అన్వేషించండి

AP News : విహార యాత్రలో విషాదం, వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు

AP News : అల్లూరి జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. విహార యాత్రకు వచ్చిన ముగ్గురు విద్యార్థినులు వాగులో గల్లంతయ్యారు.

AP News : అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద యాత్ర విషాదం నింపింది. చింతూరు మండలం సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద ముగ్గురు విద్యార్థినులు వాగులో గల్లంతయ్యారు. స్నానం చేస్తూ 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు గల్లంతయ్యారు. బాపట్ల జిల్లా చీరాలలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి విద్యార్థులు విహార యాత్రకు వచ్చినట్లు తెలుస్తోంది. గల్లంతైన విద్యార్థినులో గుమ్మడి జయశ్రీ, సువర్ణ కమల, గీతాంజలి ఉన్నారు. వీరిలో ఇద్దరు విద్యార్థినుల మృత దేహాలు లభ్యమయ్యాయి.  26 మంది విహార యాత్రకు వచ్చినట్లు సమాచారం. మరొకరి మృతదేహం కోసం చింతూరు పోలీసులు గాలిస్తున్నారు.  

తల్లిదండ్రుల ఆందోళన 

బాపట్ల జిల్లా వేటపాలెంలో విషాదం నెలకొంది. వేటపాలెంలోని ఓ ప్రైవేట్ హైస్కూల్ లో 10వ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్దులు భద్రచలం, అరకు విహరయాత్రకు స్కూల్ యాజమాన్యం తీసుకువెళ్లింది. అయితే భద్రచలానికి 50 కిలోమీటర్ల దూరంలోని అల్లూరి జిల్లా చింతూరు సోకిలేరు వాగులో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు బాలికలు గల్లంతైయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరి విద్యార్థునుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక విద్యార్థిని ఆచూకీ లభ్యం కాలేదు. విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థినులు గుమ్మడి జయశ్రీ(14), సువర్ణ కమల(14), గీతాంజలిగా గుర్తించారు. తల్లిదండ్రులకు స్కూల్ యాజమన్యం ప్రమాద ఘటన సమాచారం తెలపకపోవడంతో బాలికల కుటుంబసభ్యులు స్కూల్ యాజమాన్యం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో కొద్దిసేపు ఉద్రికత్త చోటుచేసుకుంది. తమ పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోయిన సంఘటనను తమకు స్కూల్ యాజమాన్యం తెలపలేదని మీడియాలో వార్తలు చూస్తే తమకి తెలిసిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

స్నానానికి దిగి తాతా మనవడు మృతి 

విజయనగరం జిల్లా లచ్చరాయిపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో స్నానానికి దిగిన తాతా, మనవళ్లు  చెరువులో మునిగిపోయారు.  స్నానానికి వెళ్లినవారు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో స్థానికులు చెరువులో గాలించారు. దీంతో తాతా మనవళ్ల మృతదేహాలు దొరికాయి.  లచ్చరాయిపురం గ్రామానికి చెందిన బోర రాము, బోర గౌతం తాతామనవళ్లు భవాని మాలవేసుకున్నారు. గ్రామానికి సమీపంలోని చెరువులో స్నానం చేసేందుకు తాతామనవడు వెళ్లారు. చెరువు లోతుగా ఉండటంతో స్నానానికి దిగిన ఇద్దరూ గల్లంతయ్యారు. స్నానానికి వెళ్లినవారు తిరిగి రాకపోవటంతో తోటి వారు, స్థానికుల సాయంతో చెరువులో గాలించారు. దీంతో వారిద్దరి మృతదేహాలు లభించాయి. తాతామనవళ్ల మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. 

షాద్ నగర్ లో విషాదం 

రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌ లో విషాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని సోలిపూర్‌లోని ఓ నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన అక్షిత్‌ గౌడ్‌, ఫరీద్‌, పర్వీన్‌ చేపలు పట్టేందుకు నీటి గుంటలోకి దిగారు. నీటి గుంట లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు చిన్నారులు అందులో మునిగిపోయారు. స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న చిన్నారులు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Student Commits Suicide : శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య, మళ్లీ పుడతా అంటూ సూసైడ్ నోట్!

Also Read : Loan App Racket: సరికొత్త పంథాలో లోన్ యాప్ చీటర్స్, అలాంటి ఫోన్ కాల్స్ తో జాగ్రత్త సుమీ!

 

టాప్ హెడ్ లైన్స్

Splendor Siddha Reddy Arrest: అతడి పేరు సిద్ధారెడ్డి..స్ప్లెండర్ సిద్ధారెడ్డి.. స్ప్లెండర్ బైకుల్ని మాత్రమే మాయం చేస్తాడు !
అతడి పేరు సిద్ధారెడ్డి..స్ప్లెండర్ సిద్ధారెడ్డి.. స్ప్లెండర్ బైకుల్ని మాత్రమే మాయం చేస్తాడు !
Ketan Agarwal Murder Case Pune: పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
Gade Sai Krishna Lockup Death Case: సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
సాయికృష్ణ కేసులో కీలక అప్డేట్! మరికొందరిపై సిట్ అనుమానం! మరిన్ని అరెస్టులు ఖాయమా?
Gade Sai Krishna Lockup Death Case: కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!
కుమారుడి లాకప్‌డెత్‌ కేసులో నాగరాజుతోపాటు చాలా మంది హస్తం ఉంది- మరో బాంబు పేల్చిన సాయికృష్ణ తల్లి!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Embed widget