అన్వేషించండి

Nitin Gadkari on Petrol Diesel Future: పెట్రోల్, డీజిల్ వాహనాల శకం ముగిసినట్టే! కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన కామెంట్స్!

Nitin Gadkari on Petrol Diesel Future: భవిష్యత్‌లో పెట్రోల్, డీజిల్ వాహనాలకు చోటు లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. హైడ్రోజన్, ఇథనాల్, ఈవీలే దిక్సూచిగా అభివర్ణించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ వాహనాలకు స్థానం ఉండదని గడ్కరీ తెలిపారు.
  • కాలుష్యం, దిగుమతులు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపాలి.
  • హైడ్రోజన్, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో వాహనాల అభివృద్ధి జరుగుతోంది.
  • ప్రయాణికుల భద్రత, నాణ్యతపై తయారీదారులు దృష్టి సారించాలి.

Nitin Gadkari on Petrol Diesel Future: భారత్ రవాణా ముఖ చిత్రం వేగంగా మారుతోంది. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన ఇంధనాల వైపు దేశాన్ని నడిపించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయంశంగా మారాయి. దీర్ఘ కాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్ లేదని ఆయన స్పష్టం చేశారు. 

నితిన్ గడ్కరీ తన ప్రసంగంలో పెట్రోల్ డీజిల్ వాడకం వల్ల ఎదురవుతున్న రెండు ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. మొదటిది పర్యావరణంపై పడుతున్న ప్రభావం, రెండోది పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల కోసం దేశం వెచ్చిస్తున్న భారీ విదేశీ మారక ద్రవ్యం. ఈ తీవ్రమైన సమస్యలను అధిగమించడానికి బయోఫ్యూయల్స్, సీఎన్జీ, ఎల్‌ఎన్జీ, ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌ల వంటి స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాలవైపు తయారీదారులు మళ్లడం అత్యవసరం అని పేర్కొన్నారు. 

Also Read: ఎంజీ కామెట్ వైజాగ్‌లో కొనాలి అంటే ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటీ?

గ్రీన్ మొబిలిటీ దిశగా భారత్‌ ఇప్పటికే పలు ప్రాజెక్టులను చేపట్టింది. ముఖ్యంగా హైడ్రోజన్‌ను భవిష్యత్ ఇంధనంగా గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని పది ప్రధాన మార్గాల్లో హైడ్రోజన్ ట్రక్కులు, బస్‌లను నడుపుతున్నట్టు వెల్లడించారు. టాటా మోటార్స్, వోల్వో, అశోక్ లేలాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు ఇప్పటికే హైడ్రోజన్ ఇంధన ట్రయల్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాయి. 

భవిష్యత్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ఇంజన్

ఇథనాల్ వాడకాన్ని పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. భారత్ తన సొంత వనరుల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం వాహనాలు E20 ఇంధనంతో నడుస్తుండగా భవిష్యత్‌లో పూర్తి స్థాయి ఫ్లెక్స్‌ ఫ్యూయల్ ఇంజన్ అభివృద్ధిపై పరిశ్రమ దృష్టి సారించిందని గడ్కరీ తెలిపారు. 

Also Read: ఎంజీ కామెట్‌ ఈవీ వర్సెస్‌ టాటా టియాగో ఈవీ! సామాన్యుడికి ఏది లాభదాయకం?

రవాణా వ్యవస్థలో కేవలం ఇంధన మార్పు మాత్రమే కాకుండా, నాణ్యత, భద్రతకు కూడా పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బస్‌ల రిజిస్ట్రేన్ ప్రక్రియలో పారదర్శకత కోసం వాహన్ పోర్టల్‌లో ఫిజికల్, వీడియో వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న తయారీదారుల స్వీయ ధ్రువీకరణ పద్ధతిని ఇది భర్తీ చేస్తుంది. 

భద్రతపై దృష్టి పెట్లాలని సూచన

తయారీదారులు కేవలం ఖర్చు తగ్గిచండంపైనే కాకుండా, ప్రయాణికుల భద్రత, నాణ్యత, సౌకర్యంపై దృష్టి పెట్టాలని గడ్కరీ పిలుపునిచ్చారు. రాబోయే మూడేళ్లలో సుమారు 1,50,000 ఎలక్ట్రిక్ బస్‌లకుడిమాండ్ ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుతం మన దేశ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 70వేల బస్‌లుగా మాత్రమే ఉంది. ఈ అంతరాన్ని భర్తీ చేస్తూ ఉత్పత్తిని పెంచాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని ఆయన స్పష్టం చేశారు. 

Also Read: ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV

బస్‌వరల్డ్ ఇండియా కాన్‌క్లేవ్‌ 2026 వేదికగా జరిగిన సమావేశం భారత్ రవాణా రంగం భవిష్యత్‌ను ప్రతిబింబిస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించడమే కాకుండా కాలుష్యరహిత నగరాలను నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.     

         

Frequently Asked Questions

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు ఉందా?

దీర్ఘకాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యం, దిగుమతులపై ఆధారపడటం దీనికి కారణాలు.

భారత్ ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల వైపు ఎందుకు వెళుతోంది?

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోలియం దిగుమతుల కోసం వెచ్చించే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసమే ఈ మార్పు. బయోఫ్యూయల్స్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

భవిష్యత్ ఇంధనంగా దేన్ని పేర్కొన్నారు?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైడ్రోజన్‌ను భవిష్యత్ ఇంధనంగా పేర్కొన్నారు. ప్రస్తుతం పది ప్రధాన మార్గాల్లో హైడ్రోజన్ ట్రక్కులు, బస్సులు నడుస్తున్నాయని తెలిపారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతుందా?

అవును, ఇథనాల్ వాడకాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్ లో పూర్తి స్థాయి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల అభివృద్ధిపై పరిశ్రమ దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Honda Upcoming Bikes:హోండా నుంచి టూవీల్స్ సునామీ! 151 కి.మి. రేంజ్ బైక్ నుంచి ఇ- క్లచ్‌ టెక్నాలజీతో రానున్న 10 మోడల్స్ ఇవే!
హోండా నుంచి టూవీల్స్ సునామీ! 151 కి.మి. రేంజ్ బైక్ నుంచి ఇ- క్లచ్‌ టెక్నాలజీతో రానున్న 10 మోడల్స్ ఇవే!
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
కియా సైరోస్ EV లాంచ్‌ - 526 km రేంజ్‌, ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, BaaS స్కీమ్‌తో తక్కువ రేటు!
కొత్త కియా సైరోస్ EV మన మార్కెట్‌లోకి వచ్చేసింది - కేవలం కేవలం రూ.8 లక్షలకే 526 km రేంజ్!
Advertisement

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget