అన్వేషించండి

Mumbai Actress Case : మంబై నటికి వేధింపుల కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తు - ఏపీ ప్రభుత్వం ఆదేశం

Andhra Pradesh : ముంబై నటి కాదంబరి జీత్వానీని తప్పుడు కేసులతో వేధించిన వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. ప్రధానంగా ఐపీఎస్‌ల పాత్ర ఎక్కవగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP Govt orders high-level probe into Mumbai actress Kadambari Jeethwani cases :  ముంబైకి చెందిన డాక్టర్, నటి కాదంబరి జెత్వానీ కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. మీడియా చానళ్లతో మాట్లాడుతూ ఏపీ ఐపీఎస్ అధికారులు తనను అత్యంత ఘోరంగా వేధించారని తనతో పాటు తన తల్లిదండ్రుల్ని కూడా వేధించారని.. 40 రోజుల పాటు నిర్బంధించి ఖాళీ పత్రాలపై సంతకం పెట్టించుకుని వదిలి పెట్టారని ఆరోపించారు. ఈ అంశం సంచలనంగా మారడంతో ఏపీ ప్రభుత్వం  దృష్టి సారించింది. సీఎంవోకు ఇంటలిజెన్స్ అధికారులు, విజయవాడ సీపీ  రాజశేఖర్ బాబు నివేదికలు సమర్పించారు. ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించారు. 

ముంబై నటి తన భద్రత, తన కుటుంబ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా ఆమె వద్ద నుంచి ఆన్ లైన్ లో పిర్యాదు తీసుకుని దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు.. ఆ కేసులో ఆ నటి కుటుంబాన్ని అరెస్టు చేయడానికి ముంబైకి వెళ్లిన బృందం మొత్తాన్ని ఓ సారి పిలిపించి మాట్లాడారు.  అప్పటి  కమిషనర్ కాంతిరాణా టాటా, డీసీపీగా ఉన్న విశాల్ గున్ని మినహా ఇతరుల్ని ప్రశ్నించి అసలు జత్వానీ కుటుంబాన్ని తీసుకు వచ్చింది.. ఎక్కడ ఉంచారు.. ఎలా వేధించారన్న వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. 

వైసీపీకి బిగ్ షాక్ - ఏకకాలంలో రాజ్యసభ ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్ రావు రాజీనామా

కృష్ణాజిల్లా వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తమను రూ. ఐదు  లక్షలకు కాదంబరి జెత్వానీ మోసం చేసిందని  పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి.. విమానాల్లో ముంబైకి వెళ్లి ఆ కుటుంబాన్ని పోలీసులు తీసుకు వచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సాధారణంగా ఇలా వేరే రాష్ట్రాలకు వెళ్లి ఓ సినీ నటిని చీటింగ్ కేసులో అరెస్టు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవారు. అయితే కాదంబరి జెత్వానీ కటుంబాన్ని తీసుకు వచ్చి నలబై రోజులు విజయవాడలో ఉంచినా సరే మీడియాకు సమాచారం ఇవ్వలేదు. పూర్తిగా అంతర్గతంగా ఉంచారు. అదే సమయంలో బెయిల్ కూడా పోలీసులు ఇప్పించి ముంబైకి పంపినట్లుగా తెలుస్తోంది. అప్పటికే సెటిల్మెంట్ పై సంతకాలు పెట్టించుకున్నారని అంటున్నారు. 

Kadambari Jethwani Interview | AP Police, YSRCP నేతలు ఎలా హింస పెట్టారంటే |

కాదంబరి జత్వానీని వేధిచిన ఘటనలో..  ప్రధానంగా  ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు,  కాంతిరాణా టాటాతో పాటు విశాల్ గున్నీ పేర్లు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వీరు చట్టాలను పట్టించుకోకుండా వైసీపీ రాజకీయ శత్రువుల్ని  వేధించడానికే పరిమితయ్యారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా వీరికి  పోస్టింగ్  కూడా దక్కలేదు. రోజూ డీజీపీ ఆఫీసుకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లాలని ఆదేశాలు ఇచ్చినా ఆ పని  కూడా చేయడం లేదు. ఇప్పుడు ఈ కేసులో అసలేం  జరిగిందో ఉన్నత స్థాయి దర్యాప్తులో తేలనుంది. ఐపీఎస్ అధికారులు తప్పు చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.    

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Kerala BJP: కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
కేరళలో కమలం లక్ష్యం కింగ్ మేకర్ - మోదీ, అమిత్ షా వ్యూహాలు వర్కవుట్ అవుతాయా?
Hyderabad Fire Accident: బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
బాచుపల్లిలో అగ్ని ప్రళయం- 35దుకాణాలు బుగ్గి- రోడ్డున పడ్డ వ్యాపారులు!
Vijayawada- Visakha High Speed Rail: విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
విజయవాడ నుంచి కర్నూలుకు ప్రయాణం రెండు గంటలే! ఏపీ రూపు రేఖలు మార్చేయనున్న రైల్వే శాఖ ప్రతిపాదనలు!
Embed widget