అన్వేషించండి

KTR: తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పు - చార్మినార్ వద్ద కేటీఆర్, బీఆర్ఎస్ నేతల నిరసన, రాజకీయ కక్షతోనే చేస్తున్నారంటూ ఆందోళన

KTR Charminar Visit: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు రాజకీయ కాక రేపుతోంది. చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

BRS Vs Congress: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు ప్రతిపాదన దృష్ట్యా.. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ నేతలు గురువారం ఉదయం చార్మినార్ వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రస్తుతం లోగో నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు పద్మారావు గౌడ్, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఇతర పార్టీ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చార్మినార్ వద్ద నిరసనకు దిగారు. అటు, కాకతీయ కళాతోరణం వద్ద కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. భాగ్యనగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు.
KTR: తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పు - చార్మినార్ వద్ద కేటీఆర్, బీఆర్ఎస్ నేతల నిరసన, రాజకీయ కక్షతోనే చేస్తున్నారంటూ ఆందోళన
KTR: తెలంగాణ అధికారిక చిహ్నంలో మార్పు - చార్మినార్ వద్ద కేటీఆర్, బీఆర్ఎస్ నేతల నిరసన, రాజకీయ కక్షతోనే చేస్తున్నారంటూ ఆందోళన

'మూర్ఖపు నిర్ణయాలు'

ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని.. పదేళ్లలో సాధించిన ప్రగతిని కాదని కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి అవలంబిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 'కేసీఆర్ పేరు వినిపించకుండా ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయ కక్షతోనే అధికారిక చిహ్నం మార్పు చేస్తోంది. చార్మినార్ ను రాష్ట్రం చిహ్నంలో తొలగించడం హైదరాబాదీలను విస్మరించడమే. అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేరిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం మార్చడం మూర్ఖపు నిర్ణయమే. చార్మినార్ హైదరాబాద్ ఐకాన్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనలేదు. కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాలని చూస్తున్నారు. లోగో మార్పుపై బీఆర్ఎస్ తరఫున నిరసన కార్యక్రమాలు చేపడతాం. అమరవీరుల స్థూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన వారి తల్లిదండ్రులు సంతోషపడరు. అధికారిక చిహ్నం మార్పు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి.' అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

చిహ్నం ఆవిష్కరణ వాయిదా

మరోవైపు, తెలంగాణ కొత్త అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. పలు డిజైన్లు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో చిహ్నం ఆవిష్కరణ వాయిదా వేయాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు జూన్ 2న కేవలం తెలంగాణ గేయాన్ని మాత్రమే ఆవిష్కరించే అవకాశం ఉంది.  ప్రజలు, ప్రజాజీవితం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం తదితర అంశాలు ప్రతిబింబించేలా చిహ్నం రూపొందించాలని రేవంత్ భావిస్తున్నారు.  ఇందులో చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తారని స్పష్టమయింది. అయితే, దీన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. అవి తొలగించాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖపు నిర్ణయాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గురువారం చార్మినార్ వద్ద కేటీఆర్ సహా, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.

Also Read: Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ సంచలన వాంగ్మూలం, ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఆ పని చేశారట!

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Municipal Elections: క్యాతనపల్లిలో హైటెన్షన్- మంత్రి వివేక్ కారుపై దాడి.. బాల్క సుమన్‌పై హత్యాయత్నం కేసు?
క్యాతనపల్లిలో హైటెన్షన్- మంత్రి వివేక్ కారుపై దాడి.. బాల్క సుమన్‌పై హత్యాయత్నం కేసు?
BioAsia Conference: జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపు - గురువారం సీఎం సహా కీలకనేతలంతా హస్తిన బాట !
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపు - గురువారం సీఎం సహా కీలకనేతలంతా హస్తిన బాట !
Errabelli emotion: తొర్రూరులో చేజారిన మున్సిపల్ పీఠం - భావోద్వేగంతో ఎర్రబెల్లి కన్నీరు
తొర్రూరులో చేజారిన మున్సిపల్ పీఠం - భావోద్వేగంతో ఎర్రబెల్లి కన్నీరు

వీడియోలు

Australia Eliminated T20 World Cup 2026 | వర్షం కారణంగా Ireland vs Zimbabwe మ్యాచ్ రద్దు | ABP Desam
Mohammad Yousuf Slams Political Interference | పాక్ ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Epic 'No-Look' Wicket | వైరల్ అవుతున్న హార్దిక్ 'నో-లుక్' వికెట్
Vaibhav Suryavanshi Skips 10th Board Exams | వైభవ్ సూర్యవంశీ షాకింగ్ నిర్ణయం
Australia vs Sri Lanka T20 World Cup 2026 | అద్భుతమైన విజయంతో సూపర్ -8లోకి శ్రీలంక

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BioAsia Conference: జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Bangladesh new govt: బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
IAS Sri Lakshmi: జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
Bajaj Pulsar N160 EMI: 7వేల రూపాయలు చెల్లిస్తే బజాజ్‌ పల్సర్‌ N 160! హైదరాబాద్‌సహా తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఎంత EMI కట్టాలి? 
7వేల రూపాయలు చెల్లిస్తే బజాజ్‌ పల్సర్‌ N 160! హైదరాబాద్‌సహా తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఎంత EMI కట్టాలి? 
Rahul Gandhi: నాయకత్వానికి రాహుల్ గాంధీ అనర్హుడు -తీవ్రంగా విరుచుకుపడ్డ సిద్దూ భార్య
నాయకత్వానికి రాహుల్ గాంధీ అనర్హుడు -తీవ్రంగా విరుచుకుపడ్డ సిద్దూ భార్య
AI Summit 2026: డ్రైవర్‌కు నిద్ర వస్తే కారు ఆగిపోతుందా? ప్రమాదాలకు AIతో ఎలా చెక్ పడుతుంది? టాటా తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటీ?
డ్రైవర్‌కు నిద్ర వస్తే కారు ఆగిపోతుందా? ప్రమాదాలకు AIతో ఎలా చెక్ పడుతుంది? టాటా తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటీ?
Allu Arjun Controversy: సారీ అల్లు అర్జున్ గారూ... నాది తప్పే, క్షమించండి - దిగొచ్చిన బాలీవుడ్ లేడీ
సారీ అల్లు అర్జున్ గారూ... నాది తప్పే, క్షమించండి - దిగొచ్చిన బాలీవుడ్ లేడీ
Bengaluru: ఆస్తి రాసివ్వడం లేదని తండ్రిని కొట్టి చంపేసిన కొడుకులు - ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు !
ఆస్తి రాసివ్వడం లేదని తండ్రిని కొట్టి చంపేసిన కొడుకులు - ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు !
Embed widget