అన్వేషించండి

AI Summit 2026: డ్రైవర్‌కు నిద్ర వస్తే కారు ఆగిపోతుందా? ప్రమాదాలకు AIతో ఎలా చెక్ పడుతుంది? టాటా తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటీ?

AI Summit 2026: AI సమ్మిట్ 2026లో ఆవిష్కరించిన కొత్త టెక్నాలజీతో కార్లు మీ వాయిస్ ఆధారంగా స్టార్ట్ అవుతాయి. మీరు నిద్రపోతున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

AI Summit 2026: సాంకేతిక పరిజ్ఞానం మనిషి ఊహకు అందనంత వేగంగా దూసుకుపోతోంది. నిన్నటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాలకే పరిమితమైన అద్భుతాలు ఇప్పుడు మన కళ్ల ముందే సాక్షాత్కరిస్తున్నాయి.  దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ 2026 ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు గ్లోబల్ సౌత్‌లో నిర్వహించిన మొదటి అతి పెద్ద ఏఐ సమ్మిట్‌గా చరిత్ర సృష్టించింది. 

ప్రధానమంత్ర నరేంద్రమోదీ ప్రారభించిన ఈ కార్యక్రమంలో ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్‌ ఆల్ట్‌మాన్‌, గూగుల్‌ సీఈవో సుందర్ పిచాయ్‌ వంటి దిగ్గజాలతోపాటు వందకుపైగా దేశఆల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐ భవిష్యత్‌పై చర్చించారు. అయితే ఈ సదస్సులో అయితే అందర్నీ ఆశ్చర్యపరిచిన అంశం మాత్రం ఆటోమొబైల్‌ రంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులు. ముఖ్యంగా భారతీయ దిగ్గజం టాటా మోటార్స్‌ ప్రదర్శించిన సరికొత్త ఏఐ ఫీచర్లు వాహన రంగ భవిష్యత్‌ను సరికొత్తగా నిర్వహించబోతున్నాయి. 

కారు చోరీలకు చెక్‌- మీ ఫేసే లాక్

నేటి కాలంలో వాహనాల చోరీలు అతిపెద్ద సమస్యగా మారాయి. కానీ ఇకపై ఆ భయం అక్కర్లేదని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మిట్‌లో టాటా మోటార్స్‌ ప్రదర్శించిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్‌ వాహన భద్రతలో సరికొత్త ప్రమాణాలను సెట్ చేస్తోంది. ఈ టెక్నాలజీ ప్రకారం కారును స్టార్ట్ చేయాలంటే కేవలం కీ ఉంటే సరిపోదు. డ్రైవర్‌ తన వేలి ముద్ర లేదా ఫేస్‌ ఐడెంటిఫికేషన్ నిర్దారించుకోవాలి. 

అనధికారిక వ్యక్తులు, లేదా దొంగలు కారు లోపలికి వెళ్లి బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేకుండా ఇంజిన్ స్టార్ట్ చేయలేరు. స్మార్ట్‌ఫోన్‌లో మనం చూసే సెక్యూరిటీ ఫీచర్లు ఇప్పుడు కార్లకు కూడా వర్తింపజేస్తున్నారు. అవసరం అయితే కుటుంబ సభ్యులు లేదా డ్రైవర్ల వివరాలను ముందే సిస్టమ్‌లో నమోదు చేసే వెసులుబాటు కూడా తీసుకొస్తున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు తగ్గే అవకాశం ఉంది. యువ డ్రైవర్ల వేగాన్ని నియంత్రించే వీలు కూడా కలుగుతుంది. 

వాయిస్ కమాండ్ కంట్రోల్

డ్రైవింగ్ అంటే స్టీరింగ్‌ పట్టుకోవడం గేర్లు మార్చడం అనే పాత పద్ధతులకు కాలం చెల్లబోతోంది. ఈ ఏఐ కార్లలో మీ మాటే కీలక పాత్ర పోషిస్తుంది. వాయిస్ కమాండ్లతో కారును నియంత్రించవచ్చు. ఇది కేవలం నావిగేషన్ మాత్రమే కాదు, కారు ఆటోమేటింక్‌గా నడిపించే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. 

లాంగ్‌డ్రైవ్‌లకు వెళ్లే వారికి వాయిస్ కమాండ్ ఫీచర్ వరప్రసాదం కానుంది. డ్రైవర్‌ శ్రమ పడకుండానే కారు తనంతట తానుగా గమ్యానికి చేరుకోగలదు. ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌లో టెస్లా వంటి సంస్థలు ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నప్పటికీ భారతీయ రోడ్లకు అనుగుణంగా టాటా వంటి సంస్థలు ఏఐ సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేస్తున్నారు. 

పొగమంచులోనూ సురక్షితమైన డ్రైవింగ్ 

భారత్‌లో శీతాకాలంలో పొగమంచు కారణంగా జరిగే ప్రమాదాలు చాలా ఎక్కువ. ఈ సమస్యకు ఏఐ చెక్‌ పెట్టబోతోంది. వాహనాల్లో అమర్చిన రాడార్‌, లిడార్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ సెన్సర్లు పొగమంచులో కూడా ముందు ఉన్న వాహనాల దూరాన్ని కచ్చితంగా గుర్తిస్తాయి. కంటికి కనిపించని అడ్డంకులను కూడా ఈ సెన్సర్లు గుర్తించి, వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూస్తాయి. దీని వల్ల తక్కువ విజిబిలిటీ ఉన్నా సరే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. 

డ్రైవర్ నిద్రపోతున్నా గుర్తించే ఏఐ

రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలలో డ్రైవర్ల నిద్ర మత్తు ఒకటి. ఈ సమస్యను పరిష్కరించేందుకు డ్రైవ్‌ డ్రౌజినెస్‌ డిటె్షన్ వ్యవస్థను ప్రదర్శించారు. ఈ సిస్టమ్‌ డ్రైవర్‌ ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ఐ బ్లింకింగ్‌ను గమనిస్తూ ఉంటుంది. ఒక వేళ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్టు గుర్తిస్తే, వెంటనే అలర్ట్ సౌండ్ ద్వారా హెచ్చరిస్తుంది. అలర్ట్‌కు డ్రైవర్ స్పందించకుంటే ఏఐ సిస్టమ్‌ మరింత వేగంగా స్పందిస్తుంది. ప్రమాదం జరగకుండా ఉండేందుకు కారు వేగాన్ని తగ్గిస్తుంది. ఆటోమేటిక్‌గా కారును ఆపేస్తుంది. 

భారతీయ ఆటోమొబైల్ రంగంలో సరికొత్త శకం 

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌ 2026 ద్వారా భారత్ గ్లోబల్‌ ఏఐ హెబ్‌గా ఎదుగుతోందని స్పష్టమైంది. ఒకప్పుడు కేవలం విదేశీ కార్లకే పరిమితమైన లగ్జరీ ఫీచర్లు ఇప్పుడు సామాన్యుల భద్రత కోసం అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి భవిష్యత్‌ స్టీరింగ్‌పై చేతులు ఉండకపోవచ్చు, కానీ మన స్వరమే కారును నడిపిస్తుంది. రోడ్డు భద్రత పరంగా ఈ ఏఐ విప్లవం దేశంలోనే గేమ్ ఛేంజర్‌గా మారబోతోంది.   

Frequently Asked Questions

AI సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది?

AI సమ్మిట్ 2026 భారతదేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఇది గ్లోబల్ సౌత్ లో జరిగిన అతి పెద్ద AI సమ్మిట్.

AI సమ్మిట్ 2026 ను ఎవరు ప్రారంభించారు?

AI సమ్మిట్ 2026 ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ AI CEO శ్యామ్ ఆల్ట్ మాన్, గూగుల్ CEO సుందర్ పిచాయ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

AI టెక్నాలజీతో వాహన చోరీలను ఎలా అరికట్టవచ్చు?

టాటా మోటార్స్ ప్రదర్శించిన బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిస్టమ్ తో వాహన చోరీలను అరికట్టవచ్చు. కారు స్టార్ట్ చేయడానికి డ్రైవర్ వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు అవసరం.

AI కార్లలో వాయిస్ కమాండ్ ఎలా పనిచేస్తుంది?

AI కార్లలో వాయిస్ కమాండ్ ద్వారా నావిగేషన్ తో పాటు కారును ఆటోమేటిక్ గా నడిపించవచ్చు. ఇది డ్రైవర్ శ్రమను తగ్గిస్తుంది.

పొగమంచులో సురక్షితమైన డ్రైవింగ్ కు AI ఎలా సహాయపడుతుంది?

వాహనాల్లోని రాడార్, లిడార్ సెన్సర్లు పొగమంచులో కూడా ముందున్న వాహనాల దూరాన్ని గుర్తించి, అడ్డంకులను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చూస్తాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Best Electric Scooters: టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలతో వస్తున్న టాప్‌ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు! రోజువారీ వాడకానికి ఇవి ఎందుకు ప్రత్యేకమైనవో తెలుసుకోండి?
టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలతో వస్తున్న టాప్‌ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు! రోజువారీ వాడకానికి ఇవి ఎందుకు ప్రత్యేకమైనవో తెలుసుకోండి?
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Car Discounts: ఎంజీ మోటార్‌ ఇండియా భారీ డిస్కౌంట్‌! ఇప్పుడు కారు కొంటే 3.70 లక్షల వరకు ఆదా!
ఎంజీ మోటార్‌ ఇండియా భారీ డిస్కౌంట్‌! ఇప్పుడు కారు కొంటే 3.70 లక్షల వరకు ఆదా!
Car Buying Tips: మహిళ పేరుతో కారు కొనడం వల్ల ప్రయోజనం ఏంటి? ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం వల్ల చాలా అవసరం !
మహిళ పేరుతో కారు కొనడం వల్ల ప్రయోజనం ఏంటి? ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం వల్ల చాలా అవసరం !
Advertisement

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget