అన్వేషించండి

Crime News: తెలంగాణలో దారుణం - తలపై బాది గొంతు కోసి వృద్ధ దంపతులను చంపేశారు, ఎక్కడంటే?

Hyderabad News: అంబర్‌పేట్‌లోని ఓ ఇంట్లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు వారి తలపై కొట్టి గొంతు కోసి హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Old Couple Killed In Hyderabad: హైదరాబాద్ (Hyderabad) నగరంలో దారుణం జరిగింది. అంబర్‌పేట్ (Amberpet) సాయిబాబా నగర్ కాలనీలో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది. మూడంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటున్న వృద్ధ దంపతులు లింగారెడ్డి, ఊర్మిలాదేవిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వృద్ధుల తలపై బాది, గొంతు కోసి కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. చోరీకి వచ్చిన దుండగులే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. 3 రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది. 

హత్య కేసు ఛేదించిన పోలీసులు

అటు, కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జంట హత్యల కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ నెల 15న (మంగళవారం) రాత్రి మామిడి తోటలో వృద్ధ దంపతులను దారుణంగా హతమార్చారు.  దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన మూగ (చింతబాయి) ఉషయ్య (70), అతని భార్య శాంతమ్మ (60).. రంగారెడ్డి జిల్లా కందుకూరు ఠాణా పరిధిలోని కొత్తగూడ సమీపంలో వారి స్వగ్రామానికి చెందిన మనోహరరావుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో రెండున్నరేళ్లుగా కాపలాదారులుగా పని చేస్తున్నారు. మామిడి తోటలో ఓ పక్కన షెడ్లతో పాటు నిర్మించిన గదుల్లో వీరు నివాసం ఉంటున్నారు. వీరిని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. శాంతమ్మను మంచంపై గొంతు కోసి హత్య చేయగా.. ఉషయ్యను వారు నివాసం ఉంటోన్న వంద మీటర్ల దూరంలో మామిడి తోటలో పరుగెత్తించి మెడ భాగంపై నరికి చంపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి నిందితులను అదుపులోకి తీసుకుని. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

నిజామాబాద్‌లో దారుణం

మరోవైపు, నిజామాబాద్‌లోనూ దారుణం జరిగింది. ఓ మహిళపై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి మహిళను ఆటోలో ఎక్కించుకుని అఘాయిత్యానికి ఒడిగట్టగా శనివారం ఉదయం బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ బస్టాండ్‌లో శుక్రవారం రాత్రి ఒంటరిగా ఉన్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి డిచ్‌పల్లి ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. వారి వద్ద నుంచి తప్పించుకున్న మహిళ నిజామాబాద్ చేరుకుంది. అక్కడ ఒకటో పోలీస్ స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు డిచ్పల్లికి చెందిన వారుగా అనుమానిస్తున్నారు. బస్టాండ్ వద్ద సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Also Read: Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ అరెస్ట్! ఏం హక్కు ఉందంటూ పోలీసులపై అసహనం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget