అన్వేషించండి

Boat Accident: గోదావరిలో పడవ బోల్తా - ఒకరు గల్లంతు, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

Konaseema News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతికి ఓ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో గన్నవరం మండలానికి చెందిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అధికారులు అతని కోసం గాలింపు చేపట్టారు.

Boat Capsized In Konaseema District: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) పి.గన్నవరం (Gannavaram) మండలం ఊడిమూడి లంక వద్ద గోదావరి నదిలో ఆదివారం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతు కాగా.. ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. వరద ప్రభావిత లంక గ్రామాలకు వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆరుగురు పడవలో ఉండగా.. వరద ప్రవాహానికి పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఐదుగురు లైఫ్ జాకెట్లు ధరించడంతో సేఫ్‌గా బయటపడ్డారు. వారిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. లైఫ్ జాకెట్ ధరించని ఊడిమూడికి చెందిన విజయ్ కుమార్ (26) అనే యువకుడు నదిలో గల్లంతయ్యాడు. అతని కోసం పోలీస్, రెవెన్యూ, అధికారులు గాలింపు చేపట్టారు. 

ప్రభుత్వం ఆర్థిక సాయం

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నదిలో వరద ఉద్ధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరీవాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అధికార యంత్రాంగం సైతం అలర్ట్‌గా ఉంటూ ప్రజలకు సాయం అందించాలని నిర్దేశించారు.

వరదల్లో లంక గ్రామాలు

కాగా, గత వారం రోజులుగా కురుస్తోన్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. శనివారం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. భారీ వర్షాల ధాటికి తాత్కాలికంగా వేసిన గట్టు తెగిపోగా.. నాలుగు గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆయా గ్రామాలకు వాటర్ ప్యాకెట్స్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోదారి ఉగ్ర రూపంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు, అధికార యంత్రాంగం బాధిత గ్రామాల ప్రజలు సహాయం చేస్తోంది. కోనసీమ జిల్లాలోనూ పలు గ్రామాల ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు, భారీ వర్షాలతో అల్లూరి జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో భారీ వర్షాలకు లక్ష్మీపురం పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు సైతం వీలులేక దాదాపు 30 గ్రామాల గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అటు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్‌లోని ఇందిరా కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. వర్షంతో డ్రైనేజీలు పొంగి పొర్లి మురికి నీటితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

ట్రాక్టర్‌పై కలెక్టర్
Boat Accident: గోదావరిలో పడవ బోల్తా - ఒకరు గల్లంతు, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
Boat Accident: గోదావరిలో పడవ బోల్తా - ఒకరు గల్లంతు, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

అటు, ప.గో జిల్లా ఆచంట మండలం అయోధ్యలంకలో గోదావరి వరద ముంపునకు గురైన బీసీ కాలనీ, మర్రిమూల గ్రామాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోడేరు రేవు నుంచి పడవపై చేరుకున్న ఆమె వరద పరిస్థితిని సమీక్షించారు. అక్కడి మెడికల్ క్యాంపులను పరిశీలించారు. వరద బాధిత గ్రామాల ప్రజలను పరామర్శించి ధైర్యం చెప్పారు. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని, ప్రతి సంవత్సరం వరద సమయంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి వీలు లేకుండా ఉందని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పుచ్చలంక నుంచి మర్రిమూలకు బ్రిడ్జి ఏర్పాటుతో సమస్య తీరుతుందని కలెక్టర్‌కు విన్నవించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, నూనె, కందిపప్పు వంటి నిత్యావసరాలు అందజేస్తామన్నారు. పశుగ్రాసానికి కొరత లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Also Read: Road Accidents: ఏపీలో ఘోర ప్రమాదాలు - ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం, మరో ప్రమాదంలో ముగ్గురు సోదరుల మృతి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం

వీడియోలు

Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd ODI: ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
ఒక మార్పుతో బరిలోకి దిగిన గిల్ సేన.. ఇండోర్‌లో తమ రికార్డు కాపాడుకుంటుందా?
AR Rahman Vs Kangana Ranaut: ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
ఏఆర్ రెహమాన్‌పై విమర్శలు గుప్పించిన కంగనా రనౌత్... నన్ను కలవలేదు, అంత ద్వేషమా?
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Embed widget