అన్వేషించండి

KCR re entry: జగిత్యాల సభతో కేసీఆర్ రీ ఎంట్రీ - ఇక నుంచి మరో లెక్కనా?

KCR: జగిత్యాల సభతో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన మళ్లీ మౌన వ్యూహం పాటించకుండా..జోరుగా రాజకీయం చేస్తే తెలంగాణలో పరిస్థితులు మారిపోయే అవకాశం ఉంది.

KCR is re-entering active politics:  గులాబీ దళపతి కేసీఆర్   సుదీర్ఘ విరామం తర్వాత  గళం విప్పబోతుండటం బీఆర్ఎస్ పార్టీని ఉత్సాహంలో ముంచెత్తుతోంది.  గత  పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఆయన ప్రజల మధ్యకు రాకపోవడం, అటు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకపోవడంతో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ శకం ముగిసిందన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో జగిత్యాల వేదికగా ఆయన నిర్వహించబోయే బహిరంగ సభ తన ఉనికిని చాటుకోవడమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తన ప్రాధాన్యతను నిరూపించుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది.

వెంటనే కౌంటర్ ఇచ్చేందుకు రేవంత్ రెడీ 

కేసీఆర్ రీ-ఎంట్రీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. కేసీఆర్ బహిరంగ సభకు దీటుగా, అదే రోజు కాటారంలో రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో ఏర్పాటు చేసింది. కేసీఆర్ విమర్శలు చేసే సమయంలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు చేరాలనే వ్యూహం వెనుక బలమైన రాజకీయ సందేశం ఉంది. రాజకీయం ఇప్పుడు స్పష్టంగా  కేసీఆర్ వర్సెస్ రేవంత్  అన్నట్లుగా మారుతోంది. ఇది ఇద్దరు నేతలకు తమ బలాలను ప్రదర్శించుకోవడానికి ఒక సువర్ణ అవకాశంగా మారింది.

కేసీఆర్ ఇక కీలకంగా వ్యవహరిస్తారా? 

కేసీఆర్ ఈ ఒక్క బహిరంగ సభతోనే సరిపెడతారా లేక తన దూకుడును నిరంతరాయంగా కొనసాగిస్తారా అన్నదే  చాలా మందికి ఆన్సర్ తెలియని ప్రశ్న. గతంలో కూడా ఆయన అడపాదడపా మీడియా ముందుకు రావడం, మళ్లీ నెలల తరబడి ఫామ్ హౌస్ కే పరిమితం కావడం వల్ల బీఆర్ఎస్ కేడర్ నైతికంగా దెబ్బతిన్నది. ఈసారి కూడా అదే పునరావృతమైతే, విపక్ష గొంతుక బలహీనపడి అది అంతిమంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే రాజకీయంగా మేలు చేస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.  ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ సమయంలో ఒక సమర్థవంతమైన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రజల పక్షాన నిరంతరం పోరాడితేనే ఆయన ప్రాధాన్యత నిలబడుతుంది. అలా కాకుండా కేవలం ఒక్క సభ పెట్టి మళ్లీ మౌనం పాటిస్తే, అది కేవలం ఒక  ఈవెంట్ గా మిగిలిపోతుందే తప్ప, రాజకీయ సమీకరణాల్లో మార్పు రాదు. రాజకీయ రంగంలో ఔట్ ఆఫ్ సైట్.. ఔట్ ఆఫ్ మైండ్ ' అన్న సూత్రం అక్షరాలా నిజమవుతున్న తరుణంలో కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ శ్రేణులుభావిస్తున్నాయి. 

కేసీఆర్ యాక్టివ్‌గా లేకపోవడంతో రేవంత్ దూకుడు

రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పాలనను, రాజకీయాలను దూకుడుగా ముందుకు తీసుకువెళుతున్నారు. కేసీఆర్ విడిచిన ఖాళీని భర్తీ చేస్తూ ప్రజల్లో తన పట్టును పెంచుకుంటున్నారు. ఈ దశలో కేసీఆర్ మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి రావడం వల్ల ఒక బలమైన ప్రతిపక్షం ఉందని ప్రజలు భావిస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదే అయినప్పటికీ, కేసీఆర్ కంటిన్యూటీ లేకపోతే మాత్రం అది రేవంత్ రెడ్డికి  వాకోవర్ ఇచ్చినట్లే అవుతుందన్న అభిప్రాయం ఉంది.  జగిత్యాల సభ తర్వాత కేసీఆర్ అడుగులు ఏ దిశగా పడతాయోనన్నది తెలంగాణ రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించనుంది. ఆయన మళ్లీ ఫామ్ హౌస్ కే పరిమితమైతే అది రేవంత్ రెడ్డికి తిరుగులేని అవకాశంగా మారుతుంది. అలా కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటనలు కొనసాగిస్తే మాత్రం రాష్ట్రంలో రాజకీయ సెగలు పుట్టడం ఖాయం. ఒకప్పుడు తెలంగాణను శాసించిన కేసీఆర్, ఇప్పుడు తన రాజకీయ అస్తిత్వం కోసం చేస్తున్న ఈ పోరులో ఎంతవరకు సఫలమవుతారో వేచి చూడాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TVK Vijay: ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
ఫిరాయింపుల రాజకీయాలతో విజయ్ ఇమేజ్ డ్యామేజ్ - మార్పు నమ్మకాన్ని తమిళ ప్రజలు కోల్పోయినట్లేనా?
YSRCP committee restructuring: స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
స్థానిక ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాల్సిందే - పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేయనున్న జగన్ ?
AP Politics: జగన్ శాశ్వత మిత్రుడన్న వివాదంతో బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? పవన్ ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు?
జగన్ శాశ్వత మిత్రుడన్న వివాదంతో బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు? పవన్ ప్రశ్నకు సమాధానం ఎవరిస్తారు?
Pawan Kalyan Comments on Tamil Politics: అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం
అక్కడ కటౌట్లు పెడితే గెలిపించేశారు. నన్ను రోడ్లపై దేకించారు.. తమిళ పాలిటిక్స్‌పై పవన్ నిష్టూరం
Advertisement

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
IPL 2026 RCB In Final: వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
వ‌రుస‌గా రెండో సీజన్ లో ఫైన‌ల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన ప‌తిదార్ సేన‌.. రాణించిన డ‌ఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
Pawan Kalyan on Godavari River: గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
గోదావరి గలగల కాదు, వెలవెలబోతోంది; పుష్కరాల పనులు, కాలుష్య నివారణపై పవన్ కల్యాణ్‌ డెడ్‌లైన్!
Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!
Bandla Ganesh : బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
బండ్ల గణేష్‌ను చెప్పుతో కొట్టిన ఇండస్ట్రీ పెద్ద ఎవరు? - సీక్రెట్స్ బయటపెట్టిన ప్రొడ్యూసర్
TMC crisis 2026: మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ - బీజేపీలో విలీనం అయ్యేందుకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెడీ
AP PCC Chief Sharmila : వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
వైఎస్, రాజారెడ్డి మహానుభావులు - చనిపోయిన వారిపై నిందలేస్తారా? - టీడీపీ నేతలపై షర్మిల ఆగ్రహం
Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్
Embed widget