అన్వేషించండి

Vizianagaram Kidnap: వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్, గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు

విజయనగరం జిల్లాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విజయనగరం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కిడ్నాప్ శుక్రవారం  కలకలం రేపింది.  జిల్లాలోని తెర్లాం మండలం కూనయివలస గ్రామానికి చెందిన టి.ఈశ్వరరావు అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను నలుగురు  వ్యక్తులు కిడ్నాప్ చేశారు. మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఈశ్వరరావును దుండగులు కిడ్నాప్ చేశారు.  కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్‌ అయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గంటల వ్యవధిలోనే దుండగులను పట్టుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా ఎస్.కోట దగ్గర కిడ్నాపర్లను  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Vizianagaram Kidnap: వర్క్ ఫ్రమ్ హోంలో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కిడ్నాప్, గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు

50 లక్షలు డిమాండ్ 

కిడ్నాప్ కు గురైన యువకుడు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. కరోనా దృష్ట్యా తన స్వగ్రామం తెర్లాం మండలం కూనయివలసలో వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడంతో డబ్బులు ఉంటాయని అతనికి తెలిసిన శృంగవరపు కోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ కు యత్నించాడు. నలుగురు వ్యక్తులకు సుఫారీ అందించి కిడ్నాప్ చేయమని పురమాయించాడు. దీంతో మార్నింగ్ వాక్ కు వెళ్లిన యువకుడ్ని కిడ్నాప్ చేసి కారులో ఎక్కించారు. అనంతరం ఆ వ్యక్తి పై దాడి చేశారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో కిడ్నాప్ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేశారు. 

తీవ్రగాయాల పాలైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్

ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. అయితే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై దుండగులు దాడి చేయడంతో అతడికి గాయాలయ్యాయి. అతడిని ధర్మవరం గ్రామంలో కిడ్నాపర్లు వదిలివెళ్లారు. గ్రామస్థుల సాయంతో అతడు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆసుపత్రి సిబ్బంది సమాచారంతో బాధితుడి సమాచారాన్ని తెర్లాం పోలీసులు అందించామని స్థానిక పోలీసులు తెలిపారు. అక్కడ కిడ్నాప్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు.  ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉందని పోలీసులు అంటున్నారు. పూర్తి విచారణ చేపడతామన్నారు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేశారా.. మరొక కారణం ఉందా అనేది దర్యాప్తు తెలుస్తుందన్నారు. 

Also Read: వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Air Canada Express Plane Crash: న్యూయార్క్ లోని ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. రన్‌వే పై ట్రక్కును ఢీకొన్న ఎయిర్ కెనడా విమానం
న్యూయార్క్ లోని ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. రన్‌వే పై ట్రక్కును ఢీకొన్న ఎయిర్ కెనడా విమానం
RTA Challan Link Scam: ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
ఎమ్మెల్యేకే తప్పని సైబర్ షాక్.. చలాన్ పేరుతో లింక్, ఒక్క క్లిక్‌తో ₹12 లక్షలు మాయం
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Strait of Hormuz: హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
హర్మూజ్ జలసంధి దాటాలంటే 2 మిలియన్ డాలర్ల టోల్ టాక్స్.. ఇరాన్ కీలక ప్రకటన
AMNS Steel Plant in Anakapalli: నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
నేడు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో నవశకం.. నక్కపల్లిలో 1.36 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
Dhurandhar 2 Collections : 700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
700 కోట్ల క్లబ్‌లో ధురంధర్ 2 - ఇండియన్ సినీ హిస్టరీలో సెకండ్ ప్లేస్‌... బాహుబలి, RRR రికార్డ్స్ బ్రేక్
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
Hyderabad Police Raids QNet: క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
క్యూ నెట్ సంస్థ మోసాలు.. 3 రాష్ట్రాల్లో ఏకకాలంలో హైదరాబాద్ పోలీసుల దాడులు
This Week OTT Movies : శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
శ్రీరామనవమికి స్పెషల్ ఎంటర్టైన్మెంట్ - థియేటర్లలో మూవీస్ లిస్ట్... ఓటీటీలో 19 సినిమాలు
Embed widget