అన్వేషించండి

Telangana DGP: 'డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యం' - పోలీసుల ఆత్మహత్యలపై స్పందించిన డీజీపీ, వార్షిక క్రైమ్ రిపోర్ట్ ఇదే!

Telangana News: తెలంగాణలో ఈ ఏడాది కేసుల నమోదు పెరిగిందని డీజీపీ జితేందర్ తెలిపారు. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే లక్ష్యమని.. ఈసారి శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పారు.

Telangana DGP Released Annual Crime Report: తెలంగాణలో గతేడాదితో పోలిస్తే ఈసారి 9.87 శాతం కేసులు పెరిగాయని.. 2,34,158  కేసులు నమోదైనట్లు రాష్ట్ర డీజీపీ జితేందర్ (DGP Jitender) తెలిపారు. డ్రగ్స్ లేని తెలంగాణ సాధనే పోలీస్ శాఖ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో నేర వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాది శాంతి భద్రతలు బాగున్నాయని.. ఒకటి రెండు ఘటనలు మినహా పూర్తి అదుపులో ఉన్నట్లు చెప్పారు. 

'కొత్త నేర చట్టాల అమలు కోసం పోలీసులకు శిక్షణ ఇచ్చాం. డిజిటల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ ఏడాది 33,618 సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేశాం. 703 చోరీ, 1525 కిడ్నాప్, 58 దోపిడీ, 856 హత్య, 2,945 అత్యాచారాల కేసులు నమోదు చేశాం. డయల్ 100కు 16,92,173 ఫిర్యాదులు వచ్చాయి. కొత్త చట్టం వచ్చిన తర్వాత 85,190 కేసులను నమోదు చేశాం. కొత్త చట్టం ప్రకారం సైబరాబాద్ పరిధిలో 15,360, హైదరాబాద్‌లో 10,501, రాచకొండలో 10,251 కేసులు నమోదు చేశాం. సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.180 కోట్లను బాధితులకు తిరిగి అప్పగించాం. తెలంగాణవ్యాప్తంగా రూ.142.95 కోట్ల డ్రగ్స్ సీజ్ చేశాం. డ్రగ్స్ కేసుల్లో 4,682 మంది నిందితులను అరెస్ట్ చేశాం.' అని వివరించారు.

పోలీస్ ఆత్మహత్యలపై..

తెలంగాణలో పోలీస్ ఆత్మహత్యలపై డీజీపీ జితేందర్ స్పందించారు. 'ఈ ఏడాది కాదు, ప్రతి ఏడాది ఏదో ఒక కారణంతో సూసైడ్ చేసుకుంటున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీస్ శాఖ పరంగా ఎలాంటి సమస్యలు లేవు. చాలా చోట్ల వ్యక్తిగత కారణాలతోనే బలవన్మరణాలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. సంధ్య థియేటర్ ఘటన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్‌పైనా విచారణ సాగుతోంది. ఈ కేసులో సీబీఐకి లేఖ రాశాం. ప్రభాకరరావును అమెరికా నుంచి ఇండియాకు రప్పించేందుకు ఇప్పటికే  ఇంటర్ పోల్ సాయం తీసుకుంటున్నాం. హైదరాబాద్ తీసుకొచ్చేందకు టైం పడుతుంది.' అని పేర్కొన్నారు.

సోషల్ మీడియాపై స్పెషల్ మానిటరింగ్..

సోషల్ మీడియాపై ప్రత్యేక మోనిటరింగ్ ఏర్పాటు చేశామని.. అనధికార ప్రైవేటు ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. 'సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సోసల్ మీడియా ప్రచారాలపై దర్యాప్తు చేస్తాం. కేసులు పోలీసులు మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సైబర్ క్రైమ్ కేసులు ఏమున్నా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చెయ్యండి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 43.33 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. 25,184 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా.. రూ.247 కోట్లు ఫ్రీజ్ చేశాం.' అని వివరించారు.

తగ్గిన రోడ్డు ప్రమాదాలు

ఈ ఏడాది ముగ్గురికి న్యాయస్థానాలు మరణ శిక్ష విధించాయని.. హైదరాబాద్ ఇద్దరు, సంగారెడ్డి ఒక కేసులో మరణ శిక్ష విధించినట్లు డీజీపీ చెప్పారు. 'ఈ ఏడాది  రౌడీ షీటర్లకు 18 కేసుల్లో 35 మందికి జీవిత ఖైదు విధించారు. అత్యాచారం కేసుల్లో ఈ ఏడాది 3 కేసుల్లో నలుగురికి జీవిత ఖైదీ విధింపు. మహిళలపై దాడులకు సంబంధించి 51 కేసుల్లో 70 మందికి జీవిత ఖైదు విధించారు. పొక్సో కేసులు 77 నమోదు కాగా 82 మందికి శిక్ష ఖరారైంది. ఫింగర్ ప్రింట్స్ టీమ్ 507 కేసులు ఛేదించారు. 71 గుర్తు తెలియని మృతదేహాలను గుర్తించారు. షీ టీమ్స్ 10,862 పబ్లిక్ ప్రదేశాల్లో వేదింపులు ఫిర్యాదులు, అందులో 830 FIRలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 27 భరోసా సెంటర్లు ఏర్పాటు చేశాం. గతేడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. ఈ ఏడాది 20,702 రోడ్డు ప్రమాదాలు, కొత్తగా 11,64,645 సీసీ కెమెరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాం.' అని వివరించారు.

Also Read: New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Akbaruddin Owaisi: హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
హైడ్రా ఒకటి కూల్చితే, మేం 100 కడతాం.. బెదిరింపులకు భయపడేది లేదన్న అక్బరుద్దీన్ ఒవైసీ
KTR On Polavaram Project: దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రోపై నిర్ణయాల అమల్లో జాప్యం ఎందుకు?: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి లేఖ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget