అన్వేషించండి

Telangana Cabinet: సీఎంను పట్టించుకోని మంత్రులు - వరుసగా వివాదాలు - కేబినెట్‌పై రేవంత్ పట్టు కోల్పోయారా?

Telangana Ministers: కేబినెట్ అంటే ముఖ్యమంత్రి కనుసైగలతో పని చేయాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ కేబినెట్ మాత్రం భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రితో చాలా మంది మంత్రులకు పొసగడం లేదు.

Telangana cabinet Unity Doubt: మంత్రివర్గంలో ముఖ్యమంత్రే కీలకం. ఆయన నియమించిన వారు మాత్రమే మంత్రులు. ఆయన విశ్వాసం కోల్పోతే మంత్రి పదువులు ఉండవు. అలాగే ముఖ్యమంత్రిపై విశ్వాసం  కోల్పోయిన మంత్రులూ కేబినెట్‌లో ఉండలేరు. కానీ తెలంగాణ కేబినెట్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తే అటు ముఖ్యమంత్రిపై నమ్మకం కోల్పోయిన మంత్రులు..ఇటు ముఖ్యమంత్రి కూడా నమ్మక కోల్పోయిన మంత్రులు కనిపిస్తున్నారు. కానీ ఎవర్నీ ఎవరూ కదిలించలేకపోతున్నారు. దీంతో కేబినెట్ లో విబేధాలపై మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. 

కేబినెట్ సమావేశాల్లో వాగ్వాదాలు జరుగుతున్నాయన్న ప్రచారం

మంత్రి వర్గ సమావేశాల్లో సాధారణంగా ఏం జరుగుతుందనేది బయటకు రాదు. కానీ లీకుల ద్వారా.. ఇలా జరిగిందన్న విషయం మాత్రం చాలా మందికి తెలుస్తుంది. ముఖ్యంగా మీడియా ప్రతినిధులకు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని అంశాల్లో మంత్రుల మధ్య వాగ్వాదం జరుగుతోందన్న ప్రచారం ప్రారంభమయింది. ఏ ఏ అంశాలపై అన్నదానిపై స్పష్టత లేదు కానీ.. మంత్రులు, ముఖ్యమంత్రి మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయబేధాలున్నాయని.. ..ఈ కారణంగా దూరం పెరిగిందని చెబుతున్నారు. ఇటీవల జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్న ఎక్సైజ్ శాఖ లో ఓ టెండర్ విషయంలో పెద్ద వివాదం రేగింది. దానికి సంబంధించిన ఫైల్ సీఎం వద్దనే ఉందని చెబుతున్నారు. ఈ వివాదంలో ఓ ఐఏఎస్ వీఆర్ఎస్ తీసుకుంటున్నారు. 

వరుస వివాదాల్లో మంత్రులు

మంత్రులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సహచర మంత్రిని సీనియర్ మంత్రి పొన్నం ప్రభాకర్.. మీడియా సమావేశంలో కించ పర్చిన అంశం పెద్ద ఇష్యూ అయింది. ఆ మంత్రి హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. చివరికి పొన్నంతో క్షమాపణ చెప్పించారు. తర్వాత వివేక్ తోనూ మరో మంత్రి లక్ష్మణ్ కుమార్ కు సరిపడలేదు.ఇక కొండా సురేఖ గురించి చెప్పాల్సిన పని లేదు. పదవి చేపట్టినప్పటి నుండి ఆమె వివాదాల్లోనే ఉన్నారు. ఇటీవల ఆమె కుమార్తె స్వయంగా ముఖ్యమంత్రి, ఆయన  కుటుంబసభ్యులపై ఆరోపణలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో సీఎంతో అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఇటీవల అలాంటి  వారు కూడా సీఎం చుట్టూ కనిపించడం లేదు. 
 
మంత్రుల పనితీరునూ పట్టించుకోని ముఖ్యమంత్రి

మంత్రులు ఇలా గాడి తప్పుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోవడం లేదు. వారి  పనితీరుపై లేధా వారు నిర్వహిస్తున్న శాఖల్లో పురోగతిపై ఇప్పటి వరకూ ఎలాంటి సమీక్షలు చేయలేదు.  ఆయా శాఖల పనితీరునూ కనీసం పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ప్రభుత్వంపై విపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నా మంత్రులు ఎవరూ పెద్దగా స్పందించడం లేదు. చాలా పరిమిత మంది మాత్రమే విపక్షాలకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. మిగతా అందరూ ఎందుకు మాట్లాడటం లేదంటే.. మాకు ఎందుకు అన్న పద్దతిలో ఉంటున్నారు. ఫలానా అంశంపై స్పందించాలని..  విపక్ష పార్టీలకు కౌంటర్లు ఇవ్వాలని గట్టిగా చెప్పలేకపోతున్నారు సీఎం రేవంత్. 

మంత్రులకూ హైకమాండ్ వద్ద పలుకుబడి

తెలంగాణ కేబినెట్ లో ఈ పరిస్థితి రావడానికి హైకమాండ్ కుడా ఓ కారణం అన్న అభిప్రాయం వినిపిస్తోంది. రేవంత్ రెడ్డికి హైకమాండ్ పూర్తి అధికారం ఇవ్వలేదు. తనపై పూర్తి స్థాయిలో తిరుగుబాటు చేసిన మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని హైకమాండ్ పట్టించుకోేలేదని.. పైగా రాజీ చేసిందని అంటున్నారు.  ఎవరూ తన మాట వినకపోతూండటంతో.. సీఎం కూడా తన పని తాను చేసుకుని పోతున్నారని చెబుతున్నారు. కీలక అధికారుల బదిలీల విషయంలోనూ హైకమాండ్ నుంచే ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇటీవల జరిగిన పోలీసు అధికారుల బదిలీల్లోనూ ఇదే జరిగిందని అంటున్నారు. సీఎం రేవంత్ మంత్రి వర్గంపై సీఎం పట్టు సాధించలేకపోవడానికి హైకమాండ్  అధిక  జోక్యమే కారణమని గుసుగుసలు వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా.. తెలంగాణ మంత్రివర్గం మాత్రం.. సీఎం గ్రిప్ లో  లేదని అర్థమైపోతుంది.         

టాప్ హెడ్ లైన్స్

Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Nutrition vs ideology in Bengal School Meals : బెంగాల్ మిడ్-డే మీల్స్ వివాదం - చేపల రాజకీయం నుంచి గుడ్డు రద్దు వరకు.. బీజేపీ వ్యూహం బెడసికొడుతుందా?
బెంగాల్ మిడ్-డే మీల్స్ వివాదం - చేపల రాజకీయం నుంచి గుడ్డు రద్దు వరకు.. బీజేపీ వ్యూహం బెడసికొడుతుందా?
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget