అన్వేషించండి

KTR: తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పు - చార్మినార్ వద్ద కేటీఆర్, బీఆర్ఎస్ నేతల నిరసన, రాజకీయ కక్షతోనే చేస్తున్నారంటూ ఆందోళన

KTR Charminar Visit: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు రాజకీయ కాక రేపుతోంది. చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

BRS Vs Congress: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు ప్రతిపాదన దృష్ట్యా.. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు గురువారం ఉదయం చార్మినార్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఇతర పార్టీ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చార్మినార్ వద్ద నిరసనకు దిగారు. అటు, కాకతీయ కళాతోరణం వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. భాగ్యనగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.
KTR: తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పు - చార్మినార్ వద్ద కేటీఆర్, బీఆర్ఎస్ నేతల నిరసన, రాజకీయ కక్షతోనే చేస్తున్నారంటూ ఆందోళన
KTR: తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పు - చార్మినార్ వద్ద కేటీఆర్, బీఆర్ఎస్ నేతల నిరసన, రాజకీయ కక్షతోనే చేస్తున్నారంటూ ఆందోళన

'మూర్ఖపు నిర్ణయాలు'

ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని.. పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 'కేసీఆర్ పేరు వినిపించకుండా ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయ కక్షతోనే అధికారిక చిహ్నం మార్పు చేస్తోంది. చార్మినార్ ను రాష్ట్రం చిహ్నంలో తొలగించడం హైదరాబాదీలను విస్మరించడమే. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేరిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మార్చడం మూర్ఖపు నిర్ణయమే. చార్మినార్ హైదరాబాద్ ఐకాన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనలేదు. కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాలని చూస్తున్నారు. లోగో మార్పుపై బీఆర్ఎస్ తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతాం. అమరవీరుల స్థూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన వారి తల్లిదండ్రులు సంతోషపడరు. అధికారిక చిహ్నం మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

చిహ్నం ఆవిష్కరణ వాయిదా

మరోవైపు, తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. పలు డిజైన్లు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేయాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ 2న కేవలం తెలంగాణ గేయాన్ని మాత్రమే ఆవిష్కరించే అవకాశం ఉంది.  ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా చిహ్నం రూపొందించాలని రేవంత్ భావిస్తున్నారు.  ఇందులో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తారని స్పష్టమయింది. అయితే, దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. అవి తొలగించాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం చార్మినార్ వద్ద కేటీఆర్ సహా, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.

Also Read: Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ సంచలన వాంగ్మూలం, ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఆ పని చేశారట!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్

వీడియోలు

BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్
Yashasvi Jaiswal about Rohit Sharma | జైస్వాల్‌ డెబ్యూపై రోహిత్ మాస్టర్ ప్లాన్
అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Special Trains: సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
సంక్రాంతి కోసం మరో 11 స్పెషల్ ట్రైన్స్.. వికారాబాద్, పార్వతీపురం, కాకినాడ లాంటి రూట్లలో..!
Road Accident: అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
అమెరికాలో లోయలో పడ్డ కారు.. ఇద్దరు తెలుగు యువతుల మృతి
Tata Ernakulam Express Fire Accident: ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
ఎలమంచిలి వద్ద టాటా- ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి
Bigg Boss Emmanuel : అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
అలాంటి మహానటులు ఇంకా పుట్టలేదు - బిగ్ బాస్ ట్రోఫీ రాలేదనే అసంతృప్తి లేదు... ఇమ్మాన్యుయెల్ కామెంట్స్
Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
అసెంబ్లీ ముట్టడికి మాజీ సర్పంచుల యత్నం.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్
Apple iPhone Record Sales: ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ ఇదే.. ఆండ్రాయిడ్ ఫోన్లను వెనక్కి నెట్టి మరీ
Andhra PPP Politics: మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై పాలిటిక్స్‌కు కేంద్రం చెక్ - వైసీపీ బీజేపీపైనా యుద్ధం ప్రకటించే ధైర్యం చేస్తుందా?
The Raja Saab Pre Release Event : విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
విలన్ల చెంప పగలగొట్టారు - 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై RGV రియాక్షన్
Embed widget