అన్వేషించండి

Andhra Pradesh Law and Order Issue: మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?

Andhra Politics: ఏపీ రాజకీయాల్లో ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు రగిల్చే కుట్రలు సాగుతున్నాయా? రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రశ్న రావణ్ అరెస్ట్ వెనుక ఉన్న పొలిటికల్ మైండ్ గేమ్‌ఏమిటి?

Social Media Abuse Control Politics: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో లభించిన చారిత్రాత్మక విజయంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన తరుణంలో.. రాష్ట్ర రాజకీయాలు మునుపెన్నడూ లేనంతగా వ్యక్తిగత దూషణలు, శాంతిభద్రతల సవాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి.  రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలు రగిల్చేందుకు, శాంతిభద్రతల సమస్యలను   సృష్టించేందుకు ఒక పక్కా వ్యూహం ప్రకారం ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు  టీడీపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.  రాయలసీమలోని రాప్తాడు ఫ్యాక్షన్ సెగల నుంచి కోస్తాలోని పెనుమలూరు పొలిటికల్ వార్ దాకా.. గత కొన్ని వారాలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు కేవలం స్థానిక వివాదాలు కాదని, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అభద్రతా భావాన్ని సృష్టించేందుకు   ఒక పెద్ద పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అంటున్నారు. 

పరిటాల సునీత, రవిపై ఘోరమైన వ్యాఖ్యలు చేసిన తోపుదుర్తి 

 రాయలసీమ సున్నిత ప్రాంతాల్లో పాత కక్షలను మళ్లీ రగల్చడం. ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు రెండేళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హఠాత్తుగా తెరపైకి వచ్చి.. దివంగత నేత పరిటాల రవి, ప్రస్తుత మంత్రి పరిటాల సునీతలపై అత్యంత ఘోరమైన, వ్యక్తిగత పదజాలం ఉపయోగించడం జిల్లాలో సంచలనంగా మారింది. ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న అనంతపురం లాంటి జిల్లాలో ఇలాంటి ఉద్రేకం రేపే ప్రసంగాలు చేయడం వెనుక.. ఎలాగైనా స్థానిక కేడర్‌ను ఘర్షణల్లోకి నెట్టాలనే కుట్ర దాగుందని అనుమానిస్తున్నారు. కూటమి శ్రేణులు గనుక సహనం కోల్పోయి ఎదురుదాడి చేస్తే..  రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, మాపై దాడులు జరుగుతున్నాయి అని దిల్లీ స్థాయిలో  విక్టిమ్ కార్డ్ ప్లే చేసే వ్యూహంతోనే తోపుదుర్తి ఇలా రెచ్చగొడుతున్నారని అధికార పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి.  

 పెనుమలూరు వివాదం, అమరావతి రాజకీయం

కృష్ణా జిల్లా కానూరు లో టీడీపీ జెండా దిమ్మెను ఉద్దేశపూర్వకంగా తొలగించిన వ్యవహారం దుమారం రేపింది.  అమరావతిలోనూ వైసీపీ నేతల పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడింది. తమ నేతలపైనే దాడులు జరిగాయంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా రంగంలోకి రావడం ఈ పొలిటికల్ స్కెచ్‌లో భాగమేనని అంటున్నారు.  ఏపీ రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఇతర రాష్ట్రాల యూట్యూబర్లు, సోషల్ మీడియా యాక్టివిస్టులు  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను టార్గెట్ చేస్తూ మహిళా నేతలపై అత్యంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టడం, విద్వేషాలను రేపడం పతాక స్థాయికి చేరింది. తాజాగా, దళిత క్రైస్తవ మీటింగుల ముసుగులో పవన్ కళ్యాణ్‌పై, రాజ్యాంగ వ్యవస్థలపై సాయుధ తిరుగుబాటును, నక్సల్స్ ఐడియాలజీని ప్రోత్సహిస్తూ వీడియోలు చేసిన వివాదాస్పద యూట్యూబర్  జోసెఫ్ అలియాస్  ప్రశ్న రావణ్  పై గన్నవరం పోలీసులు కఠినమైన ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం  సంచలనంగా మారింది. 

ప్రభుత్వం గుర్తించిందా?

ఈ  అలజడి రాజకీయ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత కఠినమైన  యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసే సూచనలు కనిపిస్తున్నాయి.  గత రెండేళ్లుగా కేవలం పరిపాలన, సంక్షేమంపైనే దృష్టి పెట్టి శాంతిభద్రతల విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించడం వల్లే  ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని భావిస్తున్న  సీఎం చంద్రబాబు.. ఇప్పుడు హోం శాఖకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. రాజకీయ నాయకుల ముసుగులో ఉన్నా సరే.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హయాంలో జరిగిన రాక్రీట్  అవినీతి అక్రమాలపై, ఆస్తుల సీజింగ్‌పై లీగల్ ఫోకస్ పెట్టడంతో పాటు.. సోషల్ మీడియా విద్వేషకులకు మద్దతుగా నిలుస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్, వైసీపీ సోషల్ మీడియా వింగ్‌పై లీగల్ నోటీసులు, అరెస్టుల పరంపర ప్రారంభం కానుందని భావిస్తున్నారు. 

పెట్టుబడులు, అభివృద్ధి కాదు.. ఇతర అంశాలే హైలెట్ 

ఏపీ రాజకీయాలు ఇప్పుడు కేవలం  అభివృద్ధి-సంక్షేమం  అనే చర్చల నుంచి మారి,  వ్యవస్థల పరిరక్షణ-శాంతిభద్రతల అదుపు  అనే దిశగా సాగుతున్నాయి. ప్రతిపక్షం ఎంతలా రెచ్చగొట్టినా.. కూటమి ప్రభుత్వం చట్టపరమైన ఆంక్షలు, ఉపా  లాంటి కఠిన నిబంధనల ద్వారా అరాచకాలను అణచివేసేందుకే మొగ్గు చూపుతోంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకోబోయే ఈ కఠిన చర్యలు అరాచక శక్తులకు అడ్డుకట్ట వేసి రాష్ట్రాన్ని ప్రశాంత మార్గంలో ఉంచుతాయా.. లేక ప్రతిపక్షం మరింతగా సెంటిమెంట్ పాలిటిక్స్ తెరపైకి తెస్తుందా అనేది వేచి చూడాలి.


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Law and Order Issue: మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Telangana BJP Internal Strategy: గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
గ్రేటర్ త్రిశూల పోరుకు బీజేపీ జంగ్ సైరన్! మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు శూన్యమేనా?
Telangana Rakshana Sena ECI Rejection: కవితకు కలసిరాని TRS సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?
కవితకు కలసిరాని TRS సెంటిమెంట్! లీగల్ గందరగోళం కంటే జాగృతి వైపు వెళ్లడమే శ్రేయస్కరమా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pawan Kalyan: అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
అమరావతిపై అసత్య ప్రచారానికి ఆన్సర్‌ ఇదే! అధికారులను అభినందించిన పవన్ కల్యాణ్!
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Embed widget