - బాలీవుడ్ To టాలీవుడ్... అసలెవరీ జైన్ మేరీ ఖాన్?
డెకాయిట్ బ్యూటీ ఫోటోస్ వైరల్ - బాలీవుడ్ To టాలీవుడ్... అసలెవరీ జైన్ మేరీ ఖాన్?

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Embed widget