అన్వేషించండి

YSRCP Assembly Strategy: డీఎస్సీతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలోనే వార్ - వైఎస్ జగన్ డిసైడయ్యారా?

YSCP Mega DSC protests: ప్రభుత్వ వైఫల్యాలు పెరిగిపోయాయని అసెంబ్లీలోనే ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ భావిస్తోంది. జగన్ వచ్చే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకునే చాన్స్ కనిపిస్తోంది.

Will YSRCP attend Andhra Pradesh assembly sessions:    ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ ఆరోపణలు కొనసాగిస్తూనే ఉంది.  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన  వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసిన ఉద్యోగాల విషయంలో అందరూ ఉద్యోగాల్లో చేరిన 9 నెలలతర్వాత   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  పూర్తిస్థాయిలో యుద్ధం ప్రకటించింది. నిరుద్యోగుల పక్షాన నిలబడుతున్నామంటూ వైసీపీ చేస్తున్న వరుస ప్రెస్ మీట్లు, ఆందోళనలు చూస్తుంటే.. రాబోయే బడ్జెట్ శాసనసభ   సమావేశాలను ఆ పార్టీ వేదికగా చేసుకోబోతోందా? అనే ఆసక్తికర చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో మొదలైంది. ప్రభుత్వం ఎన్ని సాంకేతిక వివరణలు ఇస్తున్నా, వైసీపీ మాత్రం తన పంథా వీడకుండా  నిరుద్యోగ గళం  వినిపిస్తోంది.

 అసెంబ్లీ బాయ్‌కాట్ పంతం వీడుతుందా? 

  ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది.  కేవలం మీడియా పాయింట్లు, సోషల్ మీడియా వేదికల ద్వారానే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండేళ్లు ముగుస్తుండటం, క్షేత్రస్థాయిలో కొన్ని ప్రభుత్వ నిర్ణయాలపై సహజంగానే వచ్చే   ప్రజా వ్యతిరేకతను వాడుకోవడానికి అసెంబ్లీని మించిన వేదిక లేదనే సలహాలు జగన్‌కు అందుతున్నాయి. డీఎస్సీ వంటి సున్నితమైన, లక్షలాది మంది ఓటర్లతో ముడిపడిన సమస్యపై సభలోనే ప్రభుత్వాన్ని నిలదీస్తే మైలేజ్ వస్తుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు.

 డీఎస్సీ అస్త్రంతో నిరుద్యోగులకు దగ్గరవ్వాలని.. 

గత ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో కూటమి వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు అదే అస్త్రాన్ని రివర్స్ చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.  భర్తీలో అవకతవకలు జరిగాయని  అభ్యర్థులు తీవ్ర నష్టపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. విద్యాశాఖ మంత్రి ఇచ్చే వివరణలను తోసిరాజంటూ, నిరుద్యోగుల ఆవేదనను అసెంబ్లీ సాక్షిగా రికార్డుల్లోకి తీసుకెళ్లడం ద్వారా తామే అసలైన ప్రజా పక్షమనే ముద్ర వేసుకోవాలని చూస్తోంది. ఒకవేళ సభకు వెళ్తే, డీఎస్సీపై స్వల్పకాలిక చర్చ   లేదా వాయిదా తీర్మానం ఇవ్వడం ద్వారా సభను స్తంభింపజేయడానికైనా వెనుకాడరని భావిస్తున్నారు. 

 రెండేళ్ల పాలనపై నిలదీసేందుకు రైట్ టైమ్ 
కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడానికి వైసీపీకి ఇది అత్యంత అనుకూలమైన సమయం . రెండు బడ్జెట్‌లు దాటిపోవడం, సూపర్ సిక్స్ హామీల అమలు తీరు, ఉచిత ఇసుక విధానంలో క్షేత్రస్థాయి లోపాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల  సమస్యలపై ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి అసెంబ్లీ కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్. ప్రతిపక్ష హోదా లేదు..  మైకు ఇవ్వడం లేదు, మాట్లాడటానికి సమయం సరిపోవడం లేదనే నెపంతో సభకు దూరంగా ఉంటే.. మైదానం మొత్తం కూటమికే వదిలేసినట్లవుతుందని, దానివల్ల క్యాడర్ మరింత నైరాశ్యంలోకి వెళ్తుందని వైసీపీ అంతర్గత మేధోమథనంలో వ్యక్తమైంది. అయితే వైసీపీ అసెంబ్లీలో అడుగుపెడితే కేవలం తాము మాత్రమే ప్రశ్నలు అడగడం సాధ్యం కాదు, ప్రభుత్వ కౌంటర్లను కూడా తట్టుకోవాల్సి ఉంటుంది. గత వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో అసలు డీఎస్సీ ఎందుకు వేయలేదు? కేవలం జీవోలతో కాలయాపన ఎందుకు చేశారు? కోర్టు కేసుల చిక్కుముడులకు కారణం ఎవరు? అనే ప్రశ్నలతో అధికార పక్షం కౌంటర్ ఎటాక్‌కు సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్,   లోకేశ్‌లు డేటాతో సహా పాత తప్పులను ఎండగడితే.. సభలో కేవలం 11 మంది సభ్యులు మాత్రమే ఉన్న వైసీపీ దాన్ని ఎలా తట్టుకుంటుందనేది పెద్ద సవాల్.

  జగన్ నిర్ణయం పైనే ఉత్కంఠ! 

చివరి నిమిషంలో వ్యూహాలు మార్చడంలో వైఎస్ జగన్ శైలి భిన్నంగా ఉంటుంది. డీఎస్సీ సమస్యను అడ్డం పెట్టుకుని అసెంబ్లీలోకి  గ్రాండ్ ఎంట్రీ ఇస్తారా.. లేదా యథావిధిగా సభ వెలుపలే ప్రెస్ మీట్లు పెట్టి మాకు మాట్లాడే సమయం ఇవ్వరు  కాబట్టే వెళ్లడం లేదు  అని సెంటిమెంట్ పండిస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా, డీఎస్సీ అంశంపై వైసీపీ చూపిస్తున్న దూకుడు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా ప్రజాస్వామ్యబద్ధమైన చర్చ జరగడమే రాష్ట్రానికి శ్రేయస్కరం అనేది ఎక్కువ మంది భావన. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
YSRCP Mavigun Vs Amaravati 2026: వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
వైసీపీ నేతల అమరావతి పర్యటనలో ఘర్షణలు - టీడీపీ ట్రాప్‌లో పడ్డారా? టీడీపీ ట్రాప్‌లో పడిందా?
Musi River Cleaning Execution Deadline: మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
మూసి ప్రాజెక్టుపై మాటల కంటే చేతలకే మైలేజ్ - రెండున్నరేళ్లలో రేవంత్ ఎంత చేయగలరు?
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget