అన్వేషించండి

Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!

Telangana News: తెలంగాణలో ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని డీజీపీ జితేందర్ తెలిపారు. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యమని.. ఈసారి శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు.

Telangana DGP Released Annual Crime Report: తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈసారి 9.87 శాతం కేసులు పెరిగాయని.. 2,34,158  కేసులు నమోదైనట్లు రాష్ట్ర డీజీపీ జితేందర్ (DGP Jitender) తెలిపారు. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే పోలీస్ శాఖ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నేర వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాది శాంతి భద్రతలు బాగున్నాయని.. ఒకటి రెండు ఘటనలు మినహా పూర్తి అదుపులో ఉన్నట్లు చెప్పారు. 

'కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చాం. డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఏడాది 33,618 సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశాం. 703 చోరీ, 1525 కిడ్నాప్, 58 దోపిడీ, 856 హత్య, 2,945 అత్యాచారాల కేసులు నమోదు చేశాం. డయల్ 100కు 16,92,173 ఫిర్యాదులు వచ్చాయి. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేశాం. కొత్త చట్టం ప్రకారం సైబరాబాద్ పరిధిలో 15,360, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదు చేశాం. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.180 కోట్లను బాధితులకు తిరిగి అప్పగించాం. తెలంగాణవ్యాప్తంగా రూ.142.95 కోట్ల డ్రగ్స్ సీజ్ చేశాం. డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది నిందితులను అరెస్ట్ చేశాం.' అని వివరించారు.

పోలీస్ ఆత్మహత్యలపై..

తెలంగాణలో పోలీస్ ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ స్పందించారు. 'ఈ ఏడాది కాదు, ప్రతి ఏడాది ఏదో ఒక కారణంతో సూసైడ్ చేసుకుంటున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవు. చాలా చోట్ల వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణాలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. సంధ్య థియేటర్ ఘటన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌పైనా విచారణ సాగుతోంది. ఈ కేసులో సీబీఐకి లేఖ రాశాం. ప్రభాకరరావును అమెరికా నుంచి ఇండియాకు రప్పించేందుకు ఇప్పటికే  ఇంటర్ పోల్ సాయం తీసుకుంటున్నాం. హైదరాబాద్ తీసుకొచ్చేందకు టైం పడుతుంది.' అని పేర్కొన్నారు.

సోషల్ మీడియాపై స్పెషల్ మానిటరింగ్..

సోషల్ మీడియాపై ప్రత్యేక మోనిటరింగ్ ఏర్పాటు చేశామని.. అనధికార ప్రైవేటు ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. 'సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సోసల్ మీడియా ప్రచారాలపై దర్యాప్తు చేస్తాం. కేసులు పోలీసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సైబర్ క్రైమ్ కేసులు ఏమున్నా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా.. రూ.247 కోట్లు ఫ్రీజ్ చేశాం.' అని వివరించారు.

తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ఈ ఏడాది ముగ్గురికి న్యాయస్థానాలు మరణ శిక్ష విధించాయని.. హైదరాబాద్ ఇద్దరు, సంగారెడ్డి ఒక కేసులో మరణ శిక్ష విధించినట్లు డీజీపీ చెప్పారు. 'ఈ ఏడాది  రౌడీ షీటర్లకు 18 కేసుల్లో 35 మందికి జీవిత ఖైదు విధించారు. అత్యాచారం కేసుల్లో ఈ ఏడాది 3 కేసుల్లో నలుగురికి జీవిత ఖైదీ విధింపు. మహిళలపై దాడులకు సంబంధించి 51 కేసుల్లో 70 మందికి జీవిత ఖైదు విధించారు. పొక్సో కేసులు 77 నమోదు కాగా 82 మందికి శిక్ష ఖరారైంది. ఫింగర్ ప్రింట్స్ టీమ్ 507 కేసులు ఛేదించారు. 71 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించారు. షీ టీమ్స్ 10,862 పబ్లిక్ ప్రదేశాల్లో వేదింపులు ఫిర్యాదులు, అందులో 830 FIRలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 27 భరోసా సెంటర్లు ఏర్పాటు చేశాం. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఈ ఏడాది 20,702 రోడ్డు ప్రమాదాలు, కొత్తగా 11,64,645 సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం.' అని వివరించారు.

Also Read: New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Embed widget