అన్వేషించండి

Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో విషాదం, ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి

Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. చెరువులో ఈతకు దిగి నలుగురు చిన్నారులు మృతి చెందారు.

Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన  చోటుచేసుకుంది. ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలు తీసింది.  జిల్లాలోని యాచారం మండలం గొల్లగూడ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గొల్లగూడ గ్రామానికి చెందిన బబ్బు(11), కాలేద్(10) , ఇమ్రాన్ (11), రెహాన్(10) తల్లిదండ్రులతో ఊరికి దగ్గర్లోని ఓ దర్గాకి వెళ్లారు. దర్గా నుంచి తిరిగి వస్తుండగా తల్లిదండ్రుల కన్నా ముందు గ్రామానికి సమీపంలో ఉన్న  ఎర్రకుంట చెరువు వద్దకు చేరుకున్నారు. సరదాగా ఈత కొట్టేందుకు నలుగురు చెరువులో దిగారు. చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురు విద్యార్థులు ఆ గుంతల్లో మునిగిపోయారు. నలుగురు చిన్నారులు గుంతల్లోకి వెళ్లడం చూసిన పశువుల కాపరులు ఎంతసేపటికి వాళ్లు తిరిగి బయటికి రాకపోవడంతో చెరువులో దూకి చిన్నారులను బయటికి తీశారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతి చెందినట్లు గుర్తించారు. నలుగురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.  అప్పటి వరకు తమతో ఉన్న పిల్లలు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక సీఐ లింగయ్య  సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. 

చెరువులో ట్రాక్టర్ బోల్తా 

ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్​అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది వరకు మృతి చెందారు. మరో 10 మందికి గాయపడ్డారు, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాన్పుర్​లోని ఘతంపుర్​ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. కాన్పుర్​లోని ఘతంపుర్ ప్రాంతానికి చెందిన భక్తులు సమీపంలోని ఓ గుడికి శనివారం సాయంత్రం వెళ్లారు. పూజలు ముగించుకుని రాత్రి సమయంలో గుడి నుంచి ట్రాక్టర్ లో తిరిగి వస్తుండగా.. అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. తొలుత ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో దాదాపు 50 మంది వరకు ప్రయాణిస్తున్నారని జిల్లా మేజిస్ట్రేట్ విశాంక్ జి అయ్యర్ తెలిపారు.

భారీగా పెరిగిన మృతుల సంఖ్య

రాత్రివేళ కావడం, అందులోనూ ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న వారిలో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని జిల్లా మేజిస్ట్రేట్ విశాంక్ జి అయ్యర్ తెలిపారు. మొదట 6 మంది చనిపోయినట్లు గుర్తించగా, రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య 26కు పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సమీపంలోని చంద్రికాదేవి ఆలయంలో నిర్వహించిన మండన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు ట్రాక్టర్ లో తిరిగి వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాద స్థంలోనే 12కు పైగా భక్తులు చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు తుదిశ్వాస విడిచారని అయ్యార్ వివరించారు. 

Also Read : Hyderabad News : దసరాకు సొంతూరు వెళ్తున్నారా? అయితే పోలీసుల సూచనలు మీకోసమే!

Also Read : 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు- నిత్యపెళ్లి కొడుకును పట్టించిన యువతి!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fire Accident: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
Fake Currency Case: జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
జీడి నెల్లూరులో ఫేక్ కరెన్సీ కేసు.. వ్యాపారులను ముంచిన గ్యాంగ్.. ఖాకీలు కూడా ఖైదీలే!
Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి
Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?
నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 DC VS RR Result Updates: డీసీ అద్భుత విజ‌యం.. ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన రాహుల్, పోరెల్, స్టార్క్.. రాయ‌ల్స్ కు షాక్
డీసీ అద్భుత విజ‌యం.. ప్లే ఆఫ్ ఆశ‌లు స‌జీవం.. రాణించిన రాహుల్, పోరెల్, స్టార్క్.. రాయ‌ల్స్ కు షాక్
US Iran War Updates: యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ ముందు 5 కీలక కండీషన్లు పెట్టిన డొనాల్డ్ ట్రంప్
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Shahpur Railway Station Viral Video: పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
పిల్లలను కాపాడేందుకు ప్రాణాల్ని పణంగా పెట్టిన తల్లి.. గుండెలు పిండేసే వీడియో!
Blackmail Telugu Movie: 'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
'జెమిని' సురేష్‌తో వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'... కోన క్లాప్‌తో షురూ
Virat Kohli Records: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి, ఏకైక బ్యాటర్‌గా బద్దలు కొట్టలేని రికార్డు
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. తొలి, ఏకైక బ్యాటర్‌గా బద్దలు కొట్టలేని రికార్డు
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Embed widget