అన్వేషించండి

Guntur News: కాటేసిన పాము కోసం 2 గంటలు వెతికాడు - చివరకు వెంటాడిన మృత్యువు, గుంటూరు జిల్లాలో ఘటన

Andhra News: తనను కాటేసిన పామును చంపిన తర్వాతే తాను ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటానని ఓ మయన్మార్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని ఏఎన్‌యూ క్యాంపస్‌లో జరిగింది.

Mayanmar Student Died Due To Snake Bite In ANU Campus: తనను కాటేసిన పామును చంపిన తర్వాతే తాను ఆస్పత్రికి వెళ్తానన్న ఓ యువకుడి మొండి పట్టుదల అతని ప్రాణాలు బలిగొంది. గుంటూరు జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం.. జిల్లాలోని ఏఎన్‌యూ క్యాంపస్‌లో యమన్మార్‌కు చెందిన కొండన్న (38) అనే విద్యార్థి ఎంఏ బుద్ధిజం చదివేందుకు గత నెలలోనే ఇక్కడకు వచ్చారు. క్యాంపస్‌లోని అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు ఆ దేశానికే చెందిన మరో స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లారు. వీరిద్దరూ వర్శిటీ ప్రాంగణంలో ఓ పుట్ట వద్ద పుట్టగొడుగులు సేకరిస్తుండగా కొండన్నను పాము కాటేసింది.

పాము కోసం వెతుకుతూ..

పాము కాటు వేసిన వెంటనే కొండన్న వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా దాని కోసం వెతుకుతూ దాదాపు 2 గంటల సమయం వృథా చేశారు. పామును పట్టి చంపిన తర్వాతే తాను ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని భావించారు. కాగా, యమన్మార్‌లో ఎవరినైనా పాము కాటు వేస్తే దాన్ని చంపి ఆ తర్వాతే దాంతో పాటే ఆస్పత్రికి వెళ్తారు. వైద్యులు ఆ పాము జాతిని బట్టి వైద్యం చేస్తారు. ఈ క్రమంలో రాత్రి 10:30 గంటలకు రక్తపింజర పాము కరిస్తే.. 12 గంటల వరకూ దాని కోసం ఇద్దరూ వెతుకులాడారు. చివరకు ఆ పాము దొరకడంతో దాన్ని చంపి వెంటనే మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి వెళ్లారు. అయితే, వైద్యులు వెంటనే చికిత్స మొదలు పెట్టినప్పటికీ ఆలస్యం కావడంతో కొండన్న ప్రాణాలు కోల్పోయారు.

మయన్మార్‌లోని క్యూహా బుద్ధిజం విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన కొండన్న.. ఉన్నత విద్య కోసం ఇక్కడకు వచ్చారు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానుండగా.. ఎంతో ఆశతో భారత్‌కు వచ్చిన విద్యార్థి ఇలా మృతి చెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు, మయన్మార్ విద్యార్థి మృతి ఘటన వర్శిటీ బయట కాలువ గట్టుపై జరిగిందని రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం తెలిపారు. దీనిపై ముందుగా పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. పోలీసులు ఆ ప్రాంతం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పడంతో అక్కడికి బదిలీ చేసినట్లు ఆదివారం రాత్రి వెల్లడించారు.

Also Read: Prakasam Barrage: 'ఆ బోట్లు వైసీపీ నేతలవే' - ప్రకాశం బ్యారేజీ ఘటనపై సీఎం చంద్రబాబుకు అధికారుల నివేదిక

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Viral News: న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
న్యాయం కోసం వెళితే.. టీచర్స్ బ్రాండ్ మద్యం బాటిళ్లు కావాలంటూ ఎస్ఐ డిమాండ్!
Tamil Nadu Explosion: బాణసంచా ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
బాణసంచా ఫ్యాక్టరీలో ప్రమాదం, పేలుడు ధాటికి 10 గదులు ధ్వంసం.. శిథిలాల కింద 60 మంది !
Constable Dies in Road Accident: డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి- వికారాబాద్ జిల్లాలో ఘటన
Palnadu Crime News: లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!
పల్నాడులో లాయర్ హత్య కేసులో ట్విస్ట్.. వివాహేతర సంబంధం కోసం కానిస్టేబుల్ దారుణం!

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Tamil Nadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత, కరుణానిధిలదే కీలక పాత్ర - ఏఐతో మాయ చేస్తున్న పార్టీలు!
DOST Notification 2026: తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్ విడుదల.. ఈ 15 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
సుడిగాలి సుధీర్‌తో దీపిక పిల్లి లాక్ అయిందా?.. అసలు మ్యాటర్ ఏంటంటే?
AP Sarpanch Elections: 5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
5 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నికల విజేతను తేల్చిన కోర్ట్.. కోనసీమలో అనూహ్య పరిణామం
What Is Quantum Computer: నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
నేడే ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
Rajinikanth : రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
రజనీ కాంత్, కమల్ ప్రాజెక్ట్ నుంచి ఆ డైరెక్టర్ అవుట్? - ఒకే మూవీపై ఎందుకింత కన్ఫ్యూజన్
Embed widget