అన్వేషించండి

Warangal Politics: కాంగ్రెస్ 'ఆపరేషన్ ఆకర్ష్' - ఆసక్తికరంగా వరంగల్ రాజకీయం

Warangal News: కాంగ్రెస్ పార్టీ 'ఆపరేషన్ ఆకర్ష్' మొదలుపెట్టింది. తొలుత కింది స్థాయి నేతలను పార్టీలోకి చేర్చుకునేలా ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వరంగల్ రాజకీయం ఆసక్తికరంగా మారింది.

Congress Operation Aakarsh in Warangal: తెలంగాణలో (Telangana) కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు నెల రోజులు పూర్తి కావొస్తోంది. ఇంతలోనే 'ఆపరేషన్ ఆకర్ష్' (Operation Aakarsh) మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వరంగల్ (Warangal) జిల్లాకు చెందిన బీఆర్ఎస్ (BRS) నేతలను హస్తం (Congress) పార్టీలోకి చేర్చుకునేలా ఆ పార్టీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. బుధవారం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ (Greater Warangal Corporation) కు చెందిన ఆరుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లే చేరారు. మరో 15 మంది హస్తం గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ కీలకంగా మారబోతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.

2021లో ఇదీ పరిస్థితి

వరంగల్ కార్పొరేషన్ లో.. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా 48 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 10 స్థానాలు గెలిచి రెండో స్థానంలో నిలవగా.. కాంగ్రెస్ 7 సీట్లు గెలుచుకుని మూడో స్థానంలో నిలిచింది. స్వతంత్రులు ఒకటి గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్లపై గురి పెట్టింది. ఇందులో భాగంగా బుధవారం ఆరుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరగా, మరో 15 మంది కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వరంగల్ పశ్చిమ, వర్దన్నపేట నియోజకవర్గాలకు చెందిన కార్పొరేటర్లు హస్తం గూటికి చేరిన వారిలో ఉన్నారు. బీజేపీ నుంచి సైతం ఇద్దరు కార్పొరేటర్లు చేరారు. వరంగల్ తూర్పు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.

ఇదే కారణమా.?

కార్పొరేటర్ల పదవీ కాలం మరో రెండేళ్లు ఉండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ కార్పొరేటర్లు డివిజన్ అభివృద్ధి పేరుతోనో, లేక ఇతర కారణాలతో అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వాదన వినిపిస్తోంది. గ్రేటర్ వరంగల్ లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు ఉండగా.. మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు 34 మంది కార్పొరేటర్లు కావాలి. అయితే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినా.. మేయర్ పీఠానికి వచ్చిన నష్టం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎందుకంటే మేయర్ పై అవిశ్వాసం పెట్టాలంటే కార్పొరేషన్ కు ఎన్నికలు జరిగి నాలుగేళ్లు పూర్తి చేసుకున్న తర్వాతే అవిశ్వాసం పెట్టి పడగొట్టవచ్చని చెబుతున్నారు. కానీ ఇప్పటికిప్పుడు అది జరిగే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు. అయితే, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు కాంగ్రెస్ లో కార్పొరేటర్లు చేరితే బలం చేకూరుతుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో కింద స్థాయి నేతల నుంచి 'ఆపరేషన్ ఆకర్ష్' మొదలుపెట్టి పూర్తిగా నేతలను చేర్చుకునేలా ప్లాన్ చేసినట్లు సమాచారం.  అయితే, దీనిపై బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.

Also Read: Congress Sharmila News : షర్మిల చేరికపై తెలంగాణ కాంగ్రెస్ లైట్ - ఒక్కరూ పట్టించుకోలేదు !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం

వీడియోలు

Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్
India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
జనవరి 5లోగా 784 మంది పీజీ డాక్టర్లకు పోస్టింగులు: మంత్రి సత్యకుమార్
Visakhapatnam News: వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
వైజాగ్ టూరిస్ట్ లకు గుడ్‌న్యూస్.. ఇకపై మ్యూజియాలన్నీ ఉదయమే ఓపెన్: VMRDA చైర్మన్ ప్రణవ్
Suriya 46 Movie : ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
ఆయనకు 45, ఆమెకు 20... ఇద్దరి మధ్య లవ్ - 'గజిని'కి లింక్ ఉందా!... సూర్య46 మూవీ స్టోరీ ఏంటంటే?
Cheapest Automatic Cars India: ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
ఆటోమేటిక్ కారు కావాలా? ఇవి అత్యంత చౌకైన కార్లు.. ధర 4.75 లక్షల నుంచి ప్రారంభం
Vijayawada Temple Power Cut: విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
విజయవాడ దుర్గ గుడికి కరెంట్ కట్ చేసిన విద్యుత్ శాఖ.. అసలేం జరిగింది
Cinnamon Water : 2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
2026లో బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? అయితే దాల్చినచెక్క నీరు తాగేయండి
Taiwan Earthquake: తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
తైవాన్‌లో భారీ భూకంపం.. కంపించిన ఎత్తైన భవనాలు - రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో ప్రకంపనలు
Amaravati Farmers: ఇంకా ఎంతమందిని చంపుతారు.. కేంద్రమంత్రి పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
ఇంకా ఎంతమందిని చంపుతారు.. పెమ్మసానికి అమరావతి రైతుల సెగ.. అసలు కోపం ఎమ్మెల్యేపై
Embed widget