అన్వేషించండి

AP PRC Volunteers: కొత్త పీఆర్సీపై రంగంలోకి వాలంటీర్లు... ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు

కొత్త పీఆర్సీపై ప్రభుత్వ వాదన వినిపించేందుకు వాలంటీర్లను రంగంలోకి దింపినట్లు సమాచారం. ఎఫ్‌వోఏ సంస్థ ఈ పోస్టులను వాలంటీర్లకు పంపి... వాటిని తమ పరిధిలోని గ్రూపుల్లో పోస్టు చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది.

కొత్త పీఆర్సీపై ప్రభుత్వం తన వాదనను ప్రజలకు బలంగా వినిపించాలని డిసైడ్ అయింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గ్రామ, వార్డు వాలంటీర్లను ఆదేశించింది. కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాల్లో కోత పడదని సీఎం జగన్‌ కేబినెట్ సమావేశంలో చెప్పారని మంత్రి పేర్ని నాని తెలిపారు. పీఆర్సీపై ప్రజలకు అవగాహన కల్పించాలని వాలంటీర్లకు పోస్టులు చేరినట్లు సమాచారం. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు శిక్షణ ఇచ్చే ఫీల్డ్‌ ఆపరేటింగ్‌ ఏజెన్సీ (ఎఫ్‌వోఏ) సంస్థ వాలంటీర్లకు ఈ పోస్టులు పంపింది. వాలంటీర్లు తమ పరిధిలోని 50 కుటుంబాలు ఉన్న గ్రూపులో వీటిని పోస్టు చేయాలని ఎఫ్‌వోఏ తెలిపింది. దీంతో ఆయా గ్రూపుల్లో వాలంటీర్లు పోస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: నేడు సమ్మె నోటీసు ఇవ్వనున్న ఉద్యోగ సంఘాలు... పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని ప్రకటన

పీఆర్సీతో జీతాలు పెరుగుతాయని పోస్టులు

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏంచేసిందో ఆ ప్రకటనలో తెలిపింది. విభజన సమస్యలతోపాటు కోవిడ్‌ పరిస్థితులతో రాష్ట్రం ఆదాయం తగ్గిందని కొత్త పీఆర్సీతో ఉద్యోగుల జీతాలు తగ్గుతాయని చెప్పడం అవాస్తవమని ఇందులో పేర్కొంది. ఈ పీఆర్సీతో జీతాల పెరుగుతాయని పేర్కొంది. ఇలాంటి 8 పోస్టులను వాట్సప్‌ గ్రూపుల్లో వాలంటీర్లు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులూ ఆలోచించండి పేరుతో ఈ పోస్టులు వాలంటీర్లకు చేరుతున్నాయి. ఎఫ్‌వోఏ సంస్థకు చెందిన ఎమ్‌ఎల్‌వోలు వీటిని వాలంటీర్లకు పంపుతున్నారు. ఇవే కాకుండా పీఆర్సీపై పార్టీ అభిప్రాయంగా ఉన్న 12 పేజీల నోట్‌ను కూడా సర్క్యులేట్‌ పంపారు.  

నేడు సమ్మె నోటీసు

పీఆర్సీ జీవోలపై ఆగ్రహంతో ఉన్న ఏపీ ఉద్యోగ సంఘాలు... ఆ జీవోలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సీఎస్ ను కలిసి సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చిస్తామని పీఆర్సీ సాధన సమితి తేల్చిచెప్పింది. చర్చలకు రావాలని ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ చేసిన చర్చల ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు తిరస్కరించాయి. మంత్రుల కమిటీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని కోరింది. అయితే ఉద్యోగ సంఘాలు జీవోలు రద్దు చేస్తేనే చర్చల గురించి ఆలోచిస్తామని ప్రకటించారు. అశుతోష్‌ మిశ్ర కమిటీ నివేదిక బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

Also Read: సమ్మె వద్దు.. చర్చించుకుందాం రండి.. ఉద్యోగ సంఘాల నేతలకు మంత్రుల ఫోన్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Embed widget