అన్వేషించండి

YCP Leaders Silent: వైఎస్ఆర్‌సీపీ సీనియర్ల ఆజ్ఞాత రాజకీయం - వ్యూహమా? భయమా?

YCP Leaders Underplay: వైసీపీలో సగానికి పైగా సీనియర్ నేతలు ఇంకా ఎందుకు ఫీల్డ్‌లోకి రావడం లేదు? వారసుల రాజకీయ భవిష్యత్తు కోసం గోడమీద పిల్లుల్లా ఉన్నారా?

Why YSRCP Senior Leaders Are Silent After Election: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిశ్శబ్దాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలు, ప్రజా క్షేత్రంలో కదలికలు తగ్గడంతో.. పార్టీలోని ద్వితీయ శ్రేణి, ముఖ్యంగా సగానికి పైగా సీనియర్ నాయకులు పూర్తిగా  ఫీల్డ్ కు దూరమయ్యారు. సిక్కోలు నుంచి నెల్లూరు వరకు, అటు రాయలసీమ కోటల వరకు ఒకప్పుడు ఉద్దండ పిండాలుగా వెలిగిన వైసీపీ సీనియర్లు ఇప్పుడు నియోజకవర్గాల్లో ముఖం చాటేస్తున్నారు. పార్టీ భవిష్యత్తుపై నమ్మకం కుదరకపోవడమా? లేక మారుతున్న రాజకీయ సమీకరణాలతో గోడ మీద పిల్లి  వాటంగా వ్యవహరిస్తున్నారా?  

 ప్రెస్ మీట్లకే పరిమితమైన  యాక్టివిజం 

ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నట్లు కనిపిస్తున్న కొద్దిమంది నేతలు సైతం కేవలం తాడేపల్లి కేంద్రంగా లేదా వారి వ్యక్తిగత కార్యాలయాల్లో ప్రెస్ మీట్లు పెట్టడానికే పరిమితమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం, కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించడం, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలబడటం వంటి పనులకు వీరు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. కేవలం మైకుల ముందు ఘాటు విమర్శలు చేసి, సోషల్ మీడియాలో హెడ్‌లైన్స్‌లో నిలవడమే రాజకీయం అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తుండటంతో క్షేత్రస్థాయిలో క్యాడర్ తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయింది.

 వారసుల భవిష్యత్ కోసం గోడ మీద పిల్లి  వాటం 

ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు గమనిస్తే.. చాలా మంది సీనియర్ నేతలకు తమ రాజకీయ ప్రస్థానం ముగింపు దశకు చేరింది. ఇప్పుడు వారి ప్రధాన ఆందోళన అంతా తమ వారసుల రాజకీయ భవిష్యత్తు గురించే. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ తరఫున గట్టిగా నిలబడి అధికార కూటమి పై పోరాడితే, భవిష్యత్తులో తమ వారసులకు పొలిటికల్ కెరీర్ లేకుండా పోతుందేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. అందుకే అధికార పక్షంతో అనవసరమైన వైరాన్ని కొనితెచ్చుకోకుండా, తమ వ్యాపారాలను, ఆస్తులను కాపాడుకుంటూ  అండర్ ప్లే చేస్తున్నారనేది స్పష్టమవుతోంది.

 రాయలసీమలోనూ అండర్ ప్లే రాజకీయం 

వైసీపీకి కంచుకోట లాంటి రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫ్యాక్షన్, పంతాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే సీమ నియోజకవర్గాల్లో చాలా మంది మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు తమ సొంత నియోజకవర్గాల్లో కూడా సైలెంట్ అయిపోయారు. క్యాడర్‌ను కాపాడుకోవడానికి కనీస ప్రయత్నాలు కూడా చేయడం లేదు. అధికార పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకుంటూ, లో ప్రొఫైల్ మెయింటెన్ చేయడం ద్వారా ప్రస్తుత గండం నుంచి గట్టెక్కవచ్చనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది. అవసరమైతే తప్ప బయటకు రాకూడదనే ఒక అలిఖిత నిబంధనను వారు పెట్టుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.

 జగన్ ఫుల్ టైమ్ రాకపోవడమే ప్రధాన మైనస్ 

నాయకులలో ఈ స్థాయి స్తబ్దత రావడానికి పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శైలి కూడా ఒక ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ పూర్తిగా వీధుల్లోకి వచ్చి, నిరంతరాయంగా ప్రజా పోరాటాలు చేయకపోవడంతో కింది స్థాయి నేతలకు కూడా ఆ అవసరం కనిపించడం లేదు. అధినేతే తాడేపల్లి ,  బెంగళూరు ప్యాలెస్‌లకే పరిమితమైతే, తాము మాత్రం రోడ్లెక్కి కేసులు ఎందుకు పెట్టించుకోవాలనే ధోరణి సీనియర్లలో బలంగా నాటుకుపోయింది. లీడర్ షిప్ నుంచి స్పష్టమైన యాక్షన్ ప్లాన్, భరోసా లేకపోవడమే ఈ రాజకీయ శూన్యతకు ప్రధాన కారణం.

 మంచి అవకాశం వస్తే  జంప్ అయ్యేందుకేనా? 

ఈ సుదీర్ఘ నిశ్శబ్దం వెనుక మరో పెద్ద వ్యూహం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రస్తుతం తటస్థంగా ఉంటూ, రాబోయే రోజుల్లో రాజకీయ గాలి ఎటు వీస్తే అటు వైపు దూకేందుకు  వీరు మానసికంగా సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఏవైనా అసంతృప్తులు తలెత్తినా లేదా కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చినా.. తమకు అనుకూలమైన పార్టీలోకి మారిపోయేందుకు వీలుగానే వీరు ఏ పార్టీని తీవ్రంగా దూషించకుండా సేఫ్ గేమ్  ఆడుతున్నారు. సరైన సమయం, సరైన అవకాశం వస్తే వీరంతా వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి.

 ఈ పరిస్థితి మారకపోతే కష్టమే.. 

వైసీపీ ఉనికిని కాపాడుకోవాలంటే ఈ  సైలెంట్ మోడ్ వ్యూహం ఎంతమాత్రం పనికిరాదు. జగన్ వెంటనే ఫీల్డ్‌లోకి వచ్చి సీనియర్లలో నమ్మకాన్ని, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాల్సి ఉంది. అలా కాకుండా ఇదే స్తబ్దత మరికొన్ని నెలలు కొనసాగితే, రాబోయే రోజుల్లో వైసీపీ కేవలం బోర్డులకే పరిమితమై, నేతలంతా ఇతర పార్టీల వైపు వలస వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో పోరాడేవాడే నాయకుడిగా నిలబడతాడు తప్ప, గోడ మీద పిల్లిలా ఉంటే రాజకీయం పిల్లిమొగ్గలు వేయడం ఖాయమని రాజకీయవర్గాలు అంచనా  వేస్తున్నాయి.  

Advertisement

టాప్ హెడ్ లైన్స్

CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
ధర్మేంద్ర ప్రధాన్ బలిపశువు అయ్యారు, చాలా బాధాకరం- కేంద్ర మంత్రి రాజీనామాపై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
CJP GenZ Protest Success Story: కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
కాక్రోచ్‌ల తొలి పోరాటమే సూపర్‌హిట్ - రాజకీయ పార్టీలకు సాధ్యం కానిది సాధించిన జెన్జీలు !
Rahul Gandhi Student Paper Leak Protest: విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
విద్యార్థుల పోరులో రాహుల్ గాంధీ వ్యూహం - మైలేజీ వచ్చిందా? ఉద్యమం కాంగ్రెస్ సొంతమైందా?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Second Marriage OTT : ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Embed widget