అన్వేషించండి

Kerala Human Sacrifice Case: కేరళ నరబలి ఘటన విచారణలో ఎన్నో కొత్త నిజాలు, ఫేక్ అకౌంట్‌తో దంపతులకు ఎర

Kerala Human Sacrifice Case: కేరళ నరబలి కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Kerala Human Sacrifice Case:

శ్రీదేవి పేరిట ఫేక్ అకౌంట్..

కేరళలో సంచలనం సృష్టించిన "నరబలి" ఘటనలో విచారణ జరుపుతున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేరం వెనక ప్రధాన సూత్రధారి మహమ్మద్ షఫీ అని పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్న విషయం. సోషల్ మీడియా ద్వారా దంపతులకు పరిచయమై... తరవాత వాళ్లతో ఈ నరబలి చేయించాడని పోలీసుల విచారణలో తేలింది. ఇక్కడ కీలక విషయం ఏంటంటే..సోషల్ మీడియాలో "శ్రీదేవి" పేరుతో అకౌంట్ మెయింటేన్ చేశాడు మహమ్మద్ షఫీ. పూల ఫోటోలను డీపీగా పెట్టుకుని మభ్యపెట్టాడు. తరవాత ఆ దంపతులతో పరిచయం పెంచుకున్నాడు. తనను తాను బాబాగా చెప్పుకున్నాడు. "దురదృష్టం తొలగిపోవాలంటే నరబలి ఇవ్వాలి" అని వారికి మాయమాటలు చెప్పాడు. అంతే కాదు. నిందితులైన భగవల్ సింగ్ భార్యతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్టు  తెలుస్తోంది. ఇదంతా పూజలో భాగమే అని వాళ్లను నమ్మించాడు కూడా. అయితే..పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలు లభించాకే ఇది నిజమా కాదా అని నిర్ధరించే అవకాశముంది. అటు నిందితుల తరపున న్యాయవాది "మృతుల మాంసాన్ని తిన్నారు" అన్న వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇటు పోలీసులకూ దీనిపై పూర్తి ఆధారాలు లభించలేదు. ఈ నరబలిలో మృతి చెందిన ఇద్దరి మహిళల డెడ్‌బాడీలు అత్యంత దారుణ స్థితిలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

దారుణంగా హత్య..

ఇద్దరి మహిళల ప్రైవేట్ పార్ట్స్‌లో కత్తులు దూర్చారని, గొంతుని చీల్చారని, ముక్కలుగా చేశారని పోలీసులు వెల్లడించారు. ఓ మహిళ ఛాతీ భాగాన్ని కోశారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురు నిందితులనూ 12 రోజుల కస్టడీలో ఉంచారు. కేరళ హైకోర్ట్ కూడా ఈ ఘటనపై స్పందించింది. "సోషల్ మీడియాలో మూఢనమ్మకాలపై విపరీతంగా ప్రచారం జరుగుతుండటమూ ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది" అని వ్యాఖ్యానించింది. 

56 ముక్కలుగా చేసి..

ఓ జంట ఇద్దరు మహిళలను అతి కిరాతకంగా హత్య చేశారు. నరబలి ఇస్తే సంపన్నులైపోతామని నమ్మిన దంపతులు...ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేయడమే కాకుండా...శరీరాన్ని 56 ముక్కలుగా కోశారు. ఇంకా జుగుప్సాకరమైన విషయం ఏంటంటే...వాళ్ల మాంసాన్ని కూడా తిన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. రోసెలిన్, పద్మ అనే ఇద్దరు మహిళలు చిత్రహింసకు గురై మృతి చెందారని విచారణలో తేలింది. చేతులు వెనక్కి కట్టేసి ఛాతీ భాగంపై తీవ్రంగా గాయం చేసి, కావాలనే రక్తంపోయే వరకూ హింసించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒకరి శరీరాన్ని 56 ముక్కలుగా కోసి మూడు గోతులు తవ్వి వాటిలో ఆ అవయ వాలను పాతి పెట్టారు. ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే నరబలి ఇవ్వాలని నమ్మిన దంపతులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. నిందితులను విచారిస్తున్న సమయంలోనేపోలీసుల ప్రశ్నలకు సమాధానంగా "మేం వాళ్ల మాంసాన్ని తిన్నాం" అని షాకింగ్ సమాధానమిచ్చారట. అయితే...పోలీసులు మాత్రం దీన్ని ఇంకా నిర్ధరించలేదు. "ఇది నిరూపించాలంటే మాకు ఆధారాలు దొరకాలి" అని వెల్లడించారు. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. మృతుల్లో ఒకరైన రోసెలిన్ జూన్‌లో కనిపించకుండా పోయింది. ఆ తరవాత సెప్టెంబర్‌లో పద్మ మిస్సింగ్‌ అయినట్టు తేలింది. 

Also Read: Eluru Crime: ‘కన్న బిడ్డను అమ్ముదాం, చెరి సగం పంచుకొని చెక్కేద్దాం’ భార్యాభర్తల మధ్య దిమ్మతిరిగే డీలింగ్!

టాప్ హెడ్ లైన్స్

Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget