అన్వేషించండి

ఏపీలో ఇవాల్టి అప్‌డేట్స్‌ ఇవే

తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది.. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం సేవ అనంతరం నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు


కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్‌ సిద్ధమవుతోంది. దేవాలయాలు, చర్చిల్లో ప్రత్యేక దర్శనాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ, వైజాగ్ లాంటి నగరాల్లో పార్టీల కోసం వివిధ సంస్థలు ఏర్పాట్లు చేసుకున్నాయి. 

కొత్త ఏడాది వేడుకల సందర్భంగా విజయవాడలో పోలీసుల ఆంక్షలు||
అర్ధరాత్రి బహిరంగ వేడుకలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. విజయవాడలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమలులో ఉంది. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి సమయంలో ఆంక్షలు తప్పనిసరి చేసింది ప్రభుత్వం. బందర్ రోడ్, ఏలూరు రోడ్, BRTS రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. బెంజ్ సర్కిల్, కనకదుర్గ, పీసీఆర్ పైవంతెనలపైకి వాహనాలకు అనుమతించడం లేదు. క్లబ్బులు, రెస్టారెంట్లలో వేడుకలకు పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ శబ్దాలు వచ్చే సౌండ్ సిస్టం వాడకూడదన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్లపై గుంపులుగా వచ్చి కేకులు కట్ చేసి అల్లరి చేస్తే కఠిన చర్యల తప్పవని వార్నింగ్ ఇచ్చారు. బైక్‍లకు సైలెన్సర్ తీసేసి అధిక శబ్దాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

విజయవాడలో సీఐ కానిస్టేబుల్ సస్పెన్షన్|| 
విజయవాడ ఐదవ టౌన్ ట్రాఫిక్ స్టేషన్ సీఐ రవికుమార్, కానిస్టేబుల్ రాంబాబును సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ క్రాంతి రతన్ టాటా ఉత్తర్వులు జారీ చేశారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తి చంద్ర చూడ్ విజయవాడ పర్యటనలో ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా లేకపోవడం డిజిపి పరిశీలించి, సిపికి సమాచారం ఇవ్వడంతో.. విధి నిర్వహణ లో నిర్లక్ష్యంగా ఉన్నందుకు సస్పెండ్ చేశారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది.. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతం సేవ అనంతరం నువ్వుల గింజలతో ప్రసాదంను నివేదిస్తారు అర్చకులు.. శుక్రవారం రోజున 63,253 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 24,490 మంది తలనీలాలు సమర్పించగా, 5.16 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 24 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు.. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు దాదాపు 18 గంటలకు పైగా సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది.. 

సంక్రాంతికి మరో 16 ప్రత్యేక రైళ్లు.

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా పలు ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అధికంగా రద్దీ ఉండే రోజుల్లో ప్రత్యేక రైళ్లు బయలుదేరేలా ఏర్పాట్లు చేశారు. జనవరి 7 నుంచి 18 వరకు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నడవనున్నాయి. హైదరాబాద్ నుంచి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. రైళ్ల పూర్తి వివరాలు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. రేపు ఉదయం 8గంటల నుంచి ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CBG Plant In Prakasam: రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
KCR Met BRS Leaders: ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
Shalini Pandey: 'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?
'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Digvesh Rathi Notebook Celebrations Priyansh Arya | ప్రియాంశ్ ఆర్య కొహ్లీలా రివేంజ్ తీర్చుకుంటాడా | ABP DesamRCB vs GT Match preview IPL 2025 | నేడు గుజరాత్ టైటాన్స్ తో ఆర్సీబీ మ్యాచ్ | ABP DesamShreyas Iyer Mass Comeback | IPL 2025 లోనూ తన జోరు చూపిస్తున్న శ్రేయస్ అయ్యర్ | ABP DesamRishabh Pant Poor form 27Cr Auction price | IPL 2025 లో ఘోరంగా విఫలమవుతున్న పంత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBG Plant In Prakasam: రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన- రూ.65వేల కోట్ల పెట్టుబడులు, 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
KCR Met BRS Leaders: ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
ఎర్రవల్లి ఫాం హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కేసీఆర్ సమావేశం, వరంగల్ సభపై దిశానిర్దేశం
Waqf Amendment Bill: వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
వక్ఫ్ సవరణ బిల్లును ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు రెడీ, కేంద్ర విభజన అజెండాను అడ్డుకుంటామన్న కాంగ్రెస్
Shalini Pandey: 'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?
'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?
Stalin Letter To PM Modi: డీలిమిటేషన్ వివాదం, ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
డీలిమిటేషన్ వివాదం, ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
Save HCU: 'అందరూ గొంతు కలపండి' - HCU కి మద్దతుగా రష్మీ గౌతమ్
'అందరూ గొంతు కలపండి' - HCU కి మద్దతుగా రష్మీ గౌతమ్
Nani: నన్ను అపార్థం చేసుకున్నారు... 'ప్యారడైజ్' మ్యాడ్ మ్యాక్స్ స్టేట్మెంట్‌పై నాని రియాక్షన్
నన్ను అపార్థం చేసుకున్నారు... 'ప్యారడైజ్' మ్యాడ్ మ్యాక్స్ స్టేట్మెంట్‌పై నాని రియాక్షన్
Waqf Amendment Bill: నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్,  ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
నేడు పార్లమెంట్‌ ముందుకు వక్ఫ్ సవరణ బిల్, ప్రభుత్వం పాస్ చేయగలదా ? సంఖ్యాబలం ఎలా ఉంది?
Embed widget