అన్వేషించండి

Man Suicide: మొదటి భార్య మరణాన్ని తట్టుకోలేక, ఆమె సమాధి వద్దే ఆత్మహత్య!

Man Suicide: ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్య పాప పుట్టిన రెండేళ్లకే చనిపోయింది. పాప కోసం మరో పెళ్లి చేస్కున్నాడు. అయినా ఆమెను మర్చిపోలేక ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు. 

Man Suicide: ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి వారు పెళ్లి కూడా చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ పాప పుట్టింది. అల్లారు ముద్దుగా పాపను పెంచుకుంటూ హాయిగా జీవనం సాగించారు. కానీ పాప పుట్టిన రెండేళ్లకే అతడి భార్య అకాల మరణం చెందింది. ఆమె మృతిని అతడు జీర్ణించుకోలేకపోయాడు. చాలా రోజుల పాటు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నాడు. కానీ అలా ఉంటే పాప ఒంటరి అవుతుందని నీవు మరో పెళ్లి చేసుకోవాలంటూ తల్లిదండ్రులు అతడిపై ఒత్తిడి తీసుకొచ్చారు. తన కోసం కాకపోయినా పాప కోసమైనా పెళ్లి చేసుకోక తప్పదని భావించిన అతడు మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 

భార్య గుర్తొచ్చినప్పుడల్లా సమాధి వద్దకు వెళ్లేవాడు..

గత ఏడాది రెండో భార్య కూడా గర్భం దాల్చింది. వీరికి పాప కూడా పుట్టింది. కానీ అతను మాత్రం మొదటి భార్యను మర్చిపోలేకపోతున్నాడు. ఆమె చనిపోయిన నాటి నుంచి గుర్తొచ్చినప్పుడల్లా సమాధి వద్దకు వెళ్లి కాసేపు గడిపి తిరిగొచ్చేవాబు. ఈ మధ్య ఎందుకో తెలియదు, మొదటి భార్య గుర్తుకొచ్చి మరింతగా బాధ పడుతున్నాడు. అది తట్టుకోలేక ఆమె సమాధి వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘనట స్థానికంగా సంచలనం రేపింది. 

రెండో భార్యకు పాప కూడా పుట్టింది..

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ కు చెందిన 28 ఏళ్ల పుట్ట సురేష్ నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పాప కూడా పుట్టింది. కానీ రెండేళ్లకే భార్య చనిపోయింది. అది తట్టుకోలేని సురేష్ మానసికంగా కుంగిపోయాడు. మరో రెండేళ్ల తర్వాత కుటుంబ సభ్యులు ఒప్పించి మరో యువతితో వివాహం జరిపించారు. వీరికి కూడా ఒక పాప పుట్టింది. అయినా తన మొదటి భార్యను మరిచిపోలేక తరచూ ఆమె సమాధి వద్దకు వెళ్లి బాధపడుతుండే వాడు. అక్కడే గంటల పాటు కూర్చొని విలపిస్తూ ఉండేవాడు. అది చూసిన ప్రతీ ఒక్కరూ అలా అక్కడకు వెళ్లొద్దు, రెండో భార్య, పిల్లలతో సంతోషంగా గడపమని చాలా చెప్పేవారు. కానీ అతను మొదటి భార్యపై ప్రేమతో సమాధి వద్దకు వెళ్లి కూర్చుంటూ సమయం గడిపేవాడు. 

గాంధీలో చికిత్స పొందతూ మృతి..

ఈ నెల 2వ తేదీన సమాధి వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని గాంధీకి సిఫార్సు చేశారు. అయితే సురేష్ అక్కడే చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. 

Also Read: Woman Rape: యువతిని గదిలో బంధించి సెక్యూరిటీ గార్డు అత్యాచారం, స్నేహంగా మెలిగితే ఇంత దారుణమా !

Also Read: Bhadradri Kottagudem News : మహిళా సర్పంచ్ పై అత్యాచారయత్నం, అవమానం భరించలేక ఆత్మహత్య!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పీజేఆర్ చనిపోతే ఎన్నికలు తెచ్చిన దుర్మార్గుడు కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ... అర్థరాత్రి రాజమౌళి మహేష్ కలిసి అంతా లీక్ చేసి పడేశారుగా
ArcelorMittal Nippon Steels Plant: రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
రూ.1.5 లక్షల కోట్లతో ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్ భారీ ప్లాంట్
8th Pay Commission: 8వ వేతన సంఘం అమల్లోకి రాగానే DA '0' ఎందుకు అవుతుంది, ఈ విషయం మీకు తెలుసా..
8వ వేతన సంఘం అమల్లోకి రాగానే DA '0' ఎందుకు అవుతుంది, ఈ విషయం మీకు తెలుసా..
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Embed widget