అన్వేషించండి

Petrol Excise Duty: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇథనాల్ పెట్రోల్‌పై ఎక్సైజ్ టాక్స్ రద్దు, ధర ఎంత తగ్గుతుందంటే

Ethanol Petrol Excise Duty News: ఇథనాల్ మిశ్రమం కలిపి ఉండే పెట్రోల్ ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు తాజాగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్రం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రద్దు.
  • ముడిచమురు దిగుమతులు తగ్గించి, రూపాయి విలువ పెంచడమే లక్ష్యం.
  • ఈ నిర్ణయం ప్రజలకు, రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని అంచనా.
  • బీఐఎస్ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

Petrol Excise Duty News | కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని (Excise Duty) రద్దు చేసింది. అంటే ఇకపై 22 శాతం నుండి 30 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ విధించదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇథనాల్‌తో కూడిన చౌక పెట్రోల్‌కు డిమాండ్ పెరిగితే, సామాన్య ప్రజలతో పాటు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యం నుంచి ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఎంతగానో పెరుగుతోందని, ప్రస్తుతం ఇది బ్యారెల్‌కు 114 డాలర్లకు చేరుకుందని గమనించాలి. దీని ప్రభావం వల్ల దిగుమతి బిల్లు పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌లోకి ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, రూపాయి విలువను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఫోకస్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రకటనలతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏమిటి?
ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒక పరోక్ష పన్ను. ఇది దేశం లోపల తయారయ్యే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై విధిస్తారు. ఈ ఎక్సైజ్ డ్యూటీని ప్రత్యేకంగా మద్యం, పొగాకు, పెట్రోలియం వంటి ఉత్పత్తులపైనే విధిస్తారు.

Also Read: దేశంలో అత్యంత చవకైన MG Comet EVపై 80 వేలు డిస్కౌంట్.. ఫుల్ ఛార్జ్‌తో 230 KM రేంజ్‌

ఎక్సైజ్ డ్యూటీని తగ్గించేందుకు నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం ఇకనుంచి 22 శాతం, 25%, 27%, 30 శాతం (E22, E25, E27, E30) ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేశారు. అయితే ఈ నిర్ణయంలో ఉన్న ఏకైక నిబంధన ఏమిటంటే, ఈ ఇంధనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి ఉండాలి.

ఏ ఇంధనం చౌకైనది.. E85 లేదా E20?
భారత్2లో E20 అంటే 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను కేంద్రం ప్రోత్సహిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదొడుకుల మధ్య దేశంలో ఆర్థిక పరిస్థితిని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం E85 ఇంధనాన్ని కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. E85 ఇంధనంలో 85 శాతం ఇథనాల్, మిగతా 15 శాతం పెట్రోల్ ఉంటుంది. E85 ఇంధనం, E20 కంటే లీటరుకు రూ. 20 చౌకగా లభిస్తుంది. 

Also Read: Bike Reserve: రిజర్వ్‌ పడ్డాక మీ బైక్‌ ఎంత దూరం వెళ్తుంది.. దీనివల్ల ఇంజిన్‌‌కు నష్టమా ? 

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఒకనొక దశలో ముడి చమురు ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. సీజ్ ఫైర్ ప్రకటించిన తరువాత సైతం అమెరికా, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌తో మళ్లీ గిల్లిగజ్జాలు మొదలుపెట్టడంతో ప్రతీకార దాడులు చేస్తోంది. హర్మూజ్ జలసంధి మూసివేత, నౌకల రాకపోకలకు ఇరాన్ అంతరాయం కలిగించడంతో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోవడం పలు దేశాలపై ప్రతికూలా ప్రభావం చూపుతున్నాయి. 

Frequently Asked Questions

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం 22% నుండి 30% ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేసింది. దీనివల్ల ఈ పెట్రోల్ చౌకగా లభిస్తుంది.

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రద్దు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

దీనివల్ల సామాన్య ప్రజలకు చౌక పెట్రోల్ లభిస్తుంది, రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దేశం ముడి చమురు దిగుమతులను తగ్గించి, రూపాయి విలువను మెరుగుపరచుకోవచ్చు.

ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏమిటి?

ఇది దేశం లోపల తయారయ్యే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై విధించే పరోక్ష పన్ను. మద్యం, పొగాకు, పెట్రోలియం వంటి ఉత్పత్తులపై ప్రత్యేకంగా విధిస్తారు.

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రద్దుకు ఉన్న నిబంధనలు ఏమిటి?

22% నుండి 30% ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌పై మాత్రమే రద్దు వర్తిస్తుంది. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ఛార్జ్‌పై 683 కిలోమీటర్ల రేంజ్ కారు కొన్న స్టార్ హీరో.. Mahindra BE 6 సేఫ్టీలో ది బెస్ట్
ఫుల్ ఛార్జ్‌పై 683 కిలోమీటర్ల రేంజ్ కారు కొన్న స్టార్ హీరో.. Mahindra BE 6 సేఫ్టీలో ది బెస్ట్
మగవాళ్ల కంటే ఆడవాళ్లే బెస్ట్‌ డ్రైవర్లు - రాత్రి 9-10 గంటల మధ్య డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం!
ఇండియాలో మహిళలే బెస్ట్ డ్రైవర్లు - రోజు మొత్తంలో ఆ ఒక్క గంటే అత్యంత డేంజర్!
2026 మారుతి బ్రెజ్జా రెడీగా ఉంది - కొత్త టర్బో ఇంజిన్, ADAS, వెంటిలేటెడ్ సీట్లతో అదిరిపోయే ఎంట్రీ!
లాంచ్‌కు ముందే 2026 మారుతి బ్రెజ్జా సీక్రెట్స్ అన్నీ లీక్ - టర్బో ఇంజిన్‌తో భారీ అప్‌డేట్!
కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
Advertisement

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Supreme Court: వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
వీడియోలు చూసే తీరిక లేదు, మా టైమ్ వేస్ట్ చేయవద్దన్న సుప్రీంకోర్టు.. సీజేఐ వ్యాఖ్యలపై సీజేపీ ఆగ్రహం
YS Jagan Mohan Reddy: ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
ప్రభుత్వ చేతకానితనం వల్లే పొగాకు రేట్ల పతనం - ప.గో జిల్లాలో ఆందోళనలు - జగన్ నిర్ణయం
Breaking News: కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రాహుల్ గాంధీ
Telangana ACB Raids: తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
తెలంగాణ రెడ్కో డీఈ నివాసం, బంధువుల ఇళ్లల్లో ఏసీబీ తనిఖీలు.. భారీగా ఆస్తులు గుర్తింపు!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Family Stars Season 2: వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
వదిలేయమంటూ సుధీర్ కాళ్ళ మీద పడ్డ అషురెడ్డి... ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌పై సెటైర్లు... సీరత్ పంచ్‌లు
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Embed widget