అన్వేషించండి

Eluru Crime: ‘కన్న బిడ్డను అమ్ముదాం, చెరి సగం పంచుకొని చెక్కేద్దాం’ భార్యాభర్తల మధ్య దిమ్మతిరిగే డీలింగ్!

Eluru Crime News: పొత్తిళ్లలో ఉన్న బిడ్డను ఆరో ప్రాణంగా పెంచుకోవాల్సిన ఆ తల్లిదండ్రులు అమ్మేయాలనుకున్నారు. విక్రయించగా వచ్చిన డబ్బును చెరి సగం పంచుకొని విడిపోవాలనుకున్నారు.

Eluru Crime News: కన్నబిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తల్లిదండ్రులు బిడ్డను అమ్మేయాలనుకున్నారు. అంతే కాదండోయ్ అమ్మగా వచ్చిన డబ్బును ఇద్దరూ చెరిసగం పంచుకోవాలనుకున్నారు. అనంతరం ఎవరి దారి వాళ్లు చూస్కోవాలని ప్లాన్ కూడా వేశారు. ఈ విషయం తెలిసిన వారంతా నివ్వెరపోయారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

వసంతతో రారాజు ప్రేమ వివాహం..

రాజమహేంద్రవరానికి చెందిన రారాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతడు వారిని వదిలేవి ఒంటరిగా ఉంటూ ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. కాకినాడకు చెందిన కె. వసంతకు గతంలో బాల్య వివాహం జరిగింది. కానీ పోలీసులకు తెలియడంతో ఆ పెళ్లి రద్దు అయింది. ప్రస్తుతం మేజర్ అయిన ఆమె రాజమహేంద్రవరంలోని ఒక బైక్ షోరూంలో పని చేస్తోంది. ఈ క్రమంలో వసంతను రారాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు. నెల రోజులుగా రారాజు.. తన తండ్రి ప్రసాద్, వసంతలతో కలిసి ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో ఉంటున్నాడు.

బిడ్డను అమ్మేసి వచ్చిన డబ్బును పంచుకోవాలని పథకం..

అయితే వసంత, రారాజుల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో తమ కుమారుడిని ఎవరికైనా అమ్మేసి వచ్చిన డబ్బును ఇద్దరం చెరి సగం పంచుకొని, విడిపోవాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే భీమవరానికి చెంది ఒక వ్యక్తికి చిన్నారిని అమ్మేందుకు బేరం పెట్టారు. ఈ మేరకు గురువారం రారాజు, వసంత, ప్రసాద్ లు ద్వారకా తిరుమల కొండపైనున్న ఒక కాటేజీ వద్దకు వెళ్లారు. భీమవరం వాసి కూడా అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు లక్షల రూపాయలకు ఇచ్చేద్దామని రారాజు, 10 లక్షలకు అమ్మేద్దామని ప్రసాద్ గొడవ పడ్డారు. 

భక్తుల వల్ల పోలీసుల ఎంట్రీ..

అయితే వారి వాగ్వాదం విని విషయం అర్థం చేసుకున్న పలువురు భక్తులు.. ఆలయ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భీమవరం వాసి పరారయ్యారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారితోపాటు రారాజు, వసంత, ప్రసాద్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇటీవలే క్షుద్రపూజల్లో భాగంగా పిల్లలనే చంపాలనుకున్న తండ్రి 

పిచ్చి భక్తితో నేరాలు చేసే వారు సినిమాల్లోనే కాదు .. మన చుట్టుపక్కలా ఉంటారు. అలాంటి వారిని చూసే సినిమాల్లో క్యారెక్టర్లను పెడుతూంటారు. ఇలాంటి ఓ వ్యక్తి కంటిపాపల్ని చంపుకునే ప్రయత్నం చేశాడు. చివరి క్షణంలో కుటుంబసభ్యులు చూశారు కాబట్టి సరిపోయింది. అప్పటికీ ఓ పాప పరిస్థితి విషమంగా మారింది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ క్రైమ్ ఘటన అందర్నీ నోళ్లు నొక్కుకునేలా చేసింది. 

ముగ్గులో కవల పిల్లల్ని కూర్చోబెట్టి క్షుద్ర పూజలు

అది నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి పల్లి గ్రామం. ఓ ఇంట్లో క్షుద్రపూజల తరహాలో ముగ్గులు వేసి ఉన్నాయి. ఆ ముగ్గుల్లో ఇద్దరు పసివాళ్లను కూర్చోబెట్టి ఉన్నారు. ఓ వ్యక్తి మంత్రాలు చదువుతున్నాడు. పిచ్చి పట్టిన వాడిలా ఉగుతూ పసుపు, కుంకుమలు చల్లుతున్నాడు. చుట్టుపక్కల ఎవరూ లేరు. కానీ అరుపులు వినిపించడంతో పక్కన వాళ్లు ఏం జరుగుతుందా అని వచ్చి చూశారు. అక్కడి పరిస్థితుల్ని చూసి ఒక్క సారిగా భయపడ్డారు. పిసిపిల్లలను బలిస్తాడేమోనని అతన్ని ఎదిరించి తీసుకెళ్లబోయారు. అయితే ఓ పాపను బలవంతంగా తీసుకురాగలిగారు. మరో పాప కోసం కొంత మందిని పోగేసి తీసుకు వచ్చే సరికి.. ఆ పాప గొంతులో కుంకుమ కుక్కేశాడు. అతి కష్టం మీద ఆ పాపను కూడా లాక్కుని ఆస్పత్రికి తరలించారు. ఆ పాప పరిస్థితి విషమంగా ఉంది. ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
Advertisement

వీడియోలు

India vs South Africa First ODI | నేడు భారత్ సఫారీ మధ్య మొదటి వన్డే
Ind vs SA ODI KL Rahul | కేఎల్ రాహుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Faf du Plessis Out of IPL 2026 | IPLకు స్టార్ ప్లేయర్ గుడ్​బై
BCCI Meeting With Rohit, Kohli | రో-కోతో గంభీర్ సమావేశం?
I Bomma Ravi Piracy Sites Issue Explained | మనం చూసే ఒక్క సినిమాతో.. లక్షల కోట్ల నేర సామ్రాజ్యం బతికేస్తోంది | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP New Pensions 2025: ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరు.. డిసెంబర్ 1 నుంచి లబ్ధిదారులకు ప్రయోజనం
AP Weather Updates: ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
ముంచుకొస్తున్న దిత్వా తుపాను ముప్పు.. మరో 2 రోజులపాటు ఏపీలో వర్షాలు
Virat Kohli and Rohit Sharma Records: బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
బ్యాట్ పట్టకముందే రోహిత్ శర్మ, కోహ్లీ ద్వయం రికార్డ్.. భారత్ నుంచి నెం 1 జోడీ
Akhanda 2 Tickets : 'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
'అఖండ 2' సింగిల్ టికెట్ 2 లక్షలు - ఇది కదా బాలయ్య క్రేజ్
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్ నమోదు.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్.. మరిన్ని చిక్కుల్లో సోనియా, రాహుల్ గాంధీ
IND vs SA 1st ODI India Playing XI: దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
దక్షిణాఫ్రికాతో తొలి వన్డే.. జట్టులోకి రోహిత్, కోహ్లీ.. ప్లేయింగ్ లెవన్ ఇదే!
Jobs: మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగం... 80 వేల జీతం... జాబ్ కోసం మీరు ఎలా దరఖాస్తు చేయాలంటే?
The Girlfriend OTT : ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget