Telangana New Governor : గవర్నర్ మార్పు వెనుక బీజేపీ పెద్దల పక్కా వ్యూహం - ఇక రాజ్భవన్ వర్సెస్ ప్రజాభవన్ తప్పదా ?
Telangana Politics: తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తున్నారు. హఠాత్తుగా ఆయనను మార్చడంతో తెలంగాణలో బీజేపీ గేర్ మార్చేందుకేనన్న ప్రచారం జరుగుతోంది.

Will the new Telangana Governor change politics: తెలంగాణలో గవర్నర్ ను కేంద్రం అనూహ్యంగా మార్చేసింది. బీజేయేతర ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఎలా వ్యవహరిస్తారో దానికి బిన్నంగా జిష్ముదేవ్ శర్మ వ్యవహరించారు. ప్రభుత్వంతో ఎలాంటి లొల్లి పెట్టుకోలేదు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేంద్రంతో ఎలాంటి లొల్లి పెట్టుకోవడం లేదు. రాజకీయంగా విభేదిస్తూనే పాలనా పరంగా కలసి పని చేస్తున్నారు. కానీ ఇప్పుడు గవర్నర్ ను మార్చడంతో… తమ పంధాలోకి బీజేపీ వెళ్లనుందని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణోల గెలిచి తీరాలనుకుంటున్న బీజేపీ.. గవర్నర్ ద్వారా ఇతర పనులు చక్కబెట్టిని పార్టీని దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇప్పటి వరకూ వివాదాస్పదం కాని తెలంగాణ గవర్నర్
తెలంగాణ రాజకీయాల్లో గవర్నర్ మార్పు ఒక్కసారిగా ప్రకంపనలు సృష్టించింది. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి, ఆయన స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను నియమించడం వెనుక కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వం ఒక పక్కా వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. జిష్ణుదేవ్ వర్మ హయాంలో ప్రభుత్వానికి, రాజ్ భవన్ కు మధ్య సంబంధాలు చాలా సజావుగా సాగాయి. గతంలో డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ హయాంలో ఉన్న ఘర్షణ వాతావరణం జిష్ణుదేవ్ వర్మ వచ్చిన తర్వాత కనిపించలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కేంద్రంతో పాలనాపరమైన సత్సంబంధాలను కొనసాగిస్తూ వచ్చింది. అయితే, తాజా మార్పుతో బీజేపీ తన పంథాను మార్చుకోబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిష్ణుదేవ్ వర్మను కీలకమైన మహారాష్ట్రకు పంపి, సీనియర్ రాజకీయ నేత శివ ప్రతాప్ శుక్లాను ఇక్కడకు తీసుకురావడం వ్యూహాత్మకమే.
బీజేపీ మాస్ వ్యూహం ?
కొత్త గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆరితేరిన నేత. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా గమనించిన చరిత్ర ఆయనది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవాలని చూస్తున్న తరుణంలో, ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడంలోనూ, రాజ్యాంగపరమైన అంశాల్లో గట్టిగా వ్యవహరించడంలోనూ ఆయన క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కొన్ని ప్రాంతాల్లో మంచి ఫలితాలు సాధించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పార్టీ బలపడటంతో, 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కేవలం రాజకీయ పోరాటమే కాకుండా, గవర్నర్ వ్యవస్థ ద్వారా కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. బిల్లుల ఆమోదం, యూనివర్సిటీ నియామకాలు, పాలనాపరమైన విచారణల విషయంలో ఇకపై రాజ్ భవన్ నుంచి గట్టి సమాధానాలు రావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ - ఇక ప్రత్యక్ష యుద్ధం ?
ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో రాజకీయంగా విరోధం - పాలనాపరంగా మైత్రి అనే సూత్రాన్ని పాటిస్తోంది. కానీ, గవర్నర్ మార్పుతో ఈ వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న దూకుడు గవర్నర్ విధానాన్ని ఇక్కడ కూడా అమలు చేస్తే, రేవంత్ సర్కార్కు ఇబ్బందులు తప్పవు. బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీగా కాకుండా, ప్రభుత్వ యంత్రాంగంలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని చాటిచెప్పడానికి, గవర్నర్ మార్పు ఒక మొదటి అడుగుగా భావించవచ్చు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై గవర్నర్ జోక్యం పెరిగితే, అది సహజంగానే అధికార కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా సవాలుగా మారుతుందని అనుకోవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు




















