అన్వేషించండి

Crime News: మద్యం సీసా చెప్పిన సాక్ష్యం - 20 నెలల అనంతరం నిందితుడిని పట్టించింది, అసలు కథ ఏంటంటే?

Telangana News: పగిలిన మద్యం సీసా 20 నెలల క్రితం జరిగిన మహిళ హత్య కేసులో నిందితున్ని పట్టించింది. వేలిముద్రల ఆధారంగా రెండు కేసుల్లో నిందితుడు ఒకడే అని పోలీసులు నిర్ధారించారు.

Beer Bottle Key Evidence In Murder Case: మద్యం సీసా ఓ నిందితున్ని పట్టించింది. 20 నెలల క్రితం జరిగిన ఓ మహిళ మర్డర్ కేసును పగిలిన మద్యం సీసాపై దొరికిన వేలిముద్రల ఆధారంగా పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారు కందుకూరు (Kandukuru) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15న జరిగిన వృద్ధ దంపతుల జంట హత్యల కేసును ఇటీవలే రాచకొండ పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన మూగ (చింతబాయి) ఉషయ్య (70), అతని భార్య శాంతమ్మ (60).. రంగారెడ్డి జిల్లా కందుకూరు ఠాణా పరిధిలోని కొత్తగూడ సమీపంలో వారి స్వగ్రామానికి చెందిన మనోహరరావుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో రెండున్నరేళ్లుగా కాపలాదారులుగా పని చేస్తున్నారు. మామిడి తోటలో ఓ పక్కన షెడ్లతో పాటు నిర్మించిన గదుల్లో వీరు నివాసం ఉంటున్నారు. వీరిని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. శాంతమ్మను మంచంపై గొంతు కోసి హత్య చేయగా.. ఉషయ్యను వారు నివాసం ఉంటోన్న వంద మీటర్ల దూరంలో మామిడి తోటలో పరుగెత్తించి మెడ భాగంపై నరికి చంపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

20 నెలల క్రితం మహిళ మర్డర్ కేసులో..

ఈ కేసులో నిందితుని గురించి పూర్తి స్థాయిలో విచారిస్తుండగా.. ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న మహిళ మర్డర్ కేసుకు సంబంధించి కీలక ఆధారం పోలీసులకు లభ్యమైంది. దీని ఆధారంగా ఆ హత్య చేసింది కూడా ఇతనేనని పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా ఓజిలి మండలానికి చెందిన చెంచు శైలజారెడ్డి (42), భర్త కృష్ణారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి 2011లో రంగారెడ్డి జిల్లాలోని (Rangareddy) కందుకూరుకు వచ్చి దాసర్లపల్లిలో అరుణ్ ఫామ్ హౌస్‌లో పని చేస్తున్నారు. అయితే, 2023 మార్చి 3న కృష్ణారెడ్డి, పిల్లలు బయటకు వెళ్లగా.. శైలజారెడ్డి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. అప్పటికే ఆమెపై కన్నేసిన దాసర్లపల్లికి చెందిన ఉప్పుల శివకుమార్.. ఫాం హౌస్‌కు వెళ్లి ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో ఆమె ఎదురు తిరిగింది. ఈ క్రమంలోనే మహిళను కత్తితో నరికి చంపాడు.

మద్యం సీసా పట్టించింది

మహిళను చంపేసిన అనంతరం అక్కడే మద్యం సీసా కనిపించగా తాగేందుకు యత్నించాడు. ఈ క్రమంలో సీసా కింద పడి పగిలిపోయింది. దానిపై నిందితుడి వేలిముద్రలు పడ్డాయి. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారు కాగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసాపై వేలిముద్రలు తప్ప ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ క్రమంలోనే వాటిని భద్రపరచగా.. ఇప్పటికీ పోలీసులకు చిక్కాడు. తాజాగా, కొత్తగూడలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో శివకుమారే నిందితుడని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. 20 నెలల క్రితం జరిగిన మహిళ శైలజారెడ్డి మర్డర్ కేసులోనూ నమోదైన వేలిముద్రలతో నిందితుని వేలిముద్రలు సరిపోలగా.. 2 కేసుల్లోనూ నిందితుడు ఒకడే అని పోలీసులు తేల్చారు.

Also Read: Strange Incident: కొంప ముంచిన కోతి - అరటి పండు ఇస్తే కింద పడేసింది, సీన్ కట్ చేస్తే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Delhi : ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్‌! ట్రాఫిక్ నియంత్రణలో కీలక మార్పులు- ఈవీలకు ప్రత్యేక రూట్‌
Stranger Things Series Season 5 OTT : అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
అవెయిటెడ్ 'స్ట్రేంజర్ థింగ్స్' వెబ్ సిరీస్ - ఫైనల్ సీజన్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Embed widget