అన్వేషించండి

Komatireddy Venkatreddy : చండూరు సభలో పిల్లాడితో తిట్టించారు, పీసీసీపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్

Komatireddy Venkatreddy : మునుగోడు ఉపఎన్నిక సమావేశాలపై పీసీసీ నుంచి తనకు ఎటువంటి సమాచారం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పీసీసీ తీరుపై విమర్శలు చేశారు.

Komatireddy Venkatreddy : తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికపై పార్టీలు వ్యూహరచనలో ఉన్నాయి. పార్టీ కేడర్ తో వరస భేటీలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా స్పీడ్ పెంచింది. 'మన మునుగోడు-మన కాంగ్రెస్' నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ పెద్దలు విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనిపించడంలేదు. ఈ విషయంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. పీసీసీ తీరుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపఎన్నిక సమావేశాలు, కార్యక్రమాలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పిలవని పేరంటానికి తాను వెళ్లనన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

చిన్న పిల్లాడితో తిట్టించారు

మునుగోడు ఉపఎన్నిక గురించి తనతో ఎవరూ మాట్లాడట్లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చండూరులో కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఓ చిన్న పిల్లాడితో తనను తిట్టించారన్నారు. తమని అవమానించిన వారు క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సీనియర్‌ను తిట్టిన అతడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలన్నారు. రేపటి కాంగ్రెస్‌ పాదయాత్రకు తనకు ఆహ్వానం లేదన్నారు. తనను అవమానించిన తర్వాత  కూడా ఎలా వెళ్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. 

పాల్వాయి స్రవంతితో భేటీ 

మునుగోడు ఉపఎన్నికపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ అభ్యర్థిపై త్వరగా తేల్చే పనిలో నిమగ్నమైంది. ఆశావహులతో కాంగ్రెస్ పెద్దలు భేటీ అవుతున్నారు. పాల్వాయి స్రవంతితో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్ చౌదరి, నదీమ్‌ జావీద్‌లు గాంధీభవన్ లో భేటీ అయ్యారు. ఉపఎన్నికకు సంబంధించిన పలు అంశాలపై ఈ భేటీలో చర్చించారు. రెండ్రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ సమావేశాలు నిర్వహించారు. ఉపఎన్నికకు సంబంధించిన కార్యక్రమాలపై చర్చించారు. దుబ్బాక, హుజూరాబాద్‌ మాదిరిగా కాకుండా అభ్యర్థిని ముందుగా తేల్చాలనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో అభ్యర్థిపై కసరత్తు వేగవంతం చేశారు. 

మన మునుగోడు-మన కాంగ్రెస్ 

మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయ పార్టీలకు సెమీఫైనల్‌గా మారింది. అన్ని పార్టీలకూ ఈ ఎన్నిక కీలకమే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి కత్తి మీద సాములా మారింది. కాంగ్రెస్ కంచుకోట. బలమైన క్యాడర్ ఉన్న నియోజకవర్గం. ఇక్కడ గెలవకపోతే .. వచ్చే ఫైనల్స్‌లో పోటీలో ఉందని చెప్పుకోవడం కూడా కష్టమవుతుంది. అందుకే సిట్టింగ్ సీటును దక్కించుకునేందుకు కాంగ్రెస్ గ్రౌండ్ లెవల్ నుంచి వ్యూహరచన చేస్తోంది. " మన మునుగోడు - మన కాంగ్రెస్" నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది.  గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు మునుగోడులో ప్రచారం చేయాలని షెడ్యూల్ రూపొందిచుకుంటున్నారు. 

రాజగోపాల్ రెడ్డినే టార్గెట్ చేయాలని కాంగ్రెస్ వ్యూహం 

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు మునుగోడుకు క్యూ కట్టారు.  గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరల పెంపుపైనే ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రధానంగా బీజేపీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డినే టార్గెట్ గా చేస్తూ ప్రచారం చేయాలని నిర్ణయించారు. కులాలు, వృత్తుల వారీగా అనుబంధ సంఘాలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఇప్పటికే  చండూరులో ఓ సభను కాంగ్రెస్ నిర్వహించింది.  21వ తేదీన బీజేపీ చేరికల సభను నిర్వహిస్తోంది. టీఆర్ఎస్ కూడా మరో సభ నిర్వహిస్తోంది. ఈ రెండు సభల కంటే ధీటుగా ఆ తర్వాత మరో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. 

Also Read : Munugodu Congress : మన మునుగోడు - మన కాంగ్రెస్ ! ఉపఎన్నికల్లో అమల్లోకి రేవంత్ ప్లాన్

Also Read : "అప్పుల రూల్స్" తెలంగాణకు మాత్రమేనా ? కేంద్రం వివక్ష చూపిస్తోందా ? ఇవిగో డీటైల్స్

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget