అన్వేషించండి

Revanth Reddy : ఈడీ బీజేపీ ఎలక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, భారత్ జోడో యాత్రకు భయపడే కాంగ్రెస్ నేతలకు నోటీసులు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి భయంతో కేంద్రం ఈడీని ఉసిగొల్పి నోటీసులు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి ఈడీ దాడులు చేయిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ కేసులకు భయపెట్టి ముఖ్య నాయకులను బీజేపీలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందనే ఉద్దేశంతో మూసేసిన కేసులను బీజేపీ మళ్లీ తిరగదోడుతుందన్నారు. రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలవడంపై రేవంత్ మండిపడ్డారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా ఆమెను విచారణ పేరుతో వేధించారన్నారు. అయినా భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు ఈడీ నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో జోడో యాత్రను అడ్డుకోవడానికి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ను ఈడీ విచారణకు పిలిచిందని ఆరోపించారు. ఏయే రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉందో అక్కడి నేతలను ఈడీ వేధిస్తుందని రేవంత్‌ అన్నారు. ఈడీ బీజేపీ ఎలక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌గా మార్చుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

బీజేపీ చందాలిచ్చిన నేతలపై కేసులేవి? 

గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఈడీ నోటీసులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.కోటి చందా ఇచ్చినందుకు ఐదుగురు నేతలకు నోటీసులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ నేతలను భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. బీజేపీకి చందాలిచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. గత ఏడేళ్లలో బీజేపీకు రూ.4841 కోట్ల డోనేషన్ వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈడీ కేసులతో వేధింపులు 

కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీచేయడం వెనుక కుట్రను ప్రజలు గమనించాలని రేవంత్‌ రెడ్డి కోరారు. కాంగ్రెస్‌లో చేరాలనుకున్న వాళ్లను భయపెట్టి బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌, కుటుంబ సభ్యులపై ఈడీ విచారణ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మనోధైర్యాన్ని ఈడీ, ఐటీ, సీబీఐ దెబ్బతీయలేవని రేవంత్ రెడ్డి అన్నారు. 11 రాష్టాల్లో ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని రేవంత్‌ విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపిస్తు్న్న బీజేపీ, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. బంగారు కూలీ పేరుతో కోట్ల రూపాయలు టీఆర్ఎస్ వసూలు చేసిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కు రూ.800 కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. దిల్లీలో అత్యంత విలువైన ప్రాంతంలో టీఆర్ఎస్ ఆఫీస్ కు స్థలం కేటాయించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి ముందస్తు ఒప్పందంలో టీఆర్ఎస్ దిల్లీలో స్థలం ఇచ్చారన్నారు. 

Also Read : KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

Also Read : Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రే" లోక్‌సభలో రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget