అన్వేషించండి

Ram Navami 2025 Date Muhurta Rituals: ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ప్రతి రోజూ చేయాల్సిన పారాయణం ఇది!

ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులు...ఈ 9 రోజులు ప్రతి ఇంట్లోనూ పారాయణం చేస్తారు. మొదటి రోజు చేయాల్సిన పారాయణం ఇది..

Ram Navami 2025 Date and 9 Days Ramayana parayana: ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మొదటి రోజు చేయాల్సిన పారాయణ...

శ్రీరాఘ‌వం ద‌శ‌ర‌థాత్మ‌జ మ‌ప్ర‌మేయం 
సీతాప‌తిం ర‌ఘుకులాన్వ‌య ర‌త్న‌దీపం
ఆజానుభాహుం అర‌వింద ద‌ళాయ‌తాక్షం
రామం నిశాచ‌ర వినాశ‌క‌రం న‌మామి
   
శ్రీ‌మ‌ద్ రామాయ‌ణం ఆదికావ్యం

వాల్మీకి మ‌హ‌ర్షి ఒక‌రోజు త‌మ‌సా న‌దికి స్నానమాచరించేందుకు వెళ్లారు. అక్క‌డ ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మ‌మీద  ఆనంద‌సాగ‌రంలో ఉన్న ఓ ప‌క్షుల జంట‌లో మ‌గ‌ప‌క్షిపై కిరాతుడు బాణం వేశాడు. అది విల‌విలకొట్టుకుంటూ నేల‌రాలింది.  ఆ మ‌గ‌ప‌క్షి చుట్టూ తిరుగుతూ  ఆడ‌ప‌క్షి విలపించడం చూసి వాల్మీకి మహర్షి మనసు ద్రవించింది.  ఆ సమయంలో ఆయన హృదయంలో శోకమే ఈ శ్లోకం

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్| |

ఓ కిరాతకుడా క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయుండగా ఓ పక్షిని చంపావు. నువ్వు ఎక్కువకాలం జీవించవు అని శపించారు. ఆ క్షణంలో ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు..నీ నోట కవిత్వ వచ్చింది. నువ్వు రామాయణ మహాకావ్యాన్ని రచించి మానవాళిని తరింపజేయి అని సూచించి వెళ్లిపోయాడు.  

అలా మొదలైంది రామాయణ కావ్య రచన

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
 
బాల‌కాండ

అయోధ్యలో శ్రీ రామ ల‌క్ష్మ‌ణ భ‌ర‌త శ‌తృఘ్నులు ధ‌నుర్ విద్య‌లో ప్రావీణ్యం పొందారు.మ‌హ‌ర్షుల యాగాల‌కు ఆటంకం క‌లిగిస్తున్న రాక్ష‌సుల‌ను అంతం చేయ‌డానికి ద‌శ‌ర‌థ‌మ‌హారాజు సహాయం కోరారు విశ్వామిత్రుడు. స‌క‌ల మ‌ర్యాద‌ల‌తో విశ్వామిత్ర మ‌హ‌ర్షికి  స్వాగ‌తం ప‌లికిన దశరథుడికి తాను వచ్చిన పని వివరించాడు. మారీచ సుబాహువుల‌నే రాక్ష‌సులు య‌జ్ఞ‌యాగాల‌కు ఆటంకం క‌లిగిస్తున్నారు..వారిని శ‌పించ‌వ‌చ్చు కానీ, యజ్ఞ క్ర‌తువులో నిమ‌గ్న‌మైన‌పుడు కోపం ద‌రిచేర‌కూడ‌దు..అందుకే  ఇలాంటి ప‌రిస్థితుల‌లో యాగ‌రక్ష‌ణ జ‌ర‌గాలంటే శ్రీ‌రాముడిని త‌నతో పంపాల‌ని కోరాడు. లేక లేక క‌లిగిన సంతానాన్ని ఇలా రాక్ష‌స సంహారానికి పంపాలా అని బాధ‌ప‌డ్డాడు. రాముడి  బ‌దులు తాను వ‌స్తాన‌న్నాడు కానీ ఇది రాజధర్మమా మాటతప్పుతావా అని ప్రశ్నించాడు విశ్వామిత్రుడు. వ‌శిష్ఠ మహర్షి సూచన మేరకు విశ్వామిత్రుడి వెంట రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను పంప‌డానికి నిర్ణ‌యించాడు దశరథుడు.
త‌న‌ను అనుస‌రించి వచ్చిన  రామ‌ల‌క్ష్మ‌ణుల‌కు   స‌రయూ న‌దీతీరంలో - ఆక‌లి, ద‌ప్పిక‌లు లేకుండా బ‌ల , అతి బ‌ల అనే విద్య‌లు  నేర్పించాడు ‌ను విశ్వామిత్రుడు. అంటే ఆకలి దప్పులు దరిచేరని విద్య అది. 

ఆ రాత్రి వారు అక్క‌డే సేదతీరాలు...తెలవారుతుండగా  కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే  ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అని స్తుతిస్తూ మేల్కొలిపాడు విశ్వామిత్రుడు.  పురుషోత్తమా తెల్లవారుతోంది, దైవ సంబంధాలైన కార్య‌క్ర‌మాలు  చేయవలసి ఉంది లెమ్ము అని అర్థం. 
మ‌హ‌ర్షి మేల్కొలుపుతో లేచి, సంధ్యావంద‌నం ముగించుకుని వారు అక్క‌డి నుంచి బ‌య‌లుదేరారు. అలా న‌డుచుకుంటూ వారు మ‌హార‌ణ్యంలో ఓ జనపదం చేరగానే అక్కడ తాటకిని చూశారు. అగ‌స్త్యుని ఆశ్ర‌మ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ జ‌నాన్ని తింటూ బతుకుతున్న తాటకికి వెయ్యి ఏనుగుల బ‌లం ఉంటుంద‌ని చెప్పాడు. స్త్రీ క‌దా చంప‌డం ఎలా అనే సంకోచం లేకుండా దుష్టశక్తిని హరింపజేయమని కోరాడు విశ్వామిత్రుడు. తాటకి సంహారం అనంతరం విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలు ప్రసాదించాడు. దండ‌చ‌క్ర‌, ధ‌ర్మ‌చ‌క్ర‌, కాల‌చ‌క్ర‌, విష్ణు చ‌క్ర‌,బ్ర‌హ్మాస్త్ర‌, కాల‌పాశ‌,ధ‌ర్మ‌పాశ‌, వ‌రుణ‌పాశ‌, ఆగ్నేయాస్త్రం, వాయ‌వ్యాస్త్రం ఇలా స‌మ‌స్త్ర అస్త్రాలు అందించాడు.

తాట‌కి వ‌ధ‌ అనంతరం విశ్వామిత్ర మ‌హ‌ర్షి యాగం చేస్తున్న సిద్ధాశ్ర‌మానికి  చేరుకున్నారు. అక్క‌డ విశ్వామిత్ర మ‌హ‌ర్షి యాగం మొద‌లు పెట్టగానే రాక్ష‌సులు మారీచ సుబాహువుల అనుచ‌ర‌గ‌ణం అక్క‌డ‌కు చేరుకుంది. రాముడు బాణాల వ‌ర్షం కురిపించి  హ‌త‌మార్చాడు.  ఆ తర్వాత రాక్షసులు ఎవ‌రూ అటువైపు క‌న్నెత్తి చూడ‌లేదు. యాగం నిర్విఘ్నంగా సాగింది. ఆ త‌ర్వాత  అక్క‌డ నుంచి మిథిలా న‌గ‌రానికి బ‌య‌లుదేరారు. మార్గ‌మ‌ధ్యంలో వారు గౌత‌మ మ‌హ‌ర్షి ఆశ్ర‌మం చేరుకుని అక్క‌డ అహ‌ల్య శాప గాథ‌ను విశ్వామిత్రుడు రాముడికి తెలిపాడు.  పూర్వరూపంతో కనిపించిన అహల్యకు  న‌మ‌స్క‌రించి ముందుకు సాగారు. 

మిథిలా న‌గ‌రంలో సీతా స్వ‌యంవ‌రం వార్త తెలుసుకుని విశ్వామిత్ర మ‌హ‌ర్షి రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను మిథిల‌కు తీసుకువెళ్లాడు. శివ‌ధ‌న‌స్సును విరిచి సీతమ్మ‌ స్వ‌యంవ‌రంలో విజేతగా నిలిచాడు రాముడు. ద‌శ‌ర‌థుడికి క‌బురుపంపి సీతారామ క‌ల్యాణానికి ఏర్పాట్లు చేశారు. ల‌క్ష్మ‌ణ భ‌ర‌త‌శ‌త్రుఘ్నుల‌కూ వివాహాలు జ‌రిపించారు. ద‌శ‌ర‌థుడు కొడుకులు, కోడ‌ళ్ల‌తో అయోధ్య‌కు బ‌య‌లుదేరాడు. మార్గ మ‌ధ్యంలో ప‌ర‌శురాముడు ఎదురై శివ‌ధ‌నుస్సు విరిచినందుకు  ఆగ్ర‌హించాడు. త‌న ద‌గ్గ‌ర  ధ‌నుస్సు తీసుకుని బాణం ఎక్కుపెట్ట‌మ‌ని రాముడికి సవాలు విసిరాడు. రాముడు బాణం సంధించి వ‌దిలిన బాణం ల‌క్ష్యాన్ని ఛేధించ‌క త‌ప్ప‌దు. రాముడి శ‌క్తి సామ‌ర్ధ్యాల‌ను కీర్తించి ప‌ర‌శురాముడు అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

 

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Advertisement

వీడియోలు

Pawan Kalyan Konaseema Controversy | కోనసీమ..కొబ్బరిచెట్టు...ఓ దిష్టి కథ | ABP Desam
SP Balasubrahmanyam Statue Controversy | బాలు విగ్రహం చుట్టూ పెద్ద వివాదం | ABP Desam
విరాట్ కోహ్లీ రాణిస్తే సిరీస్ మనదే..!
వద్దనుకున్నోళ్లే దిక్కయ్యారు.. రోహిత్, విరాట్ లేకపోతే సఫారీలతో ఓడిపోయేవాళ్లం: కైఫ్
2027 వన్డే వరల్డ్ కప్ టార్గెట్‌గా కంబ్యాక్‌కి కోహ్లీ రెడీ!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet Lands Auction: మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
మూడో వేలంలో రికార్డులు దాటని కోకాపేట ధరలు - కానీ తక్కువేం కాదు - ఇవిగో డీటైల్స్
Telangana Ponguleti: వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
వట్టినాగులపల్లిలో పొంగులేటి కుమారుడి భూకబ్జా దౌర్జన్యం - బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు
Sharmila criticized Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు -  ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
పవన్ కల్యాణ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు - ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్
India vs South Africa 2nd ODI: రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
రాయ్‌పూర్‌లో శతక్కొట్టిన కోహ్లీ,రుతురాజ్- ఫస్ట్‌ ODI సెంచరీ చేసిన గైక్వాడ్
Prabhas Spirit Update: ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
ఛాయ్ బిస్కెట్‌తో హీరోయిన్ తృప్తి హింట్... కోఠిలో ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్!
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Modi AI video controversy:  మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
మోదీ టీ అమ్ముతున్నట్లుగా కాంగ్రెస్ ఏఐ వీడియో -బీజేపీ తీవ్ర ఆగ్రహం
Embed widget