అన్వేషించండి

Konda Vishweshwar Reddy : అవును బీజేపీలో చేరుతున్నాను- సస్పెన్ష్‌కు తెర దించిన కొండా విశ్వేశ్వరరెడ్డి

బీజేపీలో చేరుతున్నట్టు కాంగ్రెస్ మాజీ నేత కొండా విశ్వేశ్వరెడ్డి ప్రకటించారు. కేసీఆర్‌ను ఓడించాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని సర్వేల్లో తేలిందని తెలిపారు.

బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు కొండా విశ్వేశ్వరరెడ్డి . రెండేళ్ల నుంచి పార్టీపై చేరికలు నడుస్తున్నాయన్నారు. కేంద్రనాయకత్వం స్థాయిలో ఈ చర్చలు నడుస్తున్నాయని తెలిపారు. చాలా మంది తెలంగాణ ఉద్యమకారులతో కూడా మాట్లాడినట్టు తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలన తొలగించి.. ప్రజాపాలన బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నట్టు వెల్లడించారు. 

కాంగ్రెస్‌తో మంచి సంబంధాలే ఉన్నప్పటికీ ఆ పార్టీకి కేసీఆర్‌ను ఓడించే శక్తి లేదని అభిప్రాయపడ్డారు కొండా విశ్వేశ్వరరెడ్డి. తెలంగాణలో తప్ప దేశంలో కాంగ్రెస్ ఎక్కడ బలంగా లేదన్నారు. ఇక్కడ నాయకత్వంతోనే అది సాధ్యమవుతుంది గానీ కాంగ్రెస్‌ బలం కాదన్నారు. ఈ పరిస్థితిలో కేసీఆర్‌ను ఓడించే దమ్ము బీజేపీకి మాత్రమే ఉందన్నారు.

మోదీ పట్ల దేశంపై నమ్మకం పెట్టుకుందని... తెలంగాణలో కూాడా ఆయనపై అపారమైన నమ్మకం ఉందన్నారు. అందుకే ఇక్కడ కూడా బీజేపీ వస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. 

టీఆర్‌ఎస్‌ హయాంలో రంగారెడ్డి జిల్లాకు చాలా అన్యాయమైపోయిందన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇక్కడ నిధులన్నీ తీసుకొని వాళ్ల సొంత ఊరిలో పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై కోపంతో తాను పార్టీ మారడం లేదని లేదని... ఉద్యమకారులను మోసం చేసినందుకు తట్టుకోలేకపోయనంటున్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్లందర్నీ పక్కకు పెట్టేసి డబ్బుతోనే రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు.  ఇప్పుడు ఉన్న వాళ్లంతా ఉద్యమంలో లేని వారేనన్నారు.

ఇప్పుడు టీఆర్‌ఎస్‌కు కేడర్‌కు సంబంధం తెగిపోయిందని అభిప్రాయపడ్డారు కొండా విశ్వేశ్వరరెడ్డి. కాంగ్రెస్‌కు కేడర్‌కు ఆ అటాచ్‌మెంట్‌ ఉందన్నారు. బీజేపీకి కూడా ఆ బాండింగ్ ఉందని తెలిపారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఇప్పుడు డబ్బుతో తప్ప వేరే అటాచ్మెంట్‌ లేదని విమర్శించారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ బాగా ఖర్చు పెట్టింది కానీ అక్కడ తెలంగాణవాదం గెలిచిందని కామెంట్ చేశారు కొండా విశ్వేశ్వరరెడ్డి. రాబోయే ఎలక్షన్‌లో కూడా టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీ గెలుచుకుంటుంది. 

క్వాలిటేటివ్‌ సర్వేలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని అభిప్రాయపడ్డారు కొండా విశ్వేశ్వరరెడ్డి. రేవంత్‌తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ చచ్చిపోతున్న టైంలో రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా చేశారని తెలిపారు. ముందుగా చేసి ఉంటే తెలంగాణలో పరిస్థితి వేరుగా ఉండేది అన్నారు. 

ఎప్పుడు... ఎలా చేర్చాలనేది... ఎవరి ఆధ్వర్యంలో అనేది బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డికే వదిలేశాను. మొదట 1న చేరొచ్చన్నారని... తర్వాత మళ్లీ ప్లాన్ మారిందన్నారు. 2, 3 తేదీల్లో చేరే ఛాన్స్ ఉందని తెలిపారు. సంప్రదాయం ప్రకారం పార్టీ ప్రెసిడెంట్‌ ఆధ్వర్యంలో జాయినింగ్స్ ఉంటాయి. పార్టీలో చేరినప్పుడు నాకేంటని ఎప్పుడూ అడగలేదన్నారు కేవీఆర్. ఇప్పుడు కూడా అడగలేదని వివరించారు. ఇక్కడ బీజేపీలో చేరడానికి ముందు ఐదు విషయాలపై క్లారిటీ కోరానన్నారు.

కొండా విశ్వేశ్వరరెడ్డి అడిగిన ఐదు పాయింట్లు

తెలంగాణలో జరిగిన దోపిడీపై ఏం చేయబోతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారని క్లారిటీ అడిగానన్నారు. 

ఈటల రాజీనామాతో వచ్చిన బై ఎలక్షన్‌లో ఓటమితో  టీఆర్‌ఎస్ సగమ చచ్చిపోయిందన్నారు. ఇంకో బై ఎలక్షన్‌ వస్తే పూర్తిగా చచ్చిపోద్దన్నారు. ఇప్పుడు కేసులను పరిష్కరిస్తే మరో ఉపఎన్నిక వచ్చే ఛాన్స్‌ ఉందన్నారు.  

మైనారిటీకి వ్యతిరేకమా... అని అడిగాను. ఉదయ్‌పూర్ లాంటి వాళ్లకే వ్యతిరేకం కానీ.... ముస్లింలకు వ్యతిరేకం కాదని నడ్డా వివరణ ఇచ్చారన్నారు.   

బీజేపీ అగ్రకులాల పార్టీ అనే అపోహ ఉందని... దానిపై క్లారిటీ అడిగానన్నారు. ఇప్పుడు బీజేపీ కులం లేని హిందుత్వ పార్టీ అని అభిప్రాయపడ్డారు.   

మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ జోరు పెరగాలని... దీనికి ఓ ప్లాన్‌ కూడా బీజేపీకి చెప్పానన్నారు.  

కాంగ్రెస్‌ను తప్పుబడితే నాకు ఓట్లు రావని... కేసీఆర్‌ను నిలదీస్తేనే ఓట్లు వస్తాయన్నారు కొండా విశ్వేశ్వరరావు. గ్రామీణ ప్రాంతాల్లో దోపిడీ ఏంటో కనిపిస్తోందని... హైదరాబాద్‌లో కనిపించకపోవచ్చన్నారు. 

కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వస్తుంది. సంబంధాలు మంచిగా ఉంటే రావాల్సినవి త్వరగా వస్తాయన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. జగన్, విజయసాయిరెడ్డి ఎలా మాట్లాడుతున్నరో చూడాలన్నారు. స్టాలిన్ చూసి నేర్చుకోవాలని సూచించారు. అందుకే వాళ్లకు త్వరగా నిధులు వస్తున్నాయని తెలిపారు. తీసుకున్న అప్పులను కూడా తెలంగాణ ప్రభుత్వం దాచిపెట్టింది. దానికి గ్యారెంటీలు కేంద్రం ఇచ్చింది. ఇప్పుడే గుర్తించారు. ఎటాక్ ఇంకా ఉంటుంది. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
Rains In AP, Telangana: వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ - మత్స్యకారులకు వార్నింగ్

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget