అన్వేషించండి

Kerala Human Sacrifice Case: కేరళ నరబలి ఘటన విచారణలో ఎన్నో కొత్త నిజాలు, ఫేక్ అకౌంట్‌తో దంపతులకు ఎర

Kerala Human Sacrifice Case: కేరళ నరబలి కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Kerala Human Sacrifice Case:

శ్రీదేవి పేరిట ఫేక్ అకౌంట్..

కేరళలో సంచలనం సృష్టించిన "నరబలి" ఘటనలో విచారణ జరుపుతున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేరం వెనక ప్రధాన సూత్రధారి మహమ్మద్ షఫీ అని పోలీసులు ప్రాథమికంగా తెలుసుకున్న విషయం. సోషల్ మీడియా ద్వారా దంపతులకు పరిచయమై... తరవాత వాళ్లతో ఈ నరబలి చేయించాడని పోలీసుల విచారణలో తేలింది. ఇక్కడ కీలక విషయం ఏంటంటే..సోషల్ మీడియాలో "శ్రీదేవి" పేరుతో అకౌంట్ మెయింటేన్ చేశాడు మహమ్మద్ షఫీ. పూల ఫోటోలను డీపీగా పెట్టుకుని మభ్యపెట్టాడు. తరవాత ఆ దంపతులతో పరిచయం పెంచుకున్నాడు. తనను తాను బాబాగా చెప్పుకున్నాడు. "దురదృష్టం తొలగిపోవాలంటే నరబలి ఇవ్వాలి" అని వారికి మాయమాటలు చెప్పాడు. అంతే కాదు. నిందితులైన భగవల్ సింగ్ భార్యతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్టు  తెలుస్తోంది. ఇదంతా పూజలో భాగమే అని వాళ్లను నమ్మించాడు కూడా. అయితే..పోలీసులు పూర్తి సాక్ష్యాధారాలు లభించాకే ఇది నిజమా కాదా అని నిర్ధరించే అవకాశముంది. అటు నిందితుల తరపున న్యాయవాది "మృతుల మాంసాన్ని తిన్నారు" అన్న వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇటు పోలీసులకూ దీనిపై పూర్తి ఆధారాలు లభించలేదు. ఈ నరబలిలో మృతి చెందిన ఇద్దరి మహిళల డెడ్‌బాడీలు అత్యంత దారుణ స్థితిలో ఉన్నాయని పోలీసులు తెలిపారు. 

దారుణంగా హత్య..

ఇద్దరి మహిళల ప్రైవేట్ పార్ట్స్‌లో కత్తులు దూర్చారని, గొంతుని చీల్చారని, ముక్కలుగా చేశారని పోలీసులు వెల్లడించారు. ఓ మహిళ ఛాతీ భాగాన్ని కోశారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురు నిందితులనూ 12 రోజుల కస్టడీలో ఉంచారు. కేరళ హైకోర్ట్ కూడా ఈ ఘటనపై స్పందించింది. "సోషల్ మీడియాలో మూఢనమ్మకాలపై విపరీతంగా ప్రచారం జరుగుతుండటమూ ఇలాంటి ఘటనలకు కారణమవుతోంది" అని వ్యాఖ్యానించింది. 

56 ముక్కలుగా చేసి..

ఓ జంట ఇద్దరు మహిళలను అతి కిరాతకంగా హత్య చేశారు. నరబలి ఇస్తే సంపన్నులైపోతామని నమ్మిన దంపతులు...ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేయడమే కాకుండా...శరీరాన్ని 56 ముక్కలుగా కోశారు. ఇంకా జుగుప్సాకరమైన విషయం ఏంటంటే...వాళ్ల మాంసాన్ని కూడా తిన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. రోసెలిన్, పద్మ అనే ఇద్దరు మహిళలు చిత్రహింసకు గురై మృతి చెందారని విచారణలో తేలింది. చేతులు వెనక్కి కట్టేసి ఛాతీ భాగంపై తీవ్రంగా గాయం చేసి, కావాలనే రక్తంపోయే వరకూ హింసించినట్టు పోలీసులు వెల్లడించారు. ఒకరి శరీరాన్ని 56 ముక్కలుగా కోసి మూడు గోతులు తవ్వి వాటిలో ఆ అవయ వాలను పాతి పెట్టారు. ఆర్థిక సమస్యలు తీరిపోవాలంటే నరబలి ఇవ్వాలని నమ్మిన దంపతులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. నిందితులను విచారిస్తున్న సమయంలోనేపోలీసుల ప్రశ్నలకు సమాధానంగా "మేం వాళ్ల మాంసాన్ని తిన్నాం" అని షాకింగ్ సమాధానమిచ్చారట. అయితే...పోలీసులు మాత్రం దీన్ని ఇంకా నిర్ధరించలేదు. "ఇది నిరూపించాలంటే మాకు ఆధారాలు దొరకాలి" అని వెల్లడించారు. ఫోరెన్సిక్ ఎగ్జామినేషన్ కొనసాగుతోంది. మృతుల్లో ఒకరైన రోసెలిన్ జూన్‌లో కనిపించకుండా పోయింది. ఆ తరవాత సెప్టెంబర్‌లో పద్మ మిస్సింగ్‌ అయినట్టు తేలింది. 

Also Read: Eluru Crime: ‘కన్న బిడ్డను అమ్ముదాం, చెరి సగం పంచుకొని చెక్కేద్దాం’ భార్యాభర్తల మధ్య దిమ్మతిరిగే డీలింగ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Husband plans to murder his wife: రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
రోడ్డు ప్రమాదం స్కెచ్‌తో భార్యను చంపేశాడు - కానీ బస్సు డాష్ క్యామ్ పట్టించేసింది!
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget