అన్వేషించండి

White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?

 నాలుగు ఘటనలు...నాలుగు వేర్వేరు ప్రాంతాలు..జరిగనవన్నీ వేరేనే. కానీ కామన్ పాయింట్ ఒకటి ఉంది. అదే డాక్టర్స్. దేశంలో అలజడులు సృష్టించటానికి ప్రయత్నిస్తున్న ఉగ్రముఠాలు ఆపరేషన్ సిందూర్ తర్వాత వైట్ కాలర్ క్రైమ్ కి దిగుతున్నాయా. సొసైటీలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్నవారిపై ఉండే రెస్పెక్ట్ ను వాడుకుంటూ యావత్ భారతావనిని భయపెట్టాలని ప్లాన్ చేస్తున్నాయా..గడిచిన రెండు రోజులుగా జరిగిన ఈ నాలుగు ఘటనలు అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు పోలీసులను ఇదే ఆలోచనలో పడేస్తోంది. అసలేంటీ ఆ నాలుగు ఘటనలు...వైద్య వృత్తిని అడ్డం పెట్టుకుని ప్లాన్ చేస్తున్న నరమేధానికి ఇవన్నీ సంకేతాలా ఈ వీడియోలో చూద్దాం. 


Scene 1 – Faridabad, Haryana
  Date : November 10, 2025

ఫరీదాబాద్ లోని దాహూజ్ అండ్ ఫతేపూర్ టాగా ప్రాంతాలను పోలీసులు చుట్టుముట్టారు. దేశంలో అతిపెద్ద కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్ లో ఒకటిగా భావిస్తున్న ఓ ఆపరేషన్ ను పోలీసులు సమర్థంగా నిర్వహించారు. జమ్ము కశ్మీర్ పోలీసులతో కలిసి ఫరీబాదాబ్ పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్ లో ఇద్దరు డాక్టర్లు డా. ముజామిల్ షకీల్, డా. ఆదిల్ అహ్మద్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరు డాక్టర్లది జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ ప్రాంతం. వారి నుంచి 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు ఏకే 47 తరహా రైఫిల్స్, పిస్టర్స్, బాంబ్ టైమర్స్ ఇతర పేలుడు పదార్థాలను మారణాయుధాలును స్వాధీనపరుచుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని సహరన్ పూర్ లో ఆదిల్ అహ్మద్ ను అరెస్ట్ చేయటంతో ఈ ఇద్దరు డాక్టర్ల ఉగ్రకుట్ర బయటపడింది. ఫలితంగా ఫరీదాబాద్ లీడ్ తెలిసింది.  భారీ మొత్తంలో పేలుడు పదార్థం స్వాధీనమైంది. 


Scene 2 – Lucknow, Uttar Pradesh
November 10, 2025

సీన్ జరిగింది లక్నోలో. డా. షహీన్ షాహిద్ పేరున్న ఓ లేడీ డాక్టర్ ను పోలీసులు లక్నోలో అరెస్ట్ చేశారు. ఆమెనుంచి ఏకే 47 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. అంతే కాదు కారులో చాలా క్యాట్రిడ్జ్ లు కూడా దొరికాయి. పోలీసులు చెప్పింది ఏంటంటే జమ్ము కశ్మీర్ నుంచి వచ్చి ఫరీదాబాద్ లో పేలుడు పదార్థాలతో దొరికిపోయిన ఇద్దరు డాక్టర్లకు ఈమెకు ఏదో లింక్ ఉంది అని. జమ్ము కశ్మీర్ డాక్టర్లను ఆపరేట్ చేస్తున్న సేమ్ నెట్ వర్కే ఈమెను కూడా ఆపరేట్ చేస్తోందని. కౌంటర్ టెర్రర్ ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. 

Scene 3 – Gujarat and Hyderabad
November 8, 2025

 గుజరాత్ కు  చెందిన ATS అధికారులకు ఉగ్ర కదలికలకు సంబంధించిన ఓ లీడ్ దొరికింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ ఇంకా మెహసానా ప్రాంతాలతో హైదరాబాద్ లో ఏకకాలంలో మెరుపు దాడులు చేశారు. హైదరాబాద్ కు చెందిన డా. అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనే డాక్టర్ పెద్ద మొత్తంలో రైసిన్ అనే ప్రమాదకరమైన రసాయనాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ డాక్టర్ చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని హైదరాబాద్ బేస్డ్ గా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏటీసీ సోదాల్లో విదేశీ తుపాకులు, రైసిన్ తయారీ కోసం పెద్ద మొత్తంలో సేకరించిన ఆముదాన్ని గుర్తించారు. ఈ రైసిన్ ప్రపంచంలోనే అత్యంత విషపూరిత పదార్థాల్లో ఒకటి. క్షణాల్లో ప్రాణాలు తీయగలిగే శక్తి దీనికి ఉంది. ఆ డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ ను అరెస్ట్ చేసి గుజరాత్ కు తీసుకువెళ్లారు ATS అధికారులు.


Scene 4 – Car Blast in Delhi
November 10, 2025
   ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు బ్లాస్ట్ అయ్యింది. చూస్తుండగానే 9 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మెట్రో స్టేషన్ కు అతి సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ లో జరిగిన ఈ పేలుడులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎర్రకోట సమీపంలోని ఓ మసీదు ప్రాంగణంలో పేలుడుకు గురైన కారు 3 గంటలు పాటు పార్క్ చేసి ఉంచినట్లు అధికారులు గుర్తించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 6.20 వరకూ కారును పార్కింగ్ లోనే ఉంచి ఆ తర్వాత బయటకు తీసుకు వస్తున్న వ్యక్తి విజువల్స్ ను సీసీటీవీ ఫుటేజెస్ లో పోలీసులు గుర్తించారు. కారు నడపుతున్న వ్యక్తిని డా.మహ్మద్ ఉమర్ గా అని తేల్చారు. పేలుడు జరిగిన ప్రాంతంలో అమ్మోనియం నైట్రేట్ ట్రేసెస్ ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్థారించారు. డిటోనేటర్లు కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. అంటే ఇది ఆత్మాహుతి దాడిలా జరిగిందా...ఫరీదాబాద్ లో పట్టుబడిన డాక్టర్ల గురించి వార్తలు బయటకు వచ్చిన తర్వాత ఎర్రకోట్ల దగ్గర బ్లాస్ట్ కు ప్లాన్ చేశారా...ఏదైనా ఉగ్ర సంస్థ మొత్తం డాక్టర్లతో ఈ ఆపరేటింగ్ నెట్ వర్క్ ను మెయింటైన్ చేస్తోందా..నిజమైతే వాళ్ల ప్లాన్ ఏంటీ..ఢిల్లీ బ్లాస్ట్ కోసమే ఇదంతా చేశారా లేదా మరేదైనా పెద్ద ప్లాన్ లో ఉన్నారా..దీనంతటి కోసం పవిత్రమైన వైద్యవృత్తిని ఎంచుకుని...ప్రాణాలు పోసే వైద్యులతోనే ప్రాణాలు తీయించే ప్లాన్ చేస్తున్నారా...సంచలన విషయాలు మరికొద్ది రోజుల్లోనే నిగ్గు తేలనున్నాయి.

న్యూస్ వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
Pithapuram Roads: పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురంలో రోడ్లకు మహర్దశ - 307 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం
Virat T20 Origin:  కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
కోహ్లీ ఫస్ట్ టి20 ఇన్నింగ్స్ ను చూసి ఫిదా అయిన ఆర్సీబీ స్కౌట్.. ఐపీఎల్ వేలంలో ఢిల్లీ మిస్టేక్ ను ఎన్ క్యాష్ చేసుకున్న ఆర్సీబీ మేనేజ్మెంట్!
Viral Video: వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన
వీడియో కాల్‌లోనే కడసారి చూపులు - క్షీణిస్తున్న మానవ సంబంధాలపై సజ్జనార్ ఆవేదన

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget