అన్వేషించండి

Road Accidents: ఏపీలో ఘోర ప్రమాదాలు - ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు దుర్మరణం, మరో ప్రమాదంలో ముగ్గురు సోదరుల మృతి

Andhrapradesh News: ఏపీలో ఆదివారం జరిగిన ఘోర ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. బాపట్ల జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. కాకినాడ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

Tractor Accident In Bapatla District: ఏపీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సోదరులు మృతి చెందగా.. బాపట్ల జిల్లాలో (Bapatla District) ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్లపాలెం (Karlapalem) మండలం యాజలిలో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి చెందగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో ట్రాక్టర్‌లో 20 మంది ఉన్నారు. నగరం మండలం గట్టువారిపాలెం గ్రామానికి చెందిన వీరంతా.. కొండపాటూరు పోలేరమ్మ ఆలయానికి మొక్కు తీర్చుకునేందుకు ట్రాక్టర్‌లో బయలుదేరారు.

ఆర్టీసీ బస్సును తప్పించబోయి

ఈ క్రమంలో యాజలి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గట్టు కోటేశ్వరరావు (65), గడ్డం శివనాగులు (60), గడ్డం లక్ష్మి (40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బాపట్ల ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

కాకినాడలోనూ..

అటు, కాకినాడ (Kakinada) జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు సోదరులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గండేపల్లి (Gandepalli) మండలం మురారి వద్ద రోడ్డుపై బైక్ అదుపు తప్పి పడిపోగా కింద పడిన వారిపై గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందగా.. వారి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. భీమవరం మండలం తాడేరుకు చెందిన నంగలం దుర్గ (40)కు రాజు (18), ఏసు (18), అఖిల్ (10) ముగ్గురు కుమారులు. వీరి కుటుంబం కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పనుల్లో భాగంగా నర్సీపట్నం వెళ్లి బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా.. ఆదివారం తెల్లవారుజామున గండేపల్లి మండలం మురారి శివారు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. తల్లి దుర్గకు తీవ్రగాయాలు కాగా.. స్థానికులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్లు సీఐ లక్ష్మణరావు, ఎస్సై రామకృష్ణ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Chevireddy Mohith Reddy: పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు, బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి అరెస్ట్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
బాణసంచా పేలుడు ఘటనలో 21 మంది మృతి.. అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు
Honor Killing In AP: లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
లవ్ మ్యారేజీ చేసుకున్న కొన్ని గంటలకే వరుడ్ని చంపిన వధువు సోదరులు, కోనసీమలో దారుణం
Ayesha Meera Last Rites: అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
అయేషా మీరా అంత్య క్రియలు నేడే.. విజయవాడ, తెనాలి అంతటా ఉద్విగ్న వాతావరణం
Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!
మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!

వీడియోలు

ABP Network Chief Editor Atideb Sarkar Speech | ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసం చేసిన అతిదేబ్ సర్కార్ | ABP Desam
ABP Network Ideas of India Summit 2026 Inaguration | ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సమ్మిట్ ప్రారంభం | ABP Desam
Kavitha about Delhi Liquor Scam Case | లిక్కర్ స్కాం కేసులో కవితకు క్లీన్ చిట్
India vs Zimbabwe Highlights T20 World Cup | జింబాబ్వేను 72 పరుగుల తేడాతో ఓడించిన టీమిండియా
Rinku Singh Father Passes Away | రింకూ సింగ్ తండ్రి కన్నుమూత

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
శ్రీలంకపై నెగ్గినా వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. సెమీఫైనల్స్‌కు న్యూజిలాండ్
Israel Strike On Iran: ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రితో పాటు ఆర్మీ చీఫ్ మృతి.. రిపోర్ట్స్!
PM Modi On Kakinada Incident: సామర్లకోట ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
సామర్లకోట బాణసంచా ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి.. కేంద్రం పరిహారం ప్రకటన
Kokapet Swarupananda Lands: కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
కోకాపేటలో విశాఖ శారదా పీఠానికి కేటాయించిన రెండెకరాలు రద్దు - తెలంగాణ సర్కార్ నిర్ణయం - బీజేపీ విమర్శలు
Nara Lokesh : సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
సంజయ్ దత్‌తో నారా లోకేశ్ మీటింగ్ - మంత్రి విజన్‌కు బాలీవుడ్ లెజెండ్ ఫిదా
TTD budget: వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
వచ్చే ఏడాదికి శ్రీవారి పద్దు 5,456 కోట్లు -త్వరలో శ్రీవారి ముడుపు పథకం- టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
Ananya Nagalla: తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
తాతయ్యగుంట గంగమ్మ గుడిలో అనన్య నాగళ్ళ... 'పుష్ప 2'లో గంగమ్మ జాతర ఫైట్, టీటీడీ చొరవతో!
Pakistan vs Sri Lanka: టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లీ రికార్డు బద్ధలుకొట్టిన పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్
Embed widget