అన్వేషించండి

Tirumala News: తిరుమలలో కత్తులతో ఓ బ్యాచ్ వీరంగం, వ్యక్తికి తీవ్రగాయాలు - భక్తుల ఆందోళన

తిరుమల కొండపై శ్రీవారి ఆలయానికి కూత వేటు దూరంలో కత్తులతో దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతుంది.

Tirumala Crime News: తిరుమల కొండపై శ్రీవారి ఆలయానికి కూత వేటు దూరంలో కత్తులతో దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతుంది. శ్రీవారి ఆలయానికి కూతవేటు‌ దూరంలోని హెచ్.టి కాంప్లెక్స్ వద్ద భక్తులు చూస్తుండగానే, సినిమాలోని ఘటనని తలపించే విదంగా కొందరు వ్యక్తులు నడి రోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. గతంలో అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న పాత నేరస్థుడైన సతీష్ తో సహా ఏడుగురు వ్యక్తులు పద్మనాభం అన్నే వ్యక్తి పై కత్తులతో దాడి చేయగా, వీరి నుంచి తప్పించుకున్నే క్రమంలో పద్మనాభం భయపడి పోలీస్ కాంప్లెక్స్ లోకి పరుగులు తీసాడు

సతీష్ బ్యాచ్ చేసిన ఈ కత్తి దాడిలో బాధితుడు పద్మనాభం చేతి, వీపుపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతని అశ్విని ఆస్పత్రికి తరలించారు. పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంత జరుగుతున్న పోలీసులు పట్టించుకపోక పోవడంతో దాడి చేసిన నిందితులు పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. దాడి ఘటనని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కొండపై శ్రీవారి ఆలయానికి అత్యంత సమీపంలో పోలీస్ స్టేషన్ కి కూత వేటు దూరంలో ఒకరిపై కత్తులతో దాడి ఘటన జరగడం తిరుమల భద్రతలోని డోల్లతనాని బట్టబయలు చేసింది. ఈ ఘటనని చూసిన భక్తులు ఎప్పుడు, ఎక్కడ నుంచి ఎవరైనా దాడి చేస్తే రక్షణ ఉంటుందా లేదా అని తిరుమలలో హాట్ టాపిక్ అవుతోంది. 

ఏడుకొండలపై భక్తుల కిటకిట 
వేసవి సెలవులు కావడంతో శ్రీనివాసుడి దర్శనం‌ కోసం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.ఆదివారం రోజున 82,582 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 43,526 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, 3.19 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని‌ కంపార్మెంట్లు భక్తులతో‌ నిండి పోయి బయట ఏటిజీహెచ్ వరకూ క్యూ లైన్స్ లో‌ భక్తులు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 24 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు మూడు గంటల సమయం పడుతుంది. 

సోమవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం  తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు. ప్రాతఃకాల ఆరాధనలో‌ భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు. శ్రీవారికి పంచాంగ శ్రవణం,హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో  కలిపిన నువ్వుల పిండిమి స్వామి వారిని నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేసారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. ప్రతి "సోమవారం" రోజు నిర్వహించే "చతుర్ధశ కలశ విశేష పూజ" ను టిటిడి రద్దు చేయడం తెలిసిందే. 

 

టాప్ హెడ్ లైన్స్

Nirmal Supari Murder Case: సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
సవతి తల్లితో వివాహేతర బంధం - చివరికి మర్డర్ - చేయించింది కూడా సవతి తల్లే !
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget