అన్వేషించండి

Ongole News: ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత - ఘోరంగా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Andhrapradesh News: ఒంగోలులో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారం సమయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొనగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

Tdp And Ysrcp Activists Severely Beaten In Ongole: ప్రకాశం (Prakasam) జిల్లాలో ఎన్నికల ప్రచారం సందర్భంగా పొలిటికల్ హీట్ నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల ఘర్షణలతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సీన్ లోకి ఎంటర్ కావడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరికొకరు పోటాపోటీగా నినాదాలు చేస్తూ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరకు పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి. ఈ ఘర్షణలో ఇరు వర్గాల కార్యకర్తలకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలులోని (Ongole) సమతానగర్ లో బుధవారం రాత్రి వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్యరెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా.. ఓ అపార్ట్ మెంట్ లోని మహిళలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలకు మాటా మాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడులు చేసుకోగా.. కొందరికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అటు, ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

రిమ్స్ లోనూ..

మరోవైపు, మాజీ మంత్రి బాలినేని ఘటనా స్థలానికి వెళ్లారు. తమ కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని.. అందువల్లే వివాదం చెలరేగిందని మండిపడ్డారు. ఇక, తమ కార్యకర్తలను పరామర్శించేందుకు బాలినేని.. అటు, టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు దామచర్ల రిమ్స్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకేసారి అక్కడికి చేరుకుని పోటా పోటీ నినాదాలు చేయడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రిమ్య్ క్యాజువాలిటీలో పలు అద్దాలు ధ్వంసం చేసినట్లు సమాచారం. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఇరు పార్టీల నేతలను పోలీసులు అక్కడి నుంచి పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈసీ సీరియస్

అటు, ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘర్షణకు గల కారణాలపై వెంటనే దర్యాప్తు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై బైండోవర్ కేసులు నమోదు చేయాలని వెల్లడించింది.

Also Read: SCR: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - వేసవికి మరిన్ని ప్రత్యేక రైళ్లు, సికింద్రాబాద్ నుంచి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Hyderabad CP Sajjanar: మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
మహిళలను అవమానించడం క్రూరత్వమే, దుష్ప్రచారంపై చర్యలు తప్పవు: సజ్జనార్ వార్నింగ్
Harshit Rana: గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
గంభీర్ దత్తపుత్రుడు అంటూ ట్రోలింగ్.. కట్ చేస్తే టీమిండియా సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా రికార్డ్
Telangana: జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
జర్నలిస్టుల అరెస్టుపై భగ్గుమన్న బీఆర్ఎస్ - మొహబ్బత్‌కా దుకాణ్ ఇదేనా అని రాహుల్‌కు కేటీఆర్ ప్రశ్న
Affordable Cars in India: భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
భారత్‌లో అతి చవకైన 5 కార్లు ఇవే.. తక్కువ మెయింటనెన్స్ తో మీకు మరింత ప్రయోజనం
Embed widget