అన్వేషించండి

Nara Lokesh: నారా లోకేష్ మంగళగిరి మోడల్ - టీడీపీ ఎమ్మెల్యేలకు ఆదర్శమా? అందని ద్రాక్షా?

TDP MLAS: భారీమెజార్టీ ఉన్న టీడీపీలో ఎమ్మెల్యేల పనితీరు నాసిరకంగా ఉంది. నారా లోకేష్ ఓ స్టాండర్ట్ సెట్ చేస్తున్నా ఆయనను ఫాలో చేయలేకపోతున్నారు ఎమ్మెల్యేలు.

MLAs who do not follow Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువనేత, మంత్రి నారా లోకేష్ తన పనితీరుతో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి రికార్డు మెజారిటీతో విజయం సాధించిన తర్వాత, నియోజకవర్గ అభివృద్ధి , ప్రజా సంక్షేమం విషయంలో ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే, లోకేష్ సృష్టిస్తున్న ఈ  స్టాండర్డ్ ను అందుకోవడంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం వెనుకబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  

నియోజకవర్గంలో పక్కా వ్యవస్థ 

నారా లోకేష్ మంగళగిరిలో కేవలం ఒక ఎమ్మెల్యేగా కాకుండా, ఒక వ్యవస్థగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. మంత్రిగా రాష్ట్రస్థాయి బాధ్యతల్లో అత్యంత బిజీగా ఉన్నప్పటికీ, తన నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అటు ఐటీ, విద్యాశాఖల మంత్రిగా సచివాలయంలో ఫైళ్లను క్లియర్ చేస్తూనే, ఇటు మంగళగిరిలోని పాఠశాలలకు ఆకస్మిక తనిఖీలకు వెళ్లడం, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయడం వంటి చర్యల ద్వారా గ్రౌండ్ లెవల్‌లో బలమైన ముద్ర వేస్తున్నారు. పర్యటనల్లో ప్రోటోకాల్ ఆడంబరాలు లేకుండా సామాన్యుడిలా ప్రజల మధ్యకు వెళ్లడం ఆయన పనితీరులోని ప్రత్యేకత.

ఎమ్మెల్యేల లైట్  వైఖరి - వివాదాల పరంపర 

లోకేష్ తనను తాను ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుకుంటున్న తరుణంలో, టీడీపీలోని చాలామంది ఎమ్మెల్యేలు మాత్రం పాత ధోరణిలోనే సాగుతున్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కంటే వ్యక్తిగత ఆధిపత్యం, స్థానిక వివాదాలు మరియు కాంట్రాక్టుల చుట్టూ కొందరు నేతలు తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లోకేష్ తరహాలో టెక్నాలజీని వాడుకోవడం లేదా సోషల్ మీడియా ద్వారా ప్రజలతో నిరంతరం టచ్‌లో ఉండటం వంటి అంశాలను వీరు  లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా, కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రతిష్ట దెబ్బతినడమే కాకుండా, ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

హైకమాండ్ మౌనం - వ్యూహాత్మకమా?

లోకేష్ పనితీరును అందరూ అనుసరించాలని టీడీపీ హైకమాండ్ బహిరంగంగా ఆదేశాలు ఇస్తున్నట్లు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలను మోటివేట్ చేయడంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. బహుశా సీనియర్ ఎమ్మెల్యేల పనితీరును ఒక్కసారిగా మార్చడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో అధిష్టానం ఉందేమో కానీ, లోకేష్ సాధిస్తున్న ఫలితాలను చూసైనా నేతలు మారాలన్న ఒత్తిడి క్యాడర్ నుంచి పెరుగుతోంది. లోకేష్ తన శాఖల్లో చూపిస్తున్న వేగాన్ని పార్టీ యంత్రాంగం మొత్తం అందిపుచ్చుకోలేకపోవడం ఒక లోపంగా కనిపిస్తోంది.
 
ప్రజాబలం vs వ్యక్తిగత ఇమేజ్ 

రాజకీయాల్లో ఇప్పుడు వ్యక్తిగత ఇమేజ్ కంటే ప్రజాబలం ముఖ్యం. లోకేష్ తన ఇమేజ్‌ను మంగళగిరిలో చేసిన సేవా కార్యక్రమాల ద్వారా  పెంచుకున్నారు. కానీ, చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో కేవలం ఎన్నికల సమయంలోనే కనిపిస్తారన్న ముద్రను చెరిపేసుకోలేకపోతున్నారు. లోకేష్ సెట్ చేసిన స్టాండర్డ్స్ ఒక రకంగా టీడీపీ నేతలకు సవాల్‌గా మారాయి. ఆయన వేగాన్ని తట్టుకుని నిలబడాలంటే, ఎమ్మెల్యేలు తమ పనితీరును సమూలంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  నారా లోకేష్ ఇప్పుడు 'నెక్స్ట్ జనరేషన్' లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు. కేవలం లోకేష్ ఒక్కరు కష్టపడితే సరిపోదని, పార్టీలోని ఎమ్మెల్యేలందరూ అదే స్థాయిలో కష్టపడితేనే 2029 ఎన్నికల నాటికి టీడీపీ మళ్ళీ తిరుగులేని శక్తిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి లోకేష్‌ను చూసి ఈ ఎమ్మెల్యేలు ఎప్పుడు చక్కబడతారో వేచి చూడాలి. 


 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi 7 Appeals: అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
అప్రమత్తతే రక్ష - ప్రధాని మోదీ ఏడు సూత్రాలు రాజకీయం కాదు, ఆర్థిక యుద్ధ తంత్రం!
Bandi Sanjay Son POCSO Case: కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
కుమారుడి పోక్సో కేసు - బండి సంజయ్ రాజకీయ ఎదుగుదలకు ఇది శాపమా?
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
Modi Mind Game on Revanth Reddy: మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?
మోదీ మైండ్ గేమ్ .. రేవంత్ రెడ్డి చుట్టూ రాజకీయ చక్రవ్యూహం! కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తం కావాల్సిందేనా?
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
Which Car Is Best: పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
పెట్రోల్ కారును CNGగా మార్చడానికి ఎంత ఖర్చవుతుంది? ఈ విషయాలు తెలుసుకోండి
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Embed widget