అన్వేషించండి

Petrol Excise Duty: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఇథనాల్ పెట్రోల్‌పై ఎక్సైజ్ టాక్స్ రద్దు, ధర ఎంత తగ్గుతుందంటే

Ethanol Petrol Excise Duty News: ఇథనాల్ మిశ్రమం కలిపి ఉండే పెట్రోల్ ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు తాజాగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్రం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రద్దు.
  • ముడిచమురు దిగుమతులు తగ్గించి, రూపాయి విలువ పెంచడమే లక్ష్యం.
  • ఈ నిర్ణయం ప్రజలకు, రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని అంచనా.
  • బీఐఎస్ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

Petrol Excise Duty News | కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై విధించే ఎక్సైజ్ డ్యూటీని (Excise Duty) రద్దు చేసింది. అంటే ఇకపై 22 శాతం నుండి 30 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ విధించదు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇథనాల్‌తో కూడిన చౌక పెట్రోల్‌కు డిమాండ్ పెరిగితే, సామాన్య ప్రజలతో పాటు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. ప్రధానంగా చెరకు, మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యం నుంచి ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఎంతగానో పెరుగుతోందని, ప్రస్తుతం ఇది బ్యారెల్‌కు 114 డాలర్లకు చేరుకుందని గమనించాలి. దీని ప్రభావం వల్ల దిగుమతి బిల్లు పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌లోకి ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి, రూపాయి విలువను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధనాలపై ఫోకస్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రకటనలతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏమిటి?
ఎక్సైజ్ డ్యూటీ అనేది ఒక పరోక్ష పన్ను. ఇది దేశం లోపల తయారయ్యే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై విధిస్తారు. ఈ ఎక్సైజ్ డ్యూటీని ప్రత్యేకంగా మద్యం, పొగాకు, పెట్రోలియం వంటి ఉత్పత్తులపైనే విధిస్తారు.

Also Read: దేశంలో అత్యంత చవకైన MG Comet EVపై 80 వేలు డిస్కౌంట్.. ఫుల్ ఛార్జ్‌తో 230 KM రేంజ్‌

ఎక్సైజ్ డ్యూటీని తగ్గించేందుకు నిబంధనలు
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం ఇకనుంచి 22 శాతం, 25%, 27%, 30 శాతం (E22, E25, E27, E30) ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేశారు. అయితే ఈ నిర్ణయంలో ఉన్న ఏకైక నిబంధన ఏమిటంటే, ఈ ఇంధనం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసి ఉండాలి.

ఏ ఇంధనం చౌకైనది.. E85 లేదా E20?
భారత్2లో E20 అంటే 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను కేంద్రం ప్రోత్సహిస్తోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ఒడిదొడుకుల మధ్య దేశంలో ఆర్థిక పరిస్థితిని సురక్షితంగా ఉంచడానికి కేంద్రం E85 ఇంధనాన్ని కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. E85 ఇంధనంలో 85 శాతం ఇథనాల్, మిగతా 15 శాతం పెట్రోల్ ఉంటుంది. E85 ఇంధనం, E20 కంటే లీటరుకు రూ. 20 చౌకగా లభిస్తుంది. 

Also Read: Bike Reserve: రిజర్వ్‌ పడ్డాక మీ బైక్‌ ఎంత దూరం వెళ్తుంది.. దీనివల్ల ఇంజిన్‌‌కు నష్టమా ? 

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో ఒకనొక దశలో ముడి చమురు ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. సీజ్ ఫైర్ ప్రకటించిన తరువాత సైతం అమెరికా, ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌తో మళ్లీ గిల్లిగజ్జాలు మొదలుపెట్టడంతో ప్రతీకార దాడులు చేస్తోంది. హర్మూజ్ జలసంధి మూసివేత, నౌకల రాకపోకలకు ఇరాన్ అంతరాయం కలిగించడంతో ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోవడం పలు దేశాలపై ప్రతికూలా ప్రభావం చూపుతున్నాయి. 

