By: ABP Desam | Updated at : 18 Jan 2022 06:37 PM (IST)
మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)
నారాయణపేట జిల్లా కోయిల్కొండలో నూతనంగా నిర్మించిన సామాజిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని మంత్రి హరీశ్ రావు ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మాస్క్ తప్పకుండా ధరించాలని కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయని హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు. ఏఎన్ఎం సబ్సెంటర్, పీహెచ్సీ, ప్రభుత్వ దవాఖానాకు ఎక్కడికి వెళ్లినా కొవిడ్ పరీక్షలు చేసేందుకు కిట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.
కరోనా.. ఎంతమందికి వచ్చినా.. మందులు ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. 2 కోట్ల కొవిడ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కోటి మందికి సరిపడా హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి, వ్యాధి లక్షణాలుంటే ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పరీక్ష చేయించుకుని ఇచ్చిన మందులను వారం రోజుల పాటు వాడితే తగ్గిపోతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు.
ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని హరీశ్ రావు హితవు పలికారు. ప్రజాప్రతినిధులు, అధికారులు 100శాతం వ్యాక్సిన్ అందించే విధంగా కృషి చేయాలన్నారు. వారం రోజుల్లో నారాయణపేటకు డయాలసిస్ కేంద్రం మంజూరు చేస్తామని తెలిపారు. నారాయణపేటలో రూ.66 కోట్లతో 300 పడకల ఆసుపత్రి నిర్మించబోతున్నట్టు.. ఫిబ్రవరిలో శంకుస్థాపన ఉంటుందని వెల్లడించారు.
మరోవైపు... వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంపై మంత్రి హరీశ్ రావు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. వ్యాక్సిన్ రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 9 నెలల నుంచి 6 నెలలకు కుదించాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు. అలాగే వైద్య ఆరోగ్య సిబ్బందికి రెండో డోసు, ప్రికాషనరి డోసు మధ్య గడువు 3 నెలలకు తగ్గించాలని హరీశ్ రావు కేంద్ర మంత్రిని కోరారు. అలాగే, 60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ (కోమార్బిడిటీస్తో సంబంధం లేకుండా) ప్రికాషనరి డోసు ఇవ్వాలని సూచించారు.
18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి బూస్టర్ డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హరీశ్ రావు కోరారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో అమలు చేస్తున్న బూస్టర్ డోసు విధానాలు, వాటి ద్వారా వస్తున్న ఫలితాల ఆధారంగా తాను ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా హరీశ్ రావు లేఖలో వివరించారు.
Also Read: Corona Updates: పోలీస్ శాఖపై కరోనా పంజా... హైదరాబాద్ పరిధిలోని పలు పీఎస్ లలో భారీగా కేసులు...
KTR UK Tour: లండన్లోని కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం
Breaking News Live Updates : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విజేతగా భారత్
Telangana: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల బదిలీ - ఎవరికి ఏ శాఖ అప్పగించారంటే !
Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్
Telangana CM KCR చిల్లర బుద్దిని చూడలేకే ఆ నిధులపై కేంద్రం రూట్ మార్చింది: బండి సంజయ్
Chandrababu Kurnool Tour: భూలోకంలో ఎక్కడ దాక్కున్నా లాక్కొచ్చి లోపలేయిస్తా: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
RCB Vs GT: కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన హార్దిక్ - ప్లేఆఫ్స్కు చేరాలంటే బెంగళూరు కష్టపడాల్సిందే!
NTR30: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Moto G71s 5G: రూ.20 వేలలోపే మోటొరోలా కొత్త 5జీ ఫోన్ - సూపర్ ఫీచర్లు కూడా - ఎలా ఉందో చూశారా?