IND vs NZ Final: మోదీ స్టేడియంలో భారత్కు చేదు అనుభవాలు.. టీ20 ప్రపంచ కప్ ఫైనల్కు ముందు ఫ్యాన్స్ టెన్షన్
India record in ICC events in Ahmedabad, Narendra Modi Stadium: ఐసీసీ ఈవెంట్లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఓటములు టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

India record in ICC events in Ahmedabad, Narendra Modi Stadium: ఐసీసీ ఈవెంట్లలో అహ్మదాబాద్ వేదికగా భారత్కు ఉన్న రికార్డును చూసి టీ20 ప్రపంచకప్ ఫైనల్కు ముందు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫలితం తర్వాత అహ్మదాబాద్లో 1,30,000 మంది అభిమానులకు చేదు జ్ఞాపకంగా మారింది. భారత క్రికెట్కు ఆరోజు బాధాకరమైన రోజులుగా మిగిలిపోయింది.
మార్చి 8న జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్పై క్రికెట్ ప్రపంచం దృష్టి సారించిన సమయంలో భారత మద్దతుదారులలో మోదీ స్టేడియంపై ఆందోళన కనిపిస్తోంది. ఇండియా ఇతర చోట్ల దాదాపు అజేయంగా ఉన్నప్పటికీ, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఇటీవల స్వదేశీ జట్టుకు వ్యూహాత్మక, మానసిక పోరాట క్షేత్రంగా మారింది. అభిమానుల ఆందోళన కేవలం మూఢనమ్మకం మాత్రమే కాదు.. ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో టీమిండియాకు పరాభవాలు ఎదురవ్వడమే దీనికి కారణం.
2023 నాటి గాయాలు
అహ్మదాబాద్ ఫోబియాకు ప్రధాన కారణం 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్. భారత్ ఆ మ్యాచ్లో వరుసగా 10 విజయాల రికార్డుతో ప్రవేశించి ఫైనల్లోనూ గెలుపు ఖాయమనిపించింది. కానీ అక్కడి నెమ్మదైన పిచ్, ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ వ్యూహాలతో ఆ మ్యాచులో భారత్కు ఘోర పరాజయం తప్పలేదు. అహ్మదాబాద్లో ఆ నిశ్శబ్దం ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకంగానే ఉంది.
2026లోనూ కలిసిరావడం లేదా..
ప్రస్తుత టీ20 ప్రపంచకప్ ఫైనల్ పాత భయాలను మరింత పెంచింది. ఫిబ్రవరి 22న ఇదే వేదికపై భారత్ సాధించిన వరుస 12 టీ20 విజయాల రికార్డు బద్ధలైంది. సూపర్ 8 మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడిన సూర్యకుమార్ సేన కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఘోర పరాజయం అహ్మదాబాద్ పిచ్ కండిషన్స్పై జట్టుకు ఇంకా పూర్తి పట్టు రాలేదని నిరూపించింది.
టాస్ ప్రభావం చూపుతుందా..
అహ్మదాబాద్ పిచ్లు ఎప్పటినుంచో అస్థిరంగా ఉంటున్నాయి. డే-నైట్ మ్యాచ్లలో మొదటి ఇన్నింగ్స్లో పిచ్ "స్పంజీ" బౌన్స్ను ఇస్తుంది. దీనివల్ల మిస్టర్ 360 డిగ్రీగా పేరున్న సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు సైతం టైమింగ్ దొరకక ఇబ్బంది పడతారు. రెండో ఇన్నింగ్స్లో మంచు కురిసినప్పుడు, పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారి ఛేజింగ్ చేసే జట్టుకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ టాస్ అంశం సైతం అభిమానులను భయపెడుతోంది.
అహ్మదాబాద్లో భారత్ ఐసీసీ రికార్డు (కీలక మ్యాచ్లు)
నవంబర్ 19, 2023 - వన్డే ప్రపంచకప్ ఫైనల్ vs ఆస్ట్రేలియా.. భారత్ ఓటమి. ఫైనల్లో ఓటమితో భారత్ అజేయ పరంపర ముగిసింది. వన్డే వరల్డ్ కప్ చేజారింది.
ఫిబ్రవరి 18, 2026 - టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్ vs నెదర్లాండ్స్ - భారత్ గెలిచింది. కానీ 17 పరుగుల తేడాతో అతి కష్టమ్మీద విజయం సాధించింది.
ఫిబ్రవరి 22, 2026 - టీ20 ప్రపంచకప్ సూపర్ 8 vs దక్షిణాఫ్రికా - భారత్ ఓడిపోయింది. 2026 టోర్నీలో భారత జట్టుకు అత్యంత ఘోర పరాజయం.
ట్రెండింగ్ వార్తలు

