Frequently Asked Questions

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి?

కేంద్ర ప్రభుత్వం 22% నుండి 30% ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేసింది. దీనివల్ల ఈ పెట్రోల్ చౌకగా లభిస్తుంది.

ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రద్దు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

దీనివల్ల సామాన్య ప్రజలకు చౌక పెట్రోల్ లభిస్తుంది, రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దేశం ముడి చమురు దిగుమతులను తగ్గించి, రూపాయి విలువను మెరుగుపరచుకోవచ్చు.

ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏమిటి?

ఇది దేశం లోపల తయారయ్యే లేదా ఉత్పత్తి చేసే వస్తువులపై విధించే పరోక్ష పన్ను. మద్యం, పొగాకు, పెట్రోలియం వంటి ఉత్పత్తులపై ప్రత్యేకంగా విధిస్తారు.

ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రద్దుకు ఉన్న నిబంధనలు ఏమిటి?

22% నుండి 30% ఇథనాల్ మిశ్రమం కలిగిన పెట్రోల్‌పై మాత్రమే రద్దు వర్తిస్తుంది. ఇది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

టైర్‌పై ఈ అక్షరాన్ని నిర్లక్ష్యం చేస్తే భారీ ప్రమాదమే!, దాని అర్థం తెలుసా - బీమా క్లెయిమ్ కూడా రాకపోవచ్చు!
టైరుపై ఉండే ఒక్క అక్షరమే మీ ప్రాణాలను కాపాడుతుంది - మీ కార్‌ టైర్‌ను ఎప్పుడైనా పరిశీలించారా?
ప్రతి ఎత్తైన కారూ SUV కాదు - 'క్రాస్‌ఓవర్'కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాల్సిందే
SUV కాదు, 'క్రాస్‌ఓవర్' అని పిలిచే సమయం వచ్చింది - కార్ల మార్కెట్‌లో కొత్త మాట
పవర్‌ఫుల్‌ 349cc ఇంజిన్‌తో కొత్త బజాజ్ డొమినార్ 400 - జంటగా దేశమంతా చుట్టి రావచ్చు!
రూ.2.04 లక్షలకే కళ్లు చెదిరే టూరింగ్ బైక్ - ఈజీగా 120km స్పీడ్‌, కొత్త బజాజ్ డొమినార్ 400 రివ్యూ
రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2026 - న్యూ డిజైన్, పెద్ద టచ్‌స్క్రీన్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ధర తక్కువ!
దేశంలోనే చవకైన కారుకు కొత్త లుక్‌ - అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, డాసియా స్ప్రింగ్ స్టైల్‌తో గ్రాండ్ ఎంట్రీ
Advertisement

వీడియోలు

IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
India vs Ireland 2nd T20 Series decider | ఇండియా కంబ్యాక్ ఇస్తుందా?
Abhishek Sharma’s 50 Cancelled Ind vs Ire | అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ రద్దు
Ronaldo's Special Gold Scorpion Shoes | రొనాల్డో సరికొత్త గోల్డ్ స్కార్పియన్ షూస్
Ashwin About Vaibhav Bench Controversy | వైభవ్ ను క్కనపెట్టడంపై అశ్విన్ కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
బోడుప్పల్‌లో గృహప్రవేశ వేడుకలో హింస.. కుటుంబంపై 50 మంది మూకుమ్మడి దాడితో ఉద్రిక్తత
Coffee Sugar Scrub : కాఫీ, పంచదారతో బాడీ స్క్రబ్.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారాలంటే ఇలా చేయండి
కాఫీ, పంచదారతో బాడీ స్క్రబ్.. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారాలంటే ఇలా చేయండి
Amaravati Tension: అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో రౌడీషీటర్లు.. 3 కేసులు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు
Idupu Kayitham Controversy : టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
టైటిల్ మార్చే ప్రసక్తే లేదు - ఇడుపు కాయితం కాంట్రవర్సీపై బన్నీ వాస్ రియాక్షన్
Embed widget