అన్వేషించండి

Etala Akarsh : ఉద్యమకారులపై ఈటల ఆకర్ష్ .. బీజేపీలో వరుస చేరికలకు ప్లాన్ !

బీజేపీని బలోపేతం చేసే దిశగా ఈటల ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్‌లో ప్రాధాన్యం దక్కని ఉద్యమకారులను బీజేపీ గూటికి చేరుస్తున్నారు.

బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. బీజేపీలోకి ఉద్యమకారులను చేర్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురితో చర్చలుజరిపారు. తెలంగాణ ఉద్యమంలో ముందు నిలిచి.. ఇప్పుటు టీఆర్ఎస్‌లో ప్రాధాన్యత దక్కని వారితో ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు. టీఎస్​పీఎస్సీ మాజీ సభ్యుడు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించి సి.విఠల్​బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొంత మంది ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమ నేతలతో చర్చలు జరుపుతున్నారు. 

Also Read : ఖమ్మం టీఆర్‌ఎస్‌లో క్రాస్‌ ఓటింగ్‌ భయం.. గోవా క్యాంపునకు వెళ్లిన మంత్రి

తెలంగాణ ఉద్యోగుల జేఏసీని ముందుండి నడిపించిన నేతలకు ప్రస్తుతం ప్రాధాన్యత లభించడం లేదు. అనేక మందికి అపాయింట్‌మెంట్ కూడా దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితులపై నిరాశ చెంది గతంలో టీఎన్జీఓ అధ్యక్షుడిగా, జేఏసీ చైర్మన్​గా వ్యవహరించిన స్వామిగౌడ్​ బీజేపీలో చేరారు. అదే దారిలో విఠల్​ కూడా నడుస్తున్నారు.  బేవరేజెస్​ కార్పొరేషన్​ మాజీ చైర్మన్​ దేవీ ప్రసాద్ కూడా బీజేపీలో చేరే యోచనలో ఉన్నారు.  ఇదే వరుసలో మరో ఇద్దరు జేఏసీ నేతలు కూడా ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 

Also Read : శిల్పా చౌదరి చేతిలో మోసపోయిన మహేష్ బాబు సోదరి... ఆమె దగ్గర ఎంత కొట్టేశారంటే?

కరీంనగర్​ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ, ఉద్యోగ సంఘం మాజీ నేత కూడా ఈటల రాజేందర్​తో బీజేపీలో చేరికపై చర్చించినట్లుగా తెలుస్తోంది.  ఇలాంటి నేతలను అధికార పార్టీకి దూరం చేస్తే ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదనే అంశాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని ఈటల భావిస్తున్నారు. ఈటల మొదటి నుంచి ఉద్యమకారులకు టీఆర్ఎస్‌లో ప్రాధాన్యం లేదనే చెబుతున్నారు. ఉద్యమకారులను టీఆర్ఎస్‌కు దూరం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ పూర్తిగా టీఆర్ఎస్‌కు దూరమయ్యేలా చేయగలమని ఈటల అంచనా వేస్తున్నారు. 

Also Read : ఆర్టీసీ టికెట్ చార్జీల పెంపునకు సర్వం సిద్ధం.. కేసీఆర్ వద్ద ఫైల్, బస్సుల వారీగా పెరగనున్న వివరాలివే..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో బంగారు తెలంగాణ బ్యాచ్ పేరుతో పాపులరైన కొంత మంది హవా ఎక్కువగా ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్‌లో చేరిన వారిని బంగారు తెలంగాణ బ్యాచ్‌గా పేర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు ఉద్యమకారులకు కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే వలసల్ని ఆపేందుకు కూడా ఆ పార్టీ నేతలు పెద్దగా ప్రయత్నం చేయడం లేదు. 

Also Read: TRS Voters Camps : టీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ .. క్యాంపులకు ఓటర్లు ! అసలేం జరుగుతోంది ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tollywood Fan Wars: ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Advertisement

వీడియోలు

విశ్వం మూలం వారణాసి నగరమే! అందుకే డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్
Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
Ravindra Jadeja IPL 2026 | జడేజా ట్రేడ్ వెనుక వెనుక ధోనీ హస్తం
Rishabh Pant Record India vs South Africa | చ‌రిత్ర సృష్టించిన రిష‌బ్ పంత్‌
Sanju Samson Responds on IPL Trade | సంజూ శాంసన్ పోస్ట్ వైరల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tollywood Fan Wars: ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
ముదిరిన ఫ్యాన్ వార్- బాలకృష్ణకు సారీ చెప్పిన ఐపీఎస్ సీవీ ఆనంద్.. అసలేం జరిగింది..
AP CM Chandrababu: రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చు.. ఏపీ సీఎం చంద్రబాబు 
KTR on Cotton Farmers: తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
తెలంగాణ పత్తి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ఆగ్రహం
IPL 2026 Auction Date, Venue: డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ, పూర్తి వివరాలు ఇలా
డిసెంబర్ 15న కాదు.. ఐపీఎల్ వేలం తేదీ, వేదికను ప్రకటించిన బీసీసీఐ
Snowfall Destinations in India : ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
ఇండియాలో బెస్ట్ వింటర్ డెస్టినేషన్స్.. మొదటి స్నో చూడాలనుకుంటే ఇక్కడికి వెళ్లిపోండి
Hyderabad Gold Seized: ఐరన్‌ బాక్స్‌లో రూ.1.55 కోట్ల బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరి అరెస్ట్
ఐరన్‌ బాక్స్‌లో రూ.1.55 కోట్ల బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇద్దరి అరెస్ట్
Vangaveeti Asha Kiran: ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు.. రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
ఏపీ రాజకీయాల్లోకి మరో వారసురాలు, రంగా ఆశయ సాధనే లక్ష్యమన్న వంగవీటి ఆశా కిరణ్
Bigg Boss Telugu Day 70 Promo : భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
భరణికి మిర్చి ఇచ్చిన దివ్య.. గుంజీలు తీసిన తనూజ, సెకండ్ ఎలిమినేషన్ ఎవరంటే?
Embed widget