అన్వేషించండి

Revanth Reddy : ఈడీ బీజేపీ ఎలక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, భారత్ జోడో యాత్రకు భయపడే కాంగ్రెస్ నేతలకు నోటీసులు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి భయంతో కేంద్రం ఈడీని ఉసిగొల్పి నోటీసులు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి ఈడీ దాడులు చేయిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ కేసులకు భయపెట్టి ముఖ్య నాయకులను బీజేపీలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందనే ఉద్దేశంతో మూసేసిన కేసులను బీజేపీ మళ్లీ తిరగదోడుతుందన్నారు. రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలవడంపై రేవంత్ మండిపడ్డారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా ఆమెను విచారణ పేరుతో వేధించారన్నారు. అయినా భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు ఈడీ నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో జోడో యాత్రను అడ్డుకోవడానికి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ను ఈడీ విచారణకు పిలిచిందని ఆరోపించారు. ఏయే రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉందో అక్కడి నేతలను ఈడీ వేధిస్తుందని రేవంత్‌ అన్నారు. ఈడీ బీజేపీ ఎలక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌గా మార్చుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

బీజేపీ చందాలిచ్చిన నేతలపై కేసులేవి? 

గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఈడీ నోటీసులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.కోటి చందా ఇచ్చినందుకు ఐదుగురు నేతలకు నోటీసులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ నేతలను భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. బీజేపీకి చందాలిచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. గత ఏడేళ్లలో బీజేపీకు రూ.4841 కోట్ల డోనేషన్ వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈడీ కేసులతో వేధింపులు 

కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీచేయడం వెనుక కుట్రను ప్రజలు గమనించాలని రేవంత్‌ రెడ్డి కోరారు. కాంగ్రెస్‌లో చేరాలనుకున్న వాళ్లను భయపెట్టి బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌, కుటుంబ సభ్యులపై ఈడీ విచారణ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మనోధైర్యాన్ని ఈడీ, ఐటీ, సీబీఐ దెబ్బతీయలేవని రేవంత్ రెడ్డి అన్నారు. 11 రాష్టాల్లో ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని రేవంత్‌ విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపిస్తు్న్న బీజేపీ, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. బంగారు కూలీ పేరుతో కోట్ల రూపాయలు టీఆర్ఎస్ వసూలు చేసిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కు రూ.800 కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. దిల్లీలో అత్యంత విలువైన ప్రాంతంలో టీఆర్ఎస్ ఆఫీస్ కు స్థలం కేటాయించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి ముందస్తు ఒప్పందంలో టీఆర్ఎస్ దిల్లీలో స్థలం ఇచ్చారన్నారు. 

Also Read : KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

Also Read : Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Maruti Grand Vitaraపై ఇయర్ ఎండ్ ఆఫర్లు: పెట్రోల్, CNG వేరియంట్లకూ డిస్కౌంట్లు
మారుతి గ్రాండ్ విటారాపై రూ.2.13 లక్షల వరకు లాభం, ఆఫర్‌ మరో రెండు రోజులే!
Rampur Accident: రోడ్డుపైకి వెళ్తే గ్యారంటీ ఉండదు - లగ్జరీ కారులో ఉన్నా సరే -ఈ వీడియో చూస్తే వణికిపోతారు!
రోడ్డుపైకి వెళ్తే గ్యారంటీ ఉండదు - లగ్జరీ కారులో ఉన్నా సరే -ఈ వీడియో చూస్తే వణికిపోతారు!
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget