అన్వేషించండి

Bandi Sanjay: ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని బయటకు రప్పించాం... కేసీఆర్ నాటకాలు ఇక చెల్లవ్... బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు

ఫామ్ హౌస్ లో ఉండే సీఎం కేసీఆర్ ను బయటకు రప్పించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రైతులకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్‌ ఎవరి కోసం ధర్నా చేశారో ఆయనకే తెలియదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఎందుకు ధర్నా చేశారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ దీక్ష చేస్తే మోదీ సాగుచట్టాలు రద్దు చేశారనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ దీక్ష చేసింది రాష్ట్ర రైతుల కోసమా పంజాబ్‌ రైతుల కోసమా అని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లో ఉండే సీఎం కేసీఆర్​ను​ బయటికి రప్పించామని బండి సంజయ్ అన్నారు. ధర్నా చౌక్‌ వద్దన్న కేసీఆర్‌ అక్కడే ధర్నాకు కూర్చున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరుగుతున్న కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లర్ల కోసమే సీఎం కేసీఆర్‌ ధర్నా చేశారని బండి సంజయ్ ఆరోపించారు.

Koo App
శీతాకాలపు మంచు దుప్పటి కప్పుకున్న అరకు అందాలను ఎక్కువమంది పర్యాటకులు ఆస్వాదించటానికి వీలుగా మరిన్ని అద్దాల పెట్టెలతో (విస్టాడోమ్ కోచ్ లు) కూడిన అత్యాధునిక రైలు అందుబాటులోకి రాబోతోంది. ఇంకెందుకు ఆలస్యం,అరకు అందాలను ఆస్వాదిస్తూ,మీ జీవితంలో మధురానుభూతులను నింపటానికి సిద్ధం కండి. - Kishan Reddy Gangapuram (@kishanreddybjp) 21 Nov 2021

 

రైతులపై రాళ్లదాడి

తన పర్యటనను అడ్డుకునేందుకు రైతులు, బీజేపీ నేతలపై రాళ్ల దాడి చేయించారని ఆరోపించారు. 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం చెప్పిందని గుర్తుచేశారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్న ఆయన... ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రైతులను పట్టించుకోకుండా పంజాబ్‌ రైతులకు పరిహారం ఇస్తారా అని నిలదీశారు. 

Also Read: ఈ థియేటర్లలో సినిమాకి వెళ్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్!

తెలంగాణ రైతులకు రూ.25 లక్షల పరిహారం 

కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నా అందులో 10 శాతం కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనలేదని బండి సంజయ్ ఆరోపించారు. 'కొనుగోలు కేంద్రాల వద్దకు వడ్లు తేవొద్దంట.  వడ్లను యాడ పోసుకోవాలి. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా తడిసిన వడ్లు ప్రతి గింజా కొనాల్సిందే. దిల్లీలోనంట రైతులు చనిపోయిండ్రంట. వాళ్లకు 3 లక్షల రూపాయలు ఇస్తాడట. ముందుగా తెలంగాణలో వేలమంది రైతులు చనిపోయిండ్రు. NCRB రిపోర్ట్ ప్రకారం రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రానిది 4వ స్థానం. 2019లో 419 మంది 2020లో 471 మంది రైతులు బలయ్యారు. ఇంకా లెక్క తీస్తే చాలా ఉంది. ‘వరి-ఉరి’ కామెంట్ తో 5 గురు రైతులు చనిపోయిండ్రు. ఇప్పుడు వడ్ల కుప్పపై 6 గురు రైతులు చనిపోయిండ్రు. కేసీఆర్ కు రైతులపట్ల ప్రేమ ఉంటే వాళ్లకు ముందుగా రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.' అని బండి సంజయ్ అన్నారు.   

Also Read:  నేరుగా కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు.. పక్కపక్కనే కూర్చొని కేసీఆర్-జగన్ ముచ్చట్లు

ట్రైబ్యునల్ జాప్యానికి సీఎం కేసీఆర్ కారణం

కరెంటు మీటర్లు బిగించి రైతులపై కేంద్రం భారం మోపుతుందని ఆరోపిస్తున్న సీఎం కేసీఆర్.. ఎక్కడ భారం మోపిందో చూపించాలన్నారు బండి సంజయ్. కేసీఆర్ నాటకాలు ఇక చెల్లవన్నారు. ఆయన పతనం ఆరంభమైందని, ఇక కేసీఆర్ ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రైబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి సీఎం కేసీఆర్ కారణమని బండి సంజయ్ ఆరోపించారు.  సుప్రీంకోర్టులో కేసు వేసి ఏడేళ్లుగా నాన్చి కేంద్రానిదే బాధ్యత అనడం సిగ్గచేటన్నారు.  కృష్ణా పరివాహక ప్రాంతానికి అనుగుణంగా తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా సీఎం కేసీఆర్ 299 టీఎంసీలను కేటాయించే ఒప్పంద పత్రాలపై అపెక్స్ కమిటీ సమావేశంలో సంతకం చేశారని ఆరోపించారు. ముందు తెలంగాణ వచ్చిన కొత్తలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే సంగతేమైంందో తేల్చాలని బండి సంజయ్ ప్రశ్నించారు. ఏ కులాల వాళ్లు ఎంతమంది ఉన్నారో సర్వే చేయించారు కదా ముందు ఆ లెక్కలు బయటపెట్టాలన్నారు. దాని ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో లబ్ది కలిగించాలన్నారు.  

Also Read: అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే కదిరిలో ఆరుగురు చనిపోయారు.. విష్ణువర్ధన్ రెడ్డి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget