అన్వేషించండి

Congress Sharmila News : షర్మిల చేరికపై తెలంగాణ కాంగ్రెస్ లైట్ - ఒక్కరూ పట్టించుకోలేదు !

Sharmila : షర్మిల చేరిక కార్యక్రమంలో తెలంగాణ నేతలు కనిపించలేదు. తెలంగాణ విషయంలో షర్మిల ప్రమేయం అసలు లేదని..ఇక ఉండదని సంకేతాలు పంపినట్లయింది.

Sharmila Joininig Program  : వైఎస్సాఆర్టీపీని గురువారం షర్మిల కాంగ్రెస్‌లో విలీనం చేశారు. షర్మిల చేరిక సందర్భంగా వేదికపై తెలంగాణ నేతలు కనిపించలేదు. ఏఐసీసీ ఆఫీసులోనే సీఎం రేవంత్ రెడ్డి సహా టీ కాంగ్రెస్ నేతలు ఉండిపోయారు. ఎవరూ వేదికపైకి రాలేదు. కాంగ్రెస్ వైఎస్సాఆర్టీపీ విలీనానికి టీపీసీసీ నేతలు దూరంగా ఉండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. వేదికపై ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు సహా సీనియర్ నేతలు మాత్రమే కనిపించారు. ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ నేతృత్వంలోనే విలీనం జరిగింది. 

షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. ఆమె వల్ల సమస్యలు వస్తాయని అనుకున్నారు. అందుకే విలీన ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు విలీన ప్రక్రియకు హాజరు అయితే షర్మిలకు తెలంగాణలో బాధ్యతలు ఇస్తారేమోనన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుందని.. అందుకే వెళ్లాల్సిన అవసరం లేదన్నట్లుగా ఆ నేతలు ఉండిపోయారని తెలుస్తోంది.  ఈ పరిణామంతో షర్మిల ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారని సంకేతాలు పంపినట్లయింది. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షర్మిల మద్దతు తెలిపారు. కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీలకూడదని బరిలో నుంచి తప్పుకున్నారు. తాను పోటీ చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని షర్మిల చెబుతున్నారు. అయితే ఆమె  పార్టీ విలీనంపై మాత్రం .. తెలంగాణ నేతలు ఎవరూ ఆసక్తి చూపించ  లేదు. 

షర్మిల ఈ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉన్నారు. దీనికి ముందే కాంగ్రెస్ లో విలీనం ప్రక్రియ కూడా జరగలేదు. ఒకవేళ కాంగ్రెస్ లో షర్మిల పార్టీ విలీనమై.. ఆమెను తెలంగాణలో ప్రచారానికి తిప్పి ఉంటే.. ఈ అవకాశాన్ని బీఆర్ఎస్ చక్కగా ఉపయోగించుకునేది. తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ కూతురు వస్తోంది అంటూ ప్రచారం చేసేవారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.  కేసీఆర్ వంటి వారు ఇలాంటి అవకాశం కోసమే కాచుకుకూర్చుని ఉన్నారు. షర్మిల సొంతంగా పోటీ చేసినా ఇదే ప్రచారం చేసేవారే. అయితే, దీనికి అవకాశం ఇవ్వకుండా చేశారు రేవంత్. టీపీసీసీ చీఫ్ గా ఆయన షర్మిల పార్టీ విలీనాన్ని వ్యతిరేకించారని చెబుతారు. ఒకవేళ ఏదైనా ఉంటే ఎన్నికల తర్వాత చూసుకుందాం అని అధిష్ఠానానికి చెప్పారని అంటారు.                        

ఇప్పుడు ఎన్నికల తర్వాత విలీనం చేసినా తెలంగాణపై ష్రమిల ముద్ర వద్దని.. ఏపీలో రాజకీయాలకు కావాల్సిన సహకారం అందిస్తామని  చెప్పి ఉంటారని అంటున్నారు. విలీనం  ఆగిపోయినా  కర్ణాటక డిప్యూటీ సిఎం డికె.శివకుమార్‌ వంటి వారు షర్మిలను ఎన్నికల బరి నుంచి వైదొలగేలా చేయగలిగారు. ఆమె రాజకీయ భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఒప్పించారు. దీంతో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బ తీయకూడదనే ఉద్దేశంతో తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించారు. ఇప్పుడు పార్టీలో విలీనం చేసినా .. తెలంగాణకు మాత్రం దూరంగా ఉండాని సంకేతాలు పంపారు.                           

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్

వీడియోలు

India vs Sri Lanka 3rd T20 Highlights | మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం
Rohit Sharma Golden Duck | రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్
Virat Kohli Half Century in Vijay Hazare Trophy | 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన కింగ్
Rinku Singh Century in Vijay Hazare Trophy | విజయ్ హజారే ట్రోఫీలీ రింకూ సింగ్ సెంచరీ
Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Division of Andhra Pradesh Districts: ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
ఏపీలో కొత్త జిల్లాలు, డివిజన్లపై డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ - చంద్రబాబు సమక్షంలో కీలక నిర్ణయం
Hyderabad Crime Report: హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
హైదరాబాద్‌లో 15 శాతం తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరిగిన అఘాయిత్యాలు
Shambhala Review : 'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
'శంబాల' టీం ఫుల్ జోష్ - హిందీ వెర్షన్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్!... ముంబైలో ప్రమోషన్స్
Prakash Raj : వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
వారిని మొరుగుతూనే ఉండనివ్వండి - అనసూయకు ప్రకాష్ రాజ్ సపోర్ట్
Duvvada Srinivas: నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
నా హత్యకు కృష్ణదాస్‌ కుట్ర, దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు! ఘాటుగా స్పందించిన మాజీ డిసీఎం
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Tata Sierra లేదా Hyundai Creta లలో మీకు ఏ SUV సరైనది ? ఫీచర్లు చూసి డిసైడ్ అవ్వండి
Hyderabad Drug Case: హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్‌లో హైఅలర్ట్- డ్రగ్స్‌ కట్టడికి అష్టదిగ్బంధనం- హీరోయిన్ సోదరుడి కోసం గాలింపు
Parvatipram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Embed widget