అన్వేషించండి

Revanth Reddy : ఈడీ బీజేపీ ఎలక్షన్‌ డిపార్ట్‌మెంట్‌, భారత్ జోడో యాత్రకు భయపడే కాంగ్రెస్ నేతలకు నోటీసులు- రేవంత్ రెడ్డి

Revanth Reddy : భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందన చూసి భయంతో కేంద్రం ఈడీని ఉసిగొల్పి నోటీసులు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Revanth Reddy : రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి ఈడీ దాడులు చేయిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ గాంధీ భవన్‌లో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ కేసులకు భయపెట్టి ముఖ్య నాయకులను బీజేపీలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందనే ఉద్దేశంతో మూసేసిన కేసులను బీజేపీ మళ్లీ తిరగదోడుతుందన్నారు. రాహుల్ గాంధీని ఈడీ విచారణకు పిలవడంపై రేవంత్ మండిపడ్డారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా ఆమెను విచారణ పేరుతో వేధించారన్నారు. అయినా భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు ఈడీ నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో జోడో యాత్రను అడ్డుకోవడానికి కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ను ఈడీ విచారణకు పిలిచిందని ఆరోపించారు. ఏయే రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పాదయాత్ర ఉందో అక్కడి నేతలను ఈడీ వేధిస్తుందని రేవంత్‌ అన్నారు. ఈడీ బీజేపీ ఎలక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌గా మార్చుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

బీజేపీ చందాలిచ్చిన నేతలపై కేసులేవి? 

గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఈడీ నోటీసులు ఇచ్చిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రూ.కోటి చందా ఇచ్చినందుకు ఐదుగురు నేతలకు నోటీసులు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ నేతలను భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. బీజేపీకి చందాలిచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులు ఇచ్చారా అని ప్రశ్నించారు. గత ఏడేళ్లలో బీజేపీకు రూ.4841 కోట్ల డోనేషన్ వచ్చాయని రేవంత్ రెడ్డి అన్నారు.

ఈడీ కేసులతో వేధింపులు 

కాంగ్రెస్‌ నేతలకు ఈడీ నోటీసులు జారీచేయడం వెనుక కుట్రను ప్రజలు గమనించాలని రేవంత్‌ రెడ్డి కోరారు. కాంగ్రెస్‌లో చేరాలనుకున్న వాళ్లను భయపెట్టి బీజేపీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌, కుటుంబ సభ్యులపై ఈడీ విచారణ ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ మనోధైర్యాన్ని ఈడీ, ఐటీ, సీబీఐ దెబ్బతీయలేవని రేవంత్ రెడ్డి అన్నారు. 11 రాష్టాల్లో ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని రేవంత్‌ విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం ఏటీఎంలా మారిందని ఆరోపిస్తు్న్న బీజేపీ, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. బంగారు కూలీ పేరుతో కోట్ల రూపాయలు టీఆర్ఎస్ వసూలు చేసిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కు రూ.800 కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. దిల్లీలో అత్యంత విలువైన ప్రాంతంలో టీఆర్ఎస్ ఆఫీస్ కు స్థలం కేటాయించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కోవడానికి ముందస్తు ఒప్పందంలో టీఆర్ఎస్ దిల్లీలో స్థలం ఇచ్చారన్నారు. 

Also Read : KTR Tweet: గాంధీని అవమానించడంపై కేటీఆర్ ఫైర్- ఎన్ని జన్మలెత్తినా సాధించలేరని ట్వీట్!

Also Read : Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల - పోలింగ్ డేట్, కౌంటింగ్ ఎప్పుడంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Allari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABPHyderabad 16Cars Fire Accident | హైదరాబాద్ యూసుఫ్ గూడలో అగ్నికి ఆహుతైపోయిన 16కార్లు | ABP DesamPawan kalyan Touches feet of Pastor | పిఠాపురంలో మహిళా పాస్టర్ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Embed widget