అన్వేషించండి

AP News : విహార యాత్రలో విషాదం, వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు

AP News : అల్లూరి జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. విహార యాత్రకు వచ్చిన ముగ్గురు విద్యార్థినులు వాగులో గల్లంతయ్యారు.

AP News : అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద యాత్ర విషాదం నింపింది. చింతూరు మండలం సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద ముగ్గురు విద్యార్థినులు వాగులో గల్లంతయ్యారు. స్నానం చేస్తూ 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు గల్లంతయ్యారు. బాపట్ల జిల్లా చీరాలలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి విద్యార్థులు విహార యాత్రకు వచ్చినట్లు తెలుస్తోంది. గల్లంతైన విద్యార్థినులో గుమ్మడి జయశ్రీ, సువర్ణ కమల, గీతాంజలి ఉన్నారు. వీరిలో ఇద్దరు విద్యార్థినుల మృత దేహాలు లభ్యమయ్యాయి.  26 మంది విహార యాత్రకు వచ్చినట్లు సమాచారం. మరొకరి మృతదేహం కోసం చింతూరు పోలీసులు గాలిస్తున్నారు.  

తల్లిదండ్రుల ఆందోళన 

బాపట్ల జిల్లా వేటపాలెంలో విషాదం నెలకొంది. వేటపాలెంలోని ఓ ప్రైవేట్ హైస్కూల్ లో 10వ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్దులు భద్రచలం, అరకు విహరయాత్రకు స్కూల్ యాజమాన్యం తీసుకువెళ్లింది. అయితే భద్రచలానికి 50 కిలోమీటర్ల దూరంలోని అల్లూరి జిల్లా చింతూరు సోకిలేరు వాగులో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు బాలికలు గల్లంతైయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరి విద్యార్థునుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక విద్యార్థిని ఆచూకీ లభ్యం కాలేదు. విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థినులు గుమ్మడి జయశ్రీ(14), సువర్ణ కమల(14), గీతాంజలిగా గుర్తించారు. తల్లిదండ్రులకు స్కూల్ యాజమన్యం ప్రమాద ఘటన సమాచారం తెలపకపోవడంతో బాలికల కుటుంబసభ్యులు స్కూల్ యాజమాన్యం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో కొద్దిసేపు ఉద్రికత్త చోటుచేసుకుంది. తమ పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోయిన సంఘటనను తమకు స్కూల్ యాజమాన్యం తెలపలేదని మీడియాలో వార్తలు చూస్తే తమకి తెలిసిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

స్నానానికి దిగి తాతా మనవడు మృతి 

విజయనగరం జిల్లా లచ్చరాయిపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో స్నానానికి దిగిన తాతా, మనవళ్లు  చెరువులో మునిగిపోయారు.  స్నానానికి వెళ్లినవారు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో స్థానికులు చెరువులో గాలించారు. దీంతో తాతా మనవళ్ల మృతదేహాలు దొరికాయి.  లచ్చరాయిపురం గ్రామానికి చెందిన బోర రాము, బోర గౌతం తాతామనవళ్లు భవాని మాలవేసుకున్నారు. గ్రామానికి సమీపంలోని చెరువులో స్నానం చేసేందుకు తాతామనవడు వెళ్లారు. చెరువు లోతుగా ఉండటంతో స్నానానికి దిగిన ఇద్దరూ గల్లంతయ్యారు. స్నానానికి వెళ్లినవారు తిరిగి రాకపోవటంతో తోటి వారు, స్థానికుల సాయంతో చెరువులో గాలించారు. దీంతో వారిద్దరి మృతదేహాలు లభించాయి. తాతామనవళ్ల మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. 

షాద్ నగర్ లో విషాదం 

రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌ లో విషాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని సోలిపూర్‌లోని ఓ నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన అక్షిత్‌ గౌడ్‌, ఫరీద్‌, పర్వీన్‌ చేపలు పట్టేందుకు నీటి గుంటలోకి దిగారు. నీటి గుంట లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు చిన్నారులు అందులో మునిగిపోయారు. స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న చిన్నారులు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Student Commits Suicide : శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య, మళ్లీ పుడతా అంటూ సూసైడ్ నోట్!

Also Read : Loan App Racket: సరికొత్త పంథాలో లోన్ యాప్ చీటర్స్, అలాంటి ఫోన్ కాల్స్ తో జాగ్రత్త సుమీ!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Cyber Fraud:మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
మాజీ డీజీపీ మనవరాలి నుంచి రూ.1.2 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Hyderabad Latest News: సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!
సమోసాలు కనిపిస్తే ఆగిపోయే వారి కోసమే ఈ న్యూస్! ఆ టేస్ట్ రెసిపీ గుట్టు రట్టు చేసిన పోలీసులు!

వీడియోలు

Late Marriage Effect on Women | 40ఏళ్లు దాటినా పెళ్లంటే ఇష్టపడని మహిళలు, ఆరోగ్యంపై ఊహించని ప్రభావం
Harshit Rana Ruled Out IPL 2026 | హర్షిత్ దూరం, పతిరణ రాక ఆలస్యం. కష్టాల్లో కేకేఆర్ | ABP Desam
Laxman Sivaramakrishnan Commentary BCCI | కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్ బై | ABP Desam
SRH Players Injury IPL 2026 Jack Edwards | గాయంతో సన్‌రైజర్స్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం | ABP Desam
MS Dhoni Injured in CSK Practice Camp IPL 2026 | ధోనీ మోకాలి గాయం ? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Rythu Bharosa Funds: నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడు రైతు భరోసా నిధుల విడుదల.. సిద్దిపేటలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
IPL orange cap winners: ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
IPLలో అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన బ్యాటర్ ఎవరు? విరాట్ కోహ్లీ కాదండోయ్
LPG VS PNG: హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
హైదరాబాద్‌లో పైప్‌డ్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఎలా పొందాలి? మధ్య తరగతికి LPG లేదా PNGలలో ఏది బెస్ట్..?
Embed widget