అన్వేషించండి

28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు- నిత్యపెళ్లి కొడుకును పట్టించిన యువతి!

Bengal News: 30 ఏళ్లు నిండకముందే దాదాపు 24 పెళ్లిళ్లు చేసుకున్నాడో యువకుడు. చివరకు చేసుకున్న అమ్మాయి.. నగలు తీస్కొని పరారు అవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నిత్యపెళ్లికొడుకు దొరికిపోయాడు. 

అతడి వయసు 28 ఏళ్లు. ఈ వయసు వాళ్లంతా అప్పుడప్పుడే పెళ్లి చేస్కుంటుంటారు. అతడు కూడా అందరి లాగే పెళ్లి చేసుకున్నాడు. ఒకటో రెండో కాదండీ.. ఏకంగా 24 మందిని మనువాడాడు. రోజుకో పేరుతో నకలీ ధ్రువ పత్రాలు సృష్టించడం, పెళ్లిళ్లు చేస్కోవడం, పత్తా లేకుండా పారిపోవడం.. ఇలా సాగిస్తూ వచ్చాడు. చివరకు ఆఖరుగా చేసుకున్న అమ్మాయికి దొరకిపోయి ఊచలు లెక్కబెడుతున్నాడు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

అసలేం జరిగిందంటే..?

బంగాల్ లోని సాగర్ దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను అసబుల్ మొల్లా అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు పెళ్లి జరిగిన కొంత కాలం వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత ఒతడు ఒక్కసారిగా మాయమైపోయాడు. అలాగే ఇంట్లోనే ఉన్న ఆమె నగలు కూడా కనిపించకుండా పోయాయి. దీంతో అనుమానం వచ్చిన ఆమె.. భర్త మోసం చేశాడని సాగర్ దిగీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇలాఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

నకిలీ గుర్తింపు కార్డులను అవలీలగా సృష్టించి బిహీర్, పశ్చిమ బంగాల్ లోని పలు ప్రాంతాల్లో అసబుల్ తిరిగేవాడు. ఒక చోట అనాథ అని, మరో చోట జేసీబీ డ్రైవర్ అని, ఇంకో చోట కూలీ ఇలా పేర్లు మార్చుకుంటూ తిరిగేవాడు. అలా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకు ఇంట్లోని నగలు, డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యే వాడు. ఇలా 23 మందిని మోసం చేసి సాగర్ దిగీలోని  ఓ మహిళను 24వ పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటిలాగే తన చేతి వాటం చూపించి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఈసారి మనువాడిని అమ్మాయి అతనిపై ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అసబుల్ ను పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతడి బాగోతం బయట పడింది. ఇంకా పూర్తిగా విచారణ జరిపుతామని చెబుతున్నారు. 

నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. 

నంద్యాల జిల్లా మిట్నాల గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి ఒకరికి తెలియకుండా మరొకర్ని ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె విడాకులు ఇవ్వకుండా ముగ్గుర్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో మహిళ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మిట్నాలకు చెందిన మేరీ జసింట అలియాస్‌ మేరమ్మ కుమార్తె శిరీషకు గతంలో అవుకు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జునతో తొలి వివాహం జరిగింది. మల్లికార్జునతో విడాకులు తీసుకోకుండానే ఆత్మకూరు మండలం కొత్తపల్లెకి చెందిన శ్రీనివాసరెడ్డిని శిరీష రెండో పెళ్లి చేసుకుంది. అతడితో కూడా విడాకులు తీసుకోకుండానే బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురం వాసి మహేశ్వరరెడ్డిని మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. మహేశ్వరరెడ్డికి కూడా రెండో పెళ్లి కావడంతో ఆయన పెళ్లికి ఒప్పుకున్నాడు. అయితే శిరీష్ తనకు రక్షణగా రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయాలని కోరింది. రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయగా, ఫిబ్రవరి 5న మద్దిలేటిస్వామి ఆలయంలో పెళ్లి అయింది. 

నాలుగో పెళ్లికి సిద్ధం! 

శిరీష తల్లి మేరమ్మ ఆర్‌ఎస్‌ రంగాపురం తరచూ వస్తూ తన కూతురిని అత్తారింట్లో ఉంచాలంటే మరికొంత డబ్బు, ఆస్తి రాసివ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. శిరీష్, ఆమె తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహేశ్వరరెడ్డి శిరీష గురించి విచారించారు. దీంతో ఆమెకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగినట్లు తెలుసుకొని షాకయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. అయితే ముగ్గురిని మోసం చేసిన శిరీష తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తత- అట్లాంటిక్‌లో చమురు ట్యాంకర్‌ సీజ్‌- మండిపడ్డ పుతిన్
Raja Saab Ticket Price: ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
ప్రభాస్ 'ది రాజా సాబ్' ప్రీమియర్ టికెట్ వెయ్యి రూపాయలు! రెగ్యులర్ షోల టికెట్‌లను పెంచిన ఏపీప్రభుత్వం!
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Jana Nayagan:విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' విడుదల వాయిదా! అభిమానులకు షాక్ ఇచ్చిన నిర్మాణ సంస్థ!
​​US Student Visa :భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
భారతీయ విద్యార్థులను టెన్షన్‌ పెడుతున్న ట్రంప్‌! ఇప్పుడు ఏం జరిగిందంటే?
Embed widget