అన్వేషించండి

YSRCP Lists News: సీనియర్ల టికెట్లపై తేల్చని సీఎం జగన్, మాజీ మంత్రులకూ షాక్ తప్పదా ?

YS Jagan On YSRCP Candidates: గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్న సీఎం జగన్‌...టికెట్ల కేటాయింపులో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ నేతలతో పాటు ఇంటెలిజెన్స్‌ నుంచి రిపోర్టులు తెప్పిస్తున్నారు.

Andhra Pradesh Assembly Elections 2024: గెలుపే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్న సీఎం జగన్‌ (Jagan)...టికెట్ల (Tickets)కేటాయింపులో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. పార్టీ నేతలతో పాటు ఇంటెలిజెన్స్‌ నుంచి రహస్య రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకతగా ఉన్న, ప్రజలకు అందుబాటులో ఉండని నేతలపై వేటు వేస్తున్నారు.

నాలుగున్నరేళ్లుగా ఎమ్మెల్యేల పని తీరును సీఎం జగన్‌ పరిగణలోకి తీసుకుంటున్నారు. గడపగడపకు కార్యక్రమం, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లారు ?  ప్రజల నుంచి వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌ ఏంటి ? అన్న దానిపై సమీక్ష చేసుకుంటున్నారు. గెలిచే వారికే టికెట్‌ అని తేల్చి పడేస్తున్నారు. నియోజకవర్గంలో అంతో ఇంతో పట్టున్న నేతలను బుజ్జగిస్తున్నారు. పార్టీ కోసం పని చేయాలని, అంతా నేను చూసుకుంటానంటూ భరోసా ఇస్తున్నారు. 

మంత్రులు తానేటి వనిత(Taneti VAnitha), అమర్ నాథ్, మాజీ మంత్రులు అవంతి శ్రీనివాస్ రావు(Avanthi Srinivas), బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ధర్మాన క్రిష్ణదాస్(Dhrmana Krishna Das), కురసాల కన్నబాబు, కొడాలి నాని, అనిల్ కుమార్(Ani Kumar), ఆళ్ల నాని, పాముల పుష్ఫశ్రీవాణి(Pushpa Srivani) పరిస్థితి ఏంటో ఇప్పటి దాకా తేల్చలేదు. అసలు వారికి సీటు ఉంటుందా ? ఉండదా ? ఒక వేళ సీటు ఇస్తే....సిట్టింగ్ స్థానామే ఇస్తారా లేదంటే పక్క నియోజకవర్గాలకు మార్చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అమర్నాథ్(Amarnath Reddy) ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి(Anakapalli) స్థానాన్ని మరొకరికి కేటాయించారు. అమర్నాథ్ కు టికెట్ ఉంటుందా ?  లేదా అన్నది సస్పెన్స్ గా మారింది.

మరో సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivas Reddy) పరిస్థితి కూడా గాల్లోదీపంలా మారింది. టికెట్ విషయంలో సీఎం జగన్ ఏమీ తేల్చకపోవడంతో...ఆయన హైదరాబాద్(Hyderabad) వచ్చేశారు. అవంతి శ్రీనివాసరావు, కన్నబాబు(Kanna Babu), ఆళ్ల నాని, అనిల్ కుమార్, పాముల పుష్ప శ్రీవాణి టికెట్ల విషయం ఎటూ తేల్చడం లేదు. టికెట్ రాదని నిర్ణయానికి వచ్చిన కొందరు నేతలు పక్క చూపులు చూస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పెండెం దొరబాబు(Pendem Dorababu), పర్వత ప్రసాద్, కొండేటి చిట్టిబాబు లాంటి నేతలకు టికెట్ లేదని తేల్చేశారు. దీంతో వారంతా తమ అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. పెండెం దొరబాబు...అనుచరులతో సమావేశం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్ ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ వీడటం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి. 

నియోజకవర్గాల్లో జరుగుతున్న అసంతృప్తులు, నిరసనలు, ఆందోళనలను ముఖ్యమంత్రి జగన్‌ పట్టించుకోవడం లేదు. ఫలితాలే ప్రామాణికంగా మార్పులు చేర్పుల చేస్తున్నారు. పక్కా ప్రణాళికలతో  గెలుపు లెక్కలు వేస్తున్నారు. ప్రత్యర్థులకు ఏ మాత్రం ఛాన్స్‌ ఇవ్వకుండా...ఎన్నికల స్కెచ్ వేస్తున్నారు జగన్‌. మొదటి రెండు జాబితాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి...ఏకంగా 14 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని పక్కన పెట్టేశారు సీఎం జగన్‌. మూడో జాబితాలో 21 మంది పేర్లు ప్రకటించారు. ఆరు ఎంపీ స్థానాలతో పాటు 15 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. 2019 ఎన్నికల్లో పక్కన పెట్టేసిన వారికి పిలిచి టికెట్ ఇచ్చారు. కొందరి కుటుంబాలకు ఒకటికి మించి టికెట్లు కేటాయించారు. బొత్స, కారుమూరి, ఆదిమూలపు కుటుంబాలకు రెండేసి టికెట్లు కేటాయించారు. అయితే పార్టీలోని కొందరు సీనియర్ నేతలకు మాత్రం ఇప్పటి వరకు టికెట్ పై క్లారిటీ ఇవ్వలేదు. అసలు వారి పరిస్థితి ఏంటో కూడా చెప్పలేదు. దీంతో సదరు సీనియర్ నేతల్లో వణకు మొదలైంది. 

Also Read: 'మా అబ్బాయి పెళ్లికి రండి' - చంద్రబాబుకు షర్మిల ఆహ్వానం

Also Read: బొత్స ఫ్యామిలీకి బంపర్‌ ఆఫర్‌- ఈసారి ఎన్నికల్లో ఐదుగురికి సీట్లు

 

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget