అన్వేషించండి

Saidabad: పోలీసులు చేతులెత్తేసిన కేసును ఛేదించిన సామాన్యుడు... భార్యను వెతికిపట్టుకున్న భర్త...

తన భార్య మిస్సింగ్ కేసు స్వయంగా ఛేదించాడో భర్త. మరో వ్యక్తి మాయమాటలు నమ్మి వెళ్లిపోయిన ఆమెను వెతికి పట్టుకున్నాడు. పోలీసులు ఏంచేయలేమని చేతులెత్తేసిన కేసులో సామాన్యుడు ఛేదించాడు.

పోలీసులు చేయలేని పనిని బాధితులే స్వయంగా రంగంలోకి దిగి పరిష్కరించుకున్నారు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహిళ ట్రాప్ చేస విశాఖపట్నం తీసుకువెళ్లిన  వ్యక్తిని పట్టుకొని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. హైదరాబాద్ బాలాజీ గార్డెన్ కృష్ణానగర్ లో వివాహిత ముగ్గురు పిల్లలు భర్తతో కలిసి ఉంటోంది. హోటల్లో పనిచేసే దుర్గారావు అనే వ్యక్తి ఈ మహిళకు మాయమాటలు చెప్పి గత సంవత్సరం మే 9న తన వెంట తీసుకువెళ్లాడు. మహిళ భర్త నగరంలో వివిధ ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకపోవడంతో మే 12న సైదాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను దుర్గారావు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని వెంటనే పట్టుకోవాలని ఫిర్యాదు చేశాడు. అప్పటి సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై సారంగపాణి  దర్యాఫ్తు చేసి ఆచూకీ దొరక్కపోవడంతో ఫైల్ ను పెండింగ్ లో పెట్టారు. 

భార్య కోసం స్వయంగా గాలింపు

పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన బాధితుడు.. పిల్లలు తల్లి కోసం తల్లడిల్లడం చూసి విసుగుచెంది కుటుంబ సభ్యుల సాయంతో భార్య కోసం గాలింపు మొదలుపెట్టారు. దుర్గారావు స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లాకు శుక్రవారం బయలుదేరారు. అక్కడ వెతికినా ప్రయోజనం కనిపించలేదు. దుర్గారావు నడిపే వాహనం నెంబర్ బట్టి ఆ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఈ బండి ఎక్కడైనా చలానాలు పడ్డాయా అని ఆరాతీశారు. దీంతో తీగలాగితే డొంక కదిలింది. అతను నడిపే వాహనానికి విశాఖపట్నంలో చలానాలు విధించినట్లు అది కంచర పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు తేలింది. దీంతో శనివారం నేరుగా విశాఖపట్నం చేరుకున్నారు. ఇక్కడ సైదాబాద్ పోలీసులు కంచరపాలెం పోలీసులతో మాట్లాడారు. వారి సహకారంతో  ఆ ప్రాంతంలో వాహనం తిరుగుతున్నట్టుగా తేల్చి చెప్పారు. కంచరపాలెంలోని ఒక బిర్యానీ సెంటర్లో ఇక్కడి నుంచి పారిపోయిన దుర్గారావు ఆ వివాహిత పనిచేస్తున్నట్లుగా తేలింది. 

Also Read: కొత్త పీఆర్సీపై రంగంలోకి వాలంటీర్లు... ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు

హైదరాబాద్ తరలింపు 

శనివారం కావడంతో బిర్యానీ సెంటర్ తీయకపోవడంతో వాళ్ల ప్రయత్నం ఫలించలేదు. ఆదివారం ఉదయం ఆరు గంటలకే అక్కడకు చేరుకుని నిఘా పెట్టారు. దీంతో దుర్గారావు వాహనాన్ని తీసుకువచ్చి బిర్యాని సెంటర్ ముందు పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. బిర్యానీ సెంటర్ నుంచి దుర్గారావు తిరిగి బయటకు వాహనం వద్దకు రాగానే వెంటనే వెళ్లి పట్టుకున్నారు. అదే బిర్యానీ సెంటర్ లో దుర్గారావుతో వచ్చిన మహిళ పనిచేస్తుండడంతో ఇరువురు పట్టుకొని కంచరపాలెం పోలీసు స్టేషన్ లో అప్పగించారు. అక్కడి పోలీసులు సైదాబాద్ పోలీసులతో మాట్లాడి వీరితో హామీ పత్రం రాయించుకొని ఇరువురినీ అప్పగించారు. ప్రస్తుతం వారిని సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇక్కడ పోలీసులు వెంట లేనప్పటికీ బాధితులే రంగంలోకి దిగి మహిళ మిస్సింగ్ కేసును ఛేదించడం విశేషం. 

Also Read:  క్రికెట్ ఆడుతున్న పిల్లలపై మంత్రి కుమారుడు కాల్పులు... చిన్నారులకు తీవ్రగాయాలు... ఆగ్రహంతో మంత్రి ఇంటిపై గ్రామస్థుల దాడి..!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget