అన్వేషించండి

Mumbai Actress Case : మంబై నటికి వేధింపుల కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు - ఏపీ ప్రభుత్వం ఆదేశం

Andhra Pradesh : ముంబై నటి కాదంబరి జీత్వానీని తప్పుడు కేసులతో వేధించిన వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ప్రధానంగా ఐపీఎస్‌ల పాత్ర ఎక్కవగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP Govt orders high-level probe into Mumbai actress Kadambari Jeethwani cases :  ముంబైకి చెందిన డాక్టర్, నటి కాదంబరి జెత్వానీ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. మీడియా చానళ్లతో మాట్లాడుతూ ఏపీ ఐపీఎస్ అధికారులు తనను అత్యంత ఘోరంగా వేధించారని తనతో పాటు తన తల్లిదండ్రుల్ని కూడా వేధించారని.. 40 రోజుల పాటు నిర్బంధించి ఖాళీ పత్రాలపై సంతకం పెట్టించుకుని వదిలి పెట్టారని ఆరోపించారు. ఈ అంశం సంచలనంగా మారడంతో ఏపీ ప్రభుత్వం  దృష్టి సారించింది. సీఎంవోకు ఇంటలిజెన్స్ అధికారులు, విజయవాడ సీపీ  రాజశేఖర్ బాబు నివేదికలు సమర్పించారు. ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించారు. 

ముంబై నటి తన భద్రత, తన కుటుంబ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా ఆమె వద్ద నుంచి ఆన్ లైన్ లో పిర్యాదు తీసుకుని దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.. ఆ కేసులో ఆ నటి కుటుంబాన్ని అరెస్టు చేయడానికి ముంబైకి వెళ్లిన బృందం మొత్తాన్ని ఓ సారి పిలిపించి మాట్లాడారు.  అప్పటి  కమిషనర్ కాంతిరాణా టాటా, డీసీపీగా ఉన్న విశాల్ గున్ని మినహా ఇతరుల్ని ప్రశ్నించి అసలు జత్వానీ కుటుంబాన్ని తీసుకు వచ్చింది.. ఎక్కడ ఉంచారు.. ఎలా వేధించారన్న వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. 

వైసీపీకి బిగ్ షాక్ - ఏకకాలంలో రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామా

కృష్ణాజిల్లా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తమను రూ. ఐదు  లక్షలకు కాదంబరి జెత్వానీ మోసం చేసిందని  పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి.. విమానాల్లో ముంబైకి వెళ్లి ఆ కుటుంబాన్ని పోలీసులు తీసుకు వచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఇలా వేరే రాష్ట్రాలకు వెళ్లి ఓ సినీ నటిని చీటింగ్ కేసులో అరెస్టు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు. అయితే కాదంబరి జెత్వానీ కటుంబాన్ని తీసుకు వచ్చి నలబై రోజులు విజయవాడలో ఉంచినా సరే మీడియాకు సమాచారం ఇవ్వలేదు. పూర్తిగా అంతర్గతంగా ఉంచారు. అదే సమయంలో బెయిల్ కూడా పోలీసులు ఇప్పించి ముంబైకి పంపినట్లుగా తెలుస్తోంది. అప్పటికే సెటిల్మెంట్ పై సంతకాలు పెట్టించుకున్నారని అంటున్నారు. 

Kadambari Jethwani Interview | AP Police, YSRCP నేతలు ఎలా హింస పెట్టారంటే |

కాదంబరి జత్వానీని వేధిచిన ఘటనలో..  ప్రధానంగా  ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు,  కాంతిరాణా టాటాతో పాటు విశాల్ గున్నీ పేర్లు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వీరు చట్టాలను పట్టించుకోకుండా వైసీపీ రాజకీయ శత్రువుల్ని  వేధించడానికే పరిమితయ్యారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా వీరికి  పోస్టింగ్  కూడా దక్కలేదు. రోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినా ఆ పని  కూడా చేయడం లేదు. ఇప్పుడు ఈ కేసులో అసలేం  జరిగిందో ఉన్నత స్థాయి దర్యాప్తులో తేలనుంది. ఐపీఎస్ అధికారులు తప్పు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.    

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Nalgonda Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
హైదరాబాద్- విజయవాడ హైవేపై కారును ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. నలుగురు మృతి
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Instagram Reel: రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!
రీల్స్ పిచ్చి కొంపముంచింది! వజ్రాల నెక్లెస్ దొంగిలించి ఇన్‌స్టాగ్రామ్‌ రీల్ చేసిన పనిమనిషి.. ఏడాది తర్వాత సీన్ రివర్స్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
YouTuber Prashna Ravan: ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్: ఒకే కేసుగా విచారించాలని, సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Embed widget