అన్వేషించండి

Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ

Maoists Blast | ఛత్తీస్ గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. ఆర్మీ వాహనాన్ని పేల్చివేయడంతో 9 మంది జవాన్ల మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు.

IED blast on security forces vehicle in Bijapur district | రాయగఢ్: మావోయిస్టులు ఏర్పాటు చేసిన బాంబు పేలడంతో విషాదం నెలకొంది. ఛత్తీస్ గడ్‌లో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతర (Chhattisgarh Blast) పేలడంతో 9 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జవాన్లు గాయపడగా, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది వాహనంలో వెళ్తుండే మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 15 మంది వరకు ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

కూంబింగ్ చేస్తున్నారని కక్ష కట్టి వాహనం పేల్చివేసిన మావోయిస్టులు

బస్తర్ ఐజీ ప్రమాదంపై స్పందించారు. భద్రతా బలగాల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి జరిగినట్లు పేర్కొన్నారు. దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ లలో పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. కొన్ని రోజులు ఆ ప్రాంతాల్లో కూంబింగ్ తరువాత తిరిగొస్తున్న సమయంలో జవాన్ల వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేయడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుందని బస్తర్ ఐజీ తెలిపారు.

కొన్నేళ్ల నుంచి మావోయిస్టుల ఏరివేతకు చర్యలు

గత కొన్నేళ్లుగా ఛత్తీస్ గఢ్‌లో మావోయిస్టుల ఏరివేత జరుగుతోంది. దీంతో గత ఏడాది 200 మందికి పైగా మావోయిస్టులు ఎన్ కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ కగార్ వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని కన్నెర్ర చేశారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు టార్గెట్ గా మందుపాతర ఏర్పాటు చేసి వాహనాన్ని పేల్చివేశారు. దాంతో అక్కడ భారీ గుంత ఏర్పడింది. భద్రతా సిబ్బంది మృతదేహాలు ముక్కలుగా పడటంతో ఆ ప్రాంతం భయానక వాతావరణాన్ని తలపించింది.

డీఆర్‌జీ జవాన్ల వాహనం లక్ష్యంగా పేలిన మందుపాతర

‘గత మూడు రోజులుగా మావోయిస్టులు, నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో దంతేవాడ, నారాయణపూర్, బీజాపూర్ ప్రాంతాల్లో కూంబింగ్ కు వెళ్లొస్తున్న డీఆర్‌జీ జవాన్ల వాహనాన్ని నక్సలైట్లు పేల్చివేశారు. బీజాపూర్ లోని అంబేలి ఏరియాలో ఈ ఘటన జరిగింది. ఇందులో 8 మంది డీఆర్‌జీ జవాన్లు, ఒక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను రికవరీ చేస్తున్నాం. ఈ దాడి జరిగి భద్రతా సిబ్బంది చనిపోవడం దురదృష్ణకరం’ అని బస్తర్ ఐజీ పి సుందర్ రాజ్ అన్నారు.

Also Read: Mukesh Chandrakar: గుండెను చీల్చి బయటకు తీశారు - కాలేయం 4 ముక్కలైపోయింది, జర్నలిస్ట్ ముఖేశ్ హత్య కేసులో సంచలన విషయాలు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Embed widget